గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను కలవాలనే కోరికతో జపాన్ నుంచి ఒక అభిమానుల బృందం హైదరాబాద్కు వచ్చింది. జూబ్లీహిల్స్లోని చరణ్ నివాసంలో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. తన కోసం వారు స్వయంగా తయారు చేసిన బహుమతులను చూసి చరణ్ మురిసిపోయాడు. వారితో చరణ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
థియేటర్లో 100 సార్లు.. చరణ్ షాక్

జపాన్ నుంచి తనను కలవడానికి అభిమానులు రావడం చూసి రామ్ చరణ్ ఆశ్చర్యపోయాడు. అంతేకాదు ఈ ఆత్మీయ కలయికలో ఒక జపాన్ అభిమాని చరణ్ పట్ల చూపిన ప్రేమ అందరినీ ఆశ్చర్యపరిచింది. వాళ్ల వెంట వచ్చిన ఓ ట్రాన్స్లేటర్ చరణ్తో మాట్లాడుతూ.. "ఈమె 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాను 100 సార్ల కంటే ఎక్కువ చూసింది. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఆ సినిమాను ప్రతిరోజూ చూసేవారు" అని చెప్పారు.
దీంతో ఆశ్చర్యపోయిన చరణ్.. "నెట్ఫ్లిక్స్లోనా?" అని అడగగా.. ఆ అభిమాని "కాదు, సినిమా హాళ్లలోనే" అని బదులిచ్చారు. ఈ మాట వినగానే చరణ్ షాక్ అయ్యాడు. వెంటనే ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. చరణ్ తనను పలకరించడంతో ఆ అభిమాని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.
హైదరాబాద్లో 'కన్మణి టూర్'
రామ్ చరణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ 'మగధీర' షూటింగ్ జరిగిన ప్రదేశాలను, ముఖ్యంగా గోల్కొండ కోటను ఈ జపాన్ బృందం సందర్శించింది. ఈ యాత్రకు వారు 'కన్మణి టూర్' అని పేరు పెట్టుకోవడం విశేషం. చరణ్ కనురెప్పలు అంటే తమకు చాలా ఇష్టమని ఒక అభిమాని చెప్పగా, మరొక అభిమాని గతంలో తానిచ్చిన బొమ్మ ఇంకా చరణ్ దగ్గర భద్రంగా ఉందని తెలిసి 30 నిమిషాల పాటు ఏడ్చానని చెప్పడం వారి అభిమానానికి నిదర్శనం. చరణ్ లేటెస్ట్ మూవీస్ 'గేమ్ చేంజర్', 'పెద్ది' జపాన్లో సబ్టైటిల్స్తో విడుదల కావాలని వారు కోరుకున్నారు.
చరణ్ కెరీర్ అప్డేట్స్
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' 2022లో జపాన్లో విడుదలయ్యాక ఎన్టీఆర్, చరణ్లకు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. గతంలో బాహుబలి నటులకు దక్కిన ఆదరణే ఇప్పుడు వీరికి దక్కుతోంది.
{{/usCountry}}రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' 2022లో జపాన్లో విడుదలయ్యాక ఎన్టీఆర్, చరణ్లకు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. గతంలో బాహుబలి నటులకు దక్కిన ఆదరణే ఇప్పుడు వీరికి దక్కుతోంది.
{{/usCountry}}ఈ ఏడాది (2025) ప్రారంభంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ చేంజర్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' అనే మూవీలో నటిస్తున్నాడు. జాన్వీ కపూర్, శివ రాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2026న విడుదల కానుంది.