...
...
Next Story

Jagapathi Babu: ఉప్పెనలో నన్ను కాదని విజయ్ సేతుపతిని తీసుకున్నాడు.. నాకు మార్కెట్ లేదన్నాడు.. జగపతి బాబు సంచలన కామెంట్లు

Jagapathi Babu: పెద్ది సినిమాలో అప్పలసూరిగా ఆడియన్స్ ను మరోసారి తన నటనతో ఆకట్టుకోబోతున్నాడు జగపతి బాబు. అయితే బుచ్చిబాబు డైరెక్షన్ లోనే వచ్చిన ఉప్పెన సినిమాలో రాయణం క్యారెక్టర్ విషయంలో జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ తానేనని చెప్పాడు.

Published on: May 29, 2026, 13:44:19 IST
Advertisement

Jagapathi Babu: లెజెండ్ తో తన యాక్టింగ్ కెరీర్ ను సరికొత్తగా మొదలెట్టాడు జగపతి బాబు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న అతను.. ఇప్పుడు విలక్షణమైన నటనతో డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేస్తున్నాడు. తాజాగా పెద్దిలో అప్పలసూరిగా నటించాడు. ఈ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పెద్ది క్యారెక్టర్ కోసం

బుచ్చిబాబుపై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు (x)
బుచ్చిబాబుపై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు (x)

రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వ్వూలో జగపతి బాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఫస్ట్ పెద్ది మూవీలోని అప్పలసూరి క్యారెక్టర్ గురించి జగపతి బాబు మాట్లాడాడు.

‘‘బుచ్చిబాబు డైరెక్ట్ గా నా దగ్గరకేం రాలేదు. నలుగురైదుగురు దగ్గరకు వెళ్లాడు. వాళ్లు నో అంటే ఓ ట్రయల్ వేద్దామని వచ్చి నన్ను కలిశాడు. నా టైమ్ బాగుండి వర్కౌట్ అయింది’’ అని జగపతి బాబు చెప్పాడు.

ఉప్పెనలో

ఈ క్రమంలోనే ఉప్పెనలో విజయ్ సేతుపతి పోషించిన రాయణం క్యారెక్టర్ కోసం ఫస్ట్ తననే బుచ్చిబాబు కలవాల్సిందని జగపతి బాబు వెల్లడించాడు. ‘‘ఉప్పెన గురించి మాట్లాడటానికి వస్తానన్నాడు. గేటు వరకూ వచ్చాడు. సరై పైకి రమ్మని చెప్పా. కానీ సార్, అర్జెంట్ గా ఇంట్లో ఏదో పని ఉందని చెప్పి వెళ్లిపోయాడు. మ్యాటర్ ఏంటీ అంటే.. మనసు మార్చుకున్నాడు. విజయ్ సేతుపతి దగ్గరకు వెళ్దామని అనుకున్నాడు’’ అని జగపతి బాబు చెప్పాడు.

మార్కెట్ లేదని

సూపర్ హిట్

బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఉప్పెన. ఇందులో వైష్ణవ్ తేజ్ హీరో. మూవీలో హీరోయిన్ తండ్రి రాయణం క్యారెక్టర్ ను విజయ్ సేతుపతి ప్లే చేశాడు. తన కూతురిని ప్రేమించే అబ్బాయికి అత్యంత క్రూరమైన శిక్ష వేసే కిరాతక తండ్రిగా విజయ్ సేతుపతి నటించాడు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ సేతుపతి యాక్టింగ్ కు ప్రశంసలు దక్కాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe