Ravi Teja Irumudi 1st Day Worldwide Box Office Collection: మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన సరికొత్త తెలుగు రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ కొట్టింది. నిన్న (ఆగస్ట్ 21) థియేటర్లలో విడుదలైన ఇరుముడి సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ఫాదర్-డాటర్ ఎమోషనల్ సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ ఇరుముడి చిత్రం మొదటిరోజే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రవితేజ మార్కెట్ బలాన్ని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తొలిరోజు కలెక్షన్ల వర్షం కురిపించింది.
ప్రపంచవ్యాప్తంగా రూ. 24 కోట్లకు పైగా గ్రాస్!
ప్రముఖ ట్రేడ్ నివేదికల ప్రకారం.. 'ఇరుముడి' చిత్రం భారత్ వ్యాప్తంగా మొదటిరోజు రూ. 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమా, తొలిరోజే 76.9 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని సాధించడం విశేషం.
గ్రాస్ పరంగా చూస్తే ఇండియాలో రూ. 17.20 కోట్లు వసూలు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 7 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తొలిరోజే రవితేజ ఇరుముడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 24.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
తెలుగు వెర్షన్ హవా.. నైట్ షోలకు హాట్ కేకుల్లా టికెట్లు!
ఇరుముడి సినిమా గ్రాండ్ ఓపెనింగ్లో సింహభాగం తెలుగు వెర్షన్ నుంచే వచ్చింది. భారత్లో సాధించిన మొత్తం నెట్ వసూళ్లలో ఒక్క తెలుగు వెర్షనే రూ. 14.78 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని 2,591 షోలకు గాను సగటున 79 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళ వెర్షన్ నుంచి 82 షోల ద్వారా రూ. 2 లక్షలు మాత్రమే వచ్చాయి.
తెలుగు షోలలో ముఖ్యంగా నైట్ షోలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాత్రి ఆటలకు ఏకంగా 88.08 శాతం థియేటర్లు నిండిపోగా, ఈవెనింగ్ షోలలో 78.69 శాతం, ఆఫ్టర్ నూన్ షోలలో 73.62 శాతం, మార్నింగ్ షోలలో 66.69 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
తెలుగు రాష్ట్రాల నుంచే రూ. 15 కోట్ల గ్రాస్
{{/usCountry}}తెలుగు షోలలో ముఖ్యంగా నైట్ షోలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాత్రి ఆటలకు ఏకంగా 88.08 శాతం థియేటర్లు నిండిపోగా, ఈవెనింగ్ షోలలో 78.69 శాతం, ఆఫ్టర్ నూన్ షోలలో 73.62 శాతం, మార్నింగ్ షోలలో 66.69 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
తెలుగు రాష్ట్రాల నుంచే రూ. 15 కోట్ల గ్రాస్
{{/usCountry}}రవితేజకు స్ట్రాంగ్ మార్కెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే ఈ సినిమా రాబడికి ప్రధాన కేంద్రాలుగా నిలిచాయి. రెండు రాష్ట్రాల నుంచి కలిపి తొలిరోజే ఇరుముడి సినిమాకు రూ. 15 కోట్ల గ్రాస్ వసూలైంది. కర్ణాటక నుంచి రూ. 1.50 కోట్లు, తమిళనాడు నుంచి రూ. 34 లక్షలు రాగా.. కేరళ నుంచి రూ. 1 లక్ష, మిగిలిన భారతీయ ప్రాంతాల నుంచి రూ. 35 లక్షలు వసూలయ్యాయి.
చిరంజీవి రికార్డును బద్దలు కొట్టిన రవితేజ
అంతేకాకుండా బుక్ మై షోలో చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా పేరిట ఉన్న ఆల్టైమ్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డును రవితేజ ఇరుముడి బద్దలుకొట్టేసింది. బుక్ మై షోలో ఒక్క గంటలో 31.6 వేల మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్స్ అమ్ముడుపోగా తాజాగా ఇరుముడి టికెట్స్ 32.25 వేలకుపైగా సేల్ అయ్యాయి.
అలా చిరంజీవి సినిమాను రవితేజ మూవీ బ్రేక్ చేసేసింది. పాన్ ఇండియా సినిమాలను పక్కనపెట్టి చూస్తే రీజనల్ మూవీస్లో ఇదే అత్యధిక టికెట్ సేల్స్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తండ్రీకూతుళ్ల బంధం.. కంటతడి పెట్టిస్తున్న ఎమోషన్!
కాగా, 'ఇరుముడి' చిత్రంలో రవితేజ 'త్రినాథ్' అనే భక్తి భావం కలిగిన అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించారు. మద్యం వ్యసనం ఉన్న త్రినాథ్, తన కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర) మధ్య ఉండే అనుబంధమే ఈ కథకు ప్రధాన బలం.
మరోవైపు సాయి కుమార్ 'గోపాల్ రాజు' అనే పాత్రలో, తన కూతురు గాయత్రిని పెంచే క్రమంలో భిన్నమైన ఆలోచనా ధోరణిని ప్రదర్శిస్తారు. వేర్వేరు మనస్తత్వాలు ఉన్న ఈ రెండు కుటుంబాల ప్రయాణం, పిల్లల పెంపకం, వారిపై చూపే ప్రేమ చుట్టూ తిరిగే భావోద్వేగ సన్నివేశాలు, పిల్లల మరణాలు, వాటి కారకులు, వారిని త్రినాథ్ కనిపెట్టిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.