Jailer 2 First Single: సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. జైలర్ 2 ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్

Jailer 2 First Single: సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న 'జైలర్ 2' ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఈ శుక్రవారం (ఆగస్ట్ 21) ఫస్ట్ సింగిల్ రాబోతోందని మేకర్స్ పోస్టర్ వదిలారు. అనిరుధ్ ఇచ్చే మాస్ ట్రాక్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

Published on: Aug 18, 2026, 20:37:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jailer 2 First Single: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి అరాచకం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’తో థియేటర్లలో రచ్చ చేయబోతున్నారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా వచ్చేస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటోంది.

Jailer 2 First Single: సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. జైలర్ 2 ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్
Jailer 2 First Single: సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. జైలర్ 2 ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్

ఈ ఏడాది దసరా పండుగ కానుకగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. 'టైగర్' ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మాస్ మేనియాని మరోసారి పెద్ద తెరపై చూడటానికి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ శుక్రవారమే ఫస్ట్ సింగిల్ ధమాకా

ఇక అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూ చిత్రబృందం ప్రమోషన్ల వేగం పెంచింది. ఈ శుక్రవారం (ఆగస్ట్ 21) రోజున జైలర్ 2 నుంచి మొదటి పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు రజనీకాంత్ కొత్త లుక్ ఉన్న ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా వదిలారు.

ఈ పోస్టర్ బయటకు రాగానే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మొదటి భాగంలో రజనీ మేనరిజం, స్టైల్ ఏ స్థాయిలో ఆకట్టుకున్నాయో.. ఈ సీక్వెల్‌లో అంతకు మించి ఉండబోతున్నాయని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే స్పష్టమవుతోంది.

అనిరుధ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా?

'జైలర్ పార్ట్-1' సాధించిన సంచలన విజయం వెనుక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పాత్ర ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో ప్రతీ సీన్‌ను తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అనిరుధ్ వేరే లెవెల్‌కి తీసుకెళ్లారు. ముఖ్యంగా 'హుకుమ్' పాట థియేటర్లలో తెచ్చిన పూనకాలు సాధారణమైనవి కావు.

ఆ పాట సినిమా విజయంలో కీలక మలుపుగా మారింది. అందుకే ఇప్పుడు జైలర్ 2 ఆల్బమ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిరుధ్ గనక మళ్లీ 'హుకుమ్' రేంజ్ మాస్ ట్రాక్ ఇస్తే, సినిమాపై ఉన్న హైప్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది. అనిరుధ్ మార్క్ మాస్ సాంగ్ కోసం మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్‌లో గ్రాండ్ మేకింగ్

ఈ భారీ సీక్వెల్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ 'సన్ పిక్చర్స్' అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్సులతో చిత్రకథను తెరకెక్కించారు.

మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో జైలర్ 2పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన బిజినెస్ క్రేజ్ నెలకొంది. దసరా రేసులో రజనీకాంత్ దిగుతుండటంతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అక్టోబర్ 15న జైలర్ 2 వస్తోంది. అయితే ఒక రోజు గ్యాప్ లో చిరంజీవి విశ్వంభర కూడా రానుండటం దాదాపు ఖాయం కావడంతో తెలుగులో జైలర్ 2కి గట్టి పోటీ ఎదురు కానుంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్, మెగాస్టార్ పోటీ రసవత్తరంగా ఉండనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More