తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువైంది. అయితే ఈ హీరోయిన్ చిత్ర పరిశ్రమల్లో స్టార్గా ఎదిగే ముందు ఒక ఫోటోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది.
ఐశ్వర్య రాజేష్ ఆరోపణలు

హీరోయిన్ గా వెలుగులోకి రాకముందు తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని ఐశ్వర్య రాజేష్ పంచుకుంది. నిఖిల్ విజయేంద్ర సింహాతో జరిగిన ఓ పాడ్కాస్ట్లో యంగ్ ఏజ్ లో ఒక ఫోటోషూట్ సమయంలో ఫొటోగ్రాఫర్ లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఐశ్వర్య తెలిపింది. లింగరీ (లో దుస్తులు) ధరించాలని, బాడీ చూస్తామని అన్నాడని చెప్పింది.
సెక్సీ లో దుస్తులు
ఐశ్వర్య రాజేష్ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. “నేను సినిమాల్లోకి రాకముందు ఈ ఘటన జరిగింది. నన్ను ఓ ఫోటోషూట్కు పిలిచారు. నేను నా బ్రదర్ తో కలిసి వెళ్లా. నా బ్రదర్ ను బయట ఉండమనిన చెప్పారు. నన్ను లోపలికి తీసుకెళ్లారు. నాకు సెక్సీ లోదుస్తులు ఇచ్చి.. ‘ఇవి వేసుకో, నీ శరీరాన్ని చూడాలి’ అని ఫొటోగ్రాఫర్ అన్నాడు’’ అని తెలిపింది.
ఒప్పించాలని చూశారు
‘‘అప్పటికీ వయసులో చిన్నదాన్ని కాబట్టి ఏం జరుగుతోందో వెంటనే నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్, ఇతరులు నన్ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. వారు నన్ను మరింతగా ఫోర్స్ చేసి ఉంటే వాటిని వేసుకునేదాన్నేమో. కానీ నేను నా సోదరుడిని అడుగుతానని చెప్పి బయటకు వచ్చేశా. అక్కడి నుంచి వెళ్లిపోయా. ఎంతమంది చిన్న అమ్మాయిలతో వారు ఇలా ప్రవర్తించారో అని షాక్ కు గురయ్యా’’ అని ఐశ్వర్య రాజేష్ వెల్లడించింది.
ఐశ్వర్య రాజేష్ కెరీర్
తెలుగు నటుడు రాజేష్, నృత్య కళాకారిణి నాగమణిల కుమార్తె ఐశ్వర్య రాజేష్. వాళ్ల తాతయ్య అమర్నాథ్. సీనియర్ నటి శ్రీ లక్ష్మి.. ఐశ్వర్య రాజేష్ కు మేనత్త. ఐశ్వర్య చిన్న వయసులోనే తండ్రి రాజేష్ మరణించారు. ఐశ్వర్య చెన్నైలో పెరిగింది.
{{/usCountry}}తెలుగు నటుడు రాజేష్, నృత్య కళాకారిణి నాగమణిల కుమార్తె ఐశ్వర్య రాజేష్. వాళ్ల తాతయ్య అమర్నాథ్. సీనియర్ నటి శ్రీ లక్ష్మి.. ఐశ్వర్య రాజేష్ కు మేనత్త. ఐశ్వర్య చిన్న వయసులోనే తండ్రి రాజేష్ మరణించారు. ఐశ్వర్య చెన్నైలో పెరిగింది.
{{/usCountry}}1995లో వచ్చిన 'రాంబంటు' చిత్రంలో బాలనటిగా కనిపించింది ఐశ్వర్య రాజేష్. 2010లో వచ్చిన తమిళ చిత్రం 'నీథానా అవన్' తో డెబ్యూ చేసింది ఐశ్వర్య. 2015లో వచ్చిన 'కాకా ముట్టై' చిత్రంతో సక్సెస్ చూసింది. 2025 సంక్రాంతికి రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరో. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.