Prabhas: ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ ట్యాగ్‌పై ప్రభాస్ రియాక్షన్ ఏంటో తెలుసా? బాలీవుడ్ రచ్చకు సింపుల్ ఆన్సర్

Prabhas: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అనే ట్యాగ్ తో టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ సందీప్ రెడ్డి వంగా రచ్చ చేశారు. అయితే ఈ ట్యాగ్ పై ఎవరి రియాక్షన్ ఎలా ఉన్నా..  ప్రభాస్ ఎలా రియాక్ట్ అయ్యాడో తాజాగా ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు.

Published on: Aug 21, 2026, 22:05:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Prabhas: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ చూసి బాలీవుడ్ వర్గాలు షాక్ అవుతుంటే, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇస్తున్న 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' ట్యాగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పవర్‌ఫుల్ బిరుదుపై నార్త్ నెటిజన్లు, బాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టినా సందీప్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. అసలు ఈ ట్యాగ్ గురించి చెప్పినప్పుడు ప్రభాస్ ఎంత కూల్‌గా రియాక్ట్ అయ్యాడో ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా సీక్రెట్ బయటపెట్టేశారు.

Prabhas: ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ ట్యాగ్‌పై ప్రభాస్ రియాక్షన్ ఏంటో తెలుసా? బాలీవుడ్ రచ్చకు సింపుల్ ఆన్సర్
Prabhas: ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ ట్యాగ్‌పై ప్రభాస్ రియాక్షన్ ఏంటో తెలుసా? బాలీవుడ్ రచ్చకు సింపుల్ ఆన్సర్

బాలీవుడ్ ఫ్యాన్స్ రచ్చ.. సందీప్ వంగా మాస్ స్కెచ్

'బాహుబలి' ఫ్రాంచైజ్‌తో భారతీయ సినిమా స్టాండర్డ్స్ మార్చేసిన ప్రభాస్.. రీసెంట్‌గా వచ్చిన 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల కలెక్షన్ల సునామీ సృష్టించారు. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లోనూ ప్రభాస్ కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తుండటంతో, ఆయన తదుపరి చిత్రం 'స్పిరిట్' అనౌన్స్‌మెంట్‌తోనే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఈ క్రమంలోనే 'స్పిరిట్' సినిమా ప్రమోషనల్ కంటెంట్‌లో ప్రభాస్ పేరుకు ముందు 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అనే ట్యాగ్ జోడించాలని సందీప్ వంగా డిసైడ్ అయ్యారు. అయితే ఈ ట్యాగ్ చూసి బాలీవుడ్ టాప్ హీరోల అభిమానులు, ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సందీప్ వంగాలను, 'స్పిరిట్' మూవీని ట్రోల్ చేయడం ప్రారంభించారు. కానీ ఎంత రచ్చ జరిగినా సందీప్ మాత్రం తర్వాతి పోస్టర్లలోనూ అదే ట్యాగ్‌ను కంటిన్యూ చేస్తూ తన బోల్డ్ యాటిట్యూడ్ చూపించారు.

"మీ ఇష్టం డార్లింగ్!".. ప్రణయ్ వంగా రివీల్ చేసిన సీక్రెట్

తాజాగా 'రోమాంచకం' మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా (సందీప్ రెడ్డి వంగా సోదరుడు) ఈ ట్యాగ్ వివాదంపై గుల్టే ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ట్యాగ్ గురించి విన్నప్పుడు ప్రభాస్ ఎలా స్పందించారనేది ఆయన వివరించారు.

"మేము ప్రభాస్ దగ్గరకు వెళ్లి.. స్పిరిట్ సినిమాలో మీ పేరుకు ముందు 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అని వేద్దాం అనుకుంటున్నాం అని చెప్పాం. దానికి ప్రభాస్ చాలా సింపుల్‌గా నవ్వేస్తూ.. ‘మీ ఇష్టం డార్లింగ్’ అని ఒకే ఒక్క మాట అన్నారు. ఆయనకు ఎలాంటి ఈగోలు ఉండవు. డైరెక్టర్ విజన్‌ను వంద శాతం నమ్ముతారు" అని ప్రణయ్ వంగా తెలిపారు.

బాక్సాఫీస్ సునామీకి 'స్పిరిట్' రెడీ

'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' లాంటి వరుస సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్లతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ప్రభాస్‌ను ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నారు. ప్రభాస్ కెరీర్‌లోనే ఇది మొదటి పూర్తిస్థాయి ఖాకీ కాంబినేషన్ కావడంతో ట్రేడ్ వర్గాల్లో మైండ్ బ్లాకింగ్ బిజినెస్ జరుగుతోంది.

వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో టైటిల్ కార్డ్స్‌లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చే సమయానికి 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' ట్యాగ్ పడితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ ఇచ్చిన ఈ సింపుల్ రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో డార్లింగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More