Hero Vishal Tweet On TVK Government Formation : తమిళనాడు రాజకీయాల్లో టీవీకే (TVK) అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశం ఇప్పుడు చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి విజయ్కు అవకాశం ఇవ్వడంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ జాప్యం చేస్తున్నారంటూ ప్రముఖ నటుడు(హీరో) విశాల్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
అలా ఎందుకు చేయటం లేదు..? హీరో విశాల్ ప్రశ్నలు

2017-18 కాలంలో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎదురైన రాజకీయ పరిస్థితులను విశాల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. "ఆయా రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ లేకపోయినప్పటికీ, అతిపెద్ద పార్టీలను లేదా కూటములను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్లు ఆహ్వానించారు. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా 'ఫ్లోర్ టెస్ట్' ద్వారా బలాన్ని నిరూపించుకోమని ఆదేశించారు. మరి అదే పద్ధతిని తమిళనాడులో విజయ్…. విషయంలో ఎందుకు అనుసరించడం లేదు…?" అని విశాల్ ప్రశ్నించారు.
తమిళనాడు ప్రజలు టీవీకే పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చారని…. మెజారిటీకి అత్యంత సమీపంలో ఉన్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆపడం ప్రజల తీర్పును అవమానించడమేనని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. "మనకు ఇప్పుడు కావాల్సింది ప్రజా ప్రభుత్వం, గవర్నర్ పాలన కాదు. 233 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ ప్రాథమిక హక్కులు కేవలం రాజకీయ నాయకులకే కాదు, తమిళనాడులోని ప్రతి సామాన్యుడికి తెలుసు" అని విశాల్ తన పోస్టులో రాసుకొచ్చారు.
{{/usCountry}}తమిళనాడు ప్రజలు టీవీకే పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చారని…. మెజారిటీకి అత్యంత సమీపంలో ఉన్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆపడం ప్రజల తీర్పును అవమానించడమేనని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. "మనకు ఇప్పుడు కావాల్సింది ప్రజా ప్రభుత్వం, గవర్నర్ పాలన కాదు. 233 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ ప్రాథమిక హక్కులు కేవలం రాజకీయ నాయకులకే కాదు, తమిళనాడులోని ప్రతి సామాన్యుడికి తెలుసు" అని విశాల్ తన పోస్టులో రాసుకొచ్చారు.
{{/usCountry}}విజయ్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "డియర్ విజయ్… మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక ఓటరుగా నేను అదే కోరుకుంటున్నాను" అంటూ హీరో విశాల్ తన మద్దతును ప్రకటించారు.
ప్రస్తుతం టీవీకే కూటమికి 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, మేజిక్ ఫిగర్ 118కి మరో ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశాల్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.