...
...
Next Story

Irumudi: ఇరుముడిలో ఆ లాజిక్ మిస్సయ్యారా.. ఆ రెండు జీవితాలను నాశనం చేసి ఏం సందేశమిచ్చారంటూ ఓ డాక్టర్ ప్రశ్న

Irumudi Criticism: ఇరుముడి మూవీ రూ.100 కోట్లకుపైగానే వసూలు చేసినా.. తాజాగా ఇందులో ఓ లాజిక్ మిస్సవడంపై విమర్శలు వస్తున్నాయి. ఓ డాక్టర్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.

Published on: Aug 27, 2026, 15:03:31 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Irumudi Criticism: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి' బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న వేళ, ఈ సినిమాలోని కీలకమైన పాయింట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ రాసుకున్న కథనంలోని వైరుధ్యాలను ఎత్తిచూపుతూ ఒక నెటిజన్ వేసిన ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

"ధైర్యంగా ఉంటే చంపేస్తారా?".. నెటిజన్ మైండ్ బ్లాకింగ్ ప్రశ్న

Irumudi: ఇరుముడిలో ఆ లాజిక్ మిస్సయ్యారా.. ఆ రెండు జీవితాలను నాశనం చేసి ఏం సందేశమిచ్చారంటూ ఓ డాక్టర్ ప్రశ్న
Irumudi: ఇరుముడిలో ఆ లాజిక్ మిస్సయ్యారా.. ఆ రెండు జీవితాలను నాశనం చేసి ఏం సందేశమిచ్చారంటూ ఓ డాక్టర్ ప్రశ్న

ఒకవైపు పిల్లలు ఎలాంటి విషయం జరిగినా తండ్రికి ధైర్యంగా చెప్పాలని, భయం లేకుండా బతకాలని ఇరుముడి సినిమా ప్రారంభంలో చెప్పిన డైరెక్టర్.. ఆ తర్వాత నిజం చెప్పాలనుకున్న కూతురి పాత్రను ఎందుకు చంపేశారని కార్డియలాజిస్ట్ అయిన ఉప్పలపాటి రామ్‌వర్మ అనే వ్యక్తి నిలదీశారు. సమాజంలో ధైర్యంగా ఉండే అమ్మాయిలకు ప్రేరణగా నిలవాల్సిన పాత్రను అర్ధాంతరంగా అంతం చేయడం వల్ల ఎలాంటి సందేశం ఇచ్చినట్లవుతుందని ప్రశ్నించడం గమనార్హం.

సినిమాలు సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని, నిజాలు మాట్లాడితే ప్రాణాలు పోతాయనే భయం పిల్లల్లో కలిగించేలా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ధైర్యంగా ఉన్న అమ్మాయి బతికి ఉంటే ఎంతోమందికి ప్రేరణగా నిలిచేది కదా అని సదరు నెటిజన్ తన ఆవేదనను వెళ్లగక్కారు.

భయం vs ధైర్యం.. శివ నిర్వాణ విజన్‌పై అనుమానాలు

ఇక మరోవైపు సాయికుమార్ క్యారెక్టర్ ద్వారా "అమ్మాయిలు భయంతో పెరగడమే శ్రీరామరక్ష" అని చెప్పించడాన్ని కూడా ఆయన తప్పుబడుతున్నారు. నిజం చెబితే ప్రాణాలు పోతాయనే భయంతో ఇంకొక అమ్మాయి నిజాన్ని దాచిపెట్టి, ఎమ్మెల్యే చేతిలో జీవితాన్ని నాశనం చేసుకుంటుందని.. అసలు ఈ రెండు పాత్రల ద్వారా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారో అర్థం కావడం లేదని విశ్లేషించారు.

'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' లాంటి ఇంటెన్స్ ఎమోషనల్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ శివ నిర్వాణ నుంచి ఇలాంటి స్క్రీన్‌ప్లే లోపాలను ఊహించలేదని ఫ్యాన్స్ అంటున్నారు. సాధారణంగా శివ నిర్వాణ సినిమాల్లో హ్యూమన్ ఎమోషన్స్, పాత్రల మధ్య బంధం చాలా బలంగా ఉంటాయి. కానీ 'ఇరుముడి' విషయంలో మాత్రం ప్రధానమైన కథాంశంలోనే ఈ అయోమయం ఏర్పడిందని ట్రేడ్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.

సినిమాలను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలోనే చూడాలని కొందరు అంటున్నా, సమాజంపై ప్రభావం చూపే కీలకమైన పాయింట్లు ఉన్నప్పుడు కథాంశంలో అది ఉండాలని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.

బాక్సాఫీస్ సక్సెస్.. అయినా లోపాలతో విమర్శలు

బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న 'ఇరుముడి' సినిమా కమర్షియల్‌గా ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ, ఈ సామాజిక అంశంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజ మార్క్ ఎనర్జీ, అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యం ఆడియన్స్‌కు కనెక్ట్ అయినప్పటికీ, మెసేజ్ విషయంలో మాత్రం క్లారిటీ మిస్ అయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై డైరెక్టర్ శివ నిర్వాణ లేదా మూవీ టీమ్ ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe