Jailer 2 First Single Ala Bolelo song: సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' నుంచి ఫస్ట్ సింగిల్ 'అల బొలేలో' (Ala Bolelo) ఎట్టకేలకు రిలీజ్ అయింది. రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పెప్పీ డ్యాన్స్ నెంబర్లో రజనీకాంత్తో పాటు నటి షామ్నా కాసిమ్ (పూర్ణ) కనిపించి అలరించారు. ఓనం పండుగ సందర్భంగా కేరళ ఫ్యాన్స్ కోసం స్పెషల్గా విడుదల చేసిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఓనం స్పెషల్ ట్రాక్.. కలర్ఫుల్ విజువల్స్

నాలుగు నిమిషాల నిడివితో వచ్చిన జైలర్ 2 మూవీ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోలో షామ్నా కాసిమ్ పద్ధతైన కేరళ సంప్రదాయ కసావు చీర కట్టుకుని మాస్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్తో మెప్పించింది. ఆమె వేసిన స్టెప్పులకు తోడుగా బ్యాక్గ్రౌండ్లో రజనీకాంత్ తనదైన వింటేజ్ స్వాగ్, స్టైలిష్ లుక్స్తో ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ పాటను అనిరుధ్ రవిచందర్ స్వయంగా ఆలపించగా, అరుణ్రాజా కామరాజ్ లిరిక్స్ అందించారు. నిరంజన రామన్, అపర్ణ హరికుమార్, దీప్తి సురేష్ అడిషనల్ ఒకల్స్ పాటలోని వైబ్ను మరింత పెంచాయి.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ రచ్చ.. ఆ తప్పుల వల్లే..
పాట విడుదలైన కొన్ని గంటలకే సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ఊహించని విమర్శలు మొదలయ్యాయి. ఓనం కాన్సెప్ట్తో మలయాళ ఫ్లేవర్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, అనిరుధ్ పాడిన మలయాళ పదాల ఉచ్ఛారణ సరిగ్గా లేదని కేరళ ఆడియెన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మలయాళం లిరిక్స్ రాయడానికి కేరళకు చెందిన రైటర్ను, సింగర్ను ఎందుకు తీసుకోలేదని ఫ్యాన్స్ అనిరుధ్ను ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా లిరికల్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్లు వేర్వేరు దిశల్లో డ్యాన్స్ చేయడం కూడా ట్రోలింగ్కు గురైంది.
'జైలర్ 2' సినిమాపై మైండ్ బ్లాకింగ్ ఎక్స్పెక్టేషన్స్
2023లో వచ్చి బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన 'జైలర్' మూవీకి ఇది అధికారిక సీక్వెల్. డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
{{/usCountry}}2023లో వచ్చి బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన 'జైలర్' మూవీకి ఇది అధికారిక సీక్వెల్. డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
{{/usCountry}}టైగర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో రజనీకాంత్, ఆయన భార్యగా రమ్యకృష్ణ మళ్లీ సీక్వెల్లో అలరించబోతున్నారు. యోగి బాబు, మిర్నా, రిత్విక్ తమ క్యారెక్టర్లను రీప్రైజ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిన పాయింట్ నుంచే సెకండ్ పార్ట్ స్టోరీ నడుస్తుందని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.
బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్
ఫస్ట్ పార్ట్లో మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్ మెరుపు కామియోలు సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. రెండో భాగంలోనూ వారు కనిపిస్తారని సమాచారం. వీరితో పాటు ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, సూరజ్ వెంజారమూడు, జతిన్ సర్నా లాంటి పాన్-ఇండియా స్టార్స్ కొత్తగా కాస్ట్లో చేరారు.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అక్టోబర్ 15న ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది.