'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన మనోజ్ బాజ్పాయ్.. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా 'ఘూస్ఖోర్ పండత్' (Ghooskhor Pandat) అనే సినిమాతో రాబోతున్నాడు. నీరజ్ పాండే సమర్పణలో రితేష్ షా దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ మంగళవారం (ఫిబ్రవరి 3) విడుదలైంది. అయితే టీజర్ కంటెంట్ కంటే సినిమా టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. టైటిల్లో వాడిన పదజాలం కుల వివక్షను సూచించేలా ఉందంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు వివాదం ఏంటి?

ఈ ఘూస్ఖోర్ పండత్ సినిమాలో మనోజ్ బాజ్పాయ్ ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. కథ ప్రకారం అతని పేరు అజయ్ దీక్షిత్ అయినప్పటికీ.. అందరూ అతన్ని 'పండిత్' (Pandat) అని పిలుస్తుంటారు. అయితే ఒక అవినీతిపరుడి కథకు 'ఘూస్ఖోర్' (లంచగొండి) అనే పదానికి 'పండిత్' అనే పదాన్ని జోడించి టైటిల్ పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బ్రాహ్మణ సమాజాన్ని, పండితులను కించపరచడమేనని పలువురు ఆరోపిస్తున్నారు.
"వేరే మతాల పేర్లు పెట్టే దమ్ముందా?"
ఎక్స్ వేదికగా నెట్ఫ్లిక్స్ ఇండియాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కేవలం ఒక వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్గా చేసుకుని విషం చిమ్ముతున్నారని మండిపడుతున్నారు.
"ఈ టైటిల్ చాలా అభ్యంతరకరంగా ఉంది. నెట్ఫ్లిక్స్ ఇండియాకు దమ్ముంటే 'ఘూస్ఖోర్ దళిత్' అనో లేదా 'ఘూస్ఖోర్ ముస్లిం' అనో టైటిల్ పెట్టి వెబ్ సిరీస్ తీయగలదా? వెంటనే దీనిని మార్చండి" అని ఒక యూజర్ సవాల్ విసిరారు.
మరొక యూజర్ స్పందిస్తూ.. "పండితులను, బ్రాహ్మణులను ద్వేషించడం ఇప్పుడు అలవాటుగా మారింది. దీన్ని మేము సహించం. కోర్టులో తేల్చుకుంటాం" అని హెచ్చరించారు.
"ఇది ముమ్మాటికీ కుల వివక్షే. మీ అజెండాను అమలు చేయడానికి మా వర్గాన్ని వాడుకుంటున్నారా? టైటిల్ మార్చకపోతే నెట్ఫ్లిక్స్ను మూకుమ్మడిగా బాయ్కాట్ చేస్తాం" అని హెచ్చరికలు జారీ చేశారు.
{{/usCountry}}"ఇది ముమ్మాటికీ కుల వివక్షే. మీ అజెండాను అమలు చేయడానికి మా వర్గాన్ని వాడుకుంటున్నారా? టైటిల్ మార్చకపోతే నెట్ఫ్లిక్స్ను మూకుమ్మడిగా బాయ్కాట్ చేస్తాం" అని హెచ్చరికలు జారీ చేశారు.
{{/usCountry}}"షోకు ఏ పేరైనా పెట్టొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగానే ఒక నెరేటివ్ సెట్ చేయడానికి ఇలాంటి పేర్లు పెడుతున్నారు. వారికి బుద్ధి చెప్పాలంటే బాయ్కాట్ ఒక్కటే మార్గం" అని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఘూస్ఖోర్ పండత్ సినిమా కథేంటి?
ఢిల్లీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ కథలో.. అజయ్ దీక్షిత్ అలియాస్ పండిత్ (మనోజ్ బాజ్పాయ్) త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో తప్పులు చేసే ఓ పోలీస్ ఆఫీసర్. అనుకోకుండా ఒక అంతర్జాతీయ కుట్రలో చిక్కుకున్న అతను.. తీవ్రంగా గాయపడిన ఒక యువతి వివరాలు కనుగొనే ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది కథాంశం.
ఇందులో నుస్రత్ బరూచా, దివ్యా దత్తా, సాకిబ్ సలీమ్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతానికి ఈ వివాదంపై నెట్ఫ్లిక్స్ గానీ, మూవీ టీమ్ గానీ స్పందించలేదు. పెరుగుతున్న నిరసనల నేపథ్యంలో టైటిల్ మారుస్తారా లేదా అనేది వేచి చూడాలి.