బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ తన పుట్టినరోజును (మార్చి 6) తిరుమల శ్రీవారి సన్నిధిలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంది. ఏటా తన పుట్టినరోజున వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్న జాన్వీ.. ఈసారి తన మొక్కును తీర్చుకునేందుకు అలిపిరి మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకుంది. ఈ సందర్భంగా జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్, జాన్వీ బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. జాన్వీ బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా తన ప్రియురాలు జాన్వీతో ఉన్న ఒక క్యూట్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. హార్ట్ ఎమోజీతో "హ్యాపీ బర్త్ డే" అని పోస్ట్ చేశాడు.
జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ అయితే తన అక్క జాన్వీకి అత్యంత ఎమోషనల్ బర్త్ డే విషెస్ చెప్పింది. అమ్మ శ్రీదేవితో కలిసి ఉన్న పాత ఫోటోలను షేర్ చేస్తూ.. "నా సోదరి, నా బెస్ట్ ఫ్రెండ్, నా టీచర్, నా పార్ట్నర్ ఇన్ క్రైమ్.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. నీవు లేనిదే నేను ఏమీ లేను. ప్రతి జన్మలోనూ నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ రాసుకొచ్చింది.
మొక్కు తీర్చుకున్న జాన్వీ.. 3,550 మెట్లు ఎక్కి..
తిరుమల శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తితో జాన్వీ కపూర్ అలిపిరి కాలినడక మార్గంలోని 3,550 మెట్లను ఎక్కి తిరుమలకు చేరుకుంది. తెల్లవారుజామునే కొండపైకి చేరుకున్న ఆమె.. సామాన్య భక్తులతో కలిసి ముచ్చటిస్తూ, సెల్ఫీలు ఇస్తూ వినమ్రంగా కనిపించింది.
అనంతరం ఆమెకు ఆలయ అధికారులు వీఐపీ దర్శన సౌకర్యం కల్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. గతేడాది ఆమెతో పాటు వచ్చిన ప్రియుడు శిఖర్ పహారియా ఈసారి మాత్రం కనిపించలేదు.
బాక్సాఫీస్ వద్ద 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' జోరు
{{/usCountry}}అనంతరం ఆమెకు ఆలయ అధికారులు వీఐపీ దర్శన సౌకర్యం కల్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. గతేడాది ఆమెతో పాటు వచ్చిన ప్రియుడు శిఖర్ పహారియా ఈసారి మాత్రం కనిపించలేదు.
బాక్సాఫీస్ వద్ద 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' జోరు
{{/usCountry}}వృత్తిపరంగా కూడా జాన్వీ కపూర్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది. ఆమె నటించిన తాజా మూవీ 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹98- ₹100 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇక ఆమె అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న తెలుగు చిత్రం 'పెద్ది' (Peddi) షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్ 30న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.