ధురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు జనాలు ఈ సినిమాలోని ప్రతి సీన్ గురించి, క్యారెక్టర్ల గురించి తెగ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ అయితే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో రణ్వీర్ సింగ్ చేసిన హమ్జా క్యారెక్టర్ను చూసి ఒకరు.. "ఇంటికి రావాలనిపించలేదా జస్సీ?" (ఘర్ కీ యాద్ నహీ ఆయీ జస్సీ?) అని అడుగుతారు. ఇప్పుడు ఈ డైలాగ్ ట్రెండ్లోకి మన స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా గణేశన్ కూడా వచ్చి చేరింది.
సంజనా ఫన్నీ మీమ్.. బుమ్రా ప్లాన్స్ గల్లంతు!

తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో సంజనా ఒక ఫన్నీ మీమ్ షేర్ చేసి, పెళ్లయిన తర్వాత మగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సరదాగా చెప్పింది. బుమ్రా ఎప్పుడైనా తన ఫ్రెండ్స్తో కలిసి బాయ్స్ నైట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారీ అతనికి ఎదురయ్యే పరిస్థితిని ఈ మీమ్తో పోల్చింది.
ధురంధర్ 2 సినిమాలో పిండా క్యారెక్టర్ చేసిన ఉదయ్బీర్ సంధుకు ఒక విగ్గు పెట్టి మరీ ఈ మీమ్ క్రియేట్ చేశారు. జస్ప్రీత్ బాయ్స్ నైట్ ప్లాన్ చేద్దాం అనుకున్న ప్రతిసారీ.. నీకు ఇల్లు గుర్తుకు రాలేదా జస్సీ? అని అందులో రాసుకొచ్చింది. అంటే తన భర్త ఎప్పుడైనా ఇల్లు వదిలి ఫ్రెండ్స్తో నైట్ అవుట్ ప్లాన్ చేస్తే, తాను ఈ డైలాగ్తోనే సెటైర్ వేస్తానని సంజనా నవ్వుతున్న ఎమోజీలతో భలే ఫన్నీగా చెప్పుకొచ్చింది.
ధురంధర్ సినిమాల స్టోరీ ఏంటంటే..
అసలు ధురంధర్ సినిమా కథ విషయానికొస్తే.. ఫస్ట్ పార్ట్లో రణ్వీర్ సింగ్ ఒక ఇండియన్ స్పైగా పాకిస్థాన్లోని లియారీ గ్యాంగ్స్లో కలిసిపోయి, ఇండియాను టార్గెట్ చేసిన టెర్రరిస్టులను ఎలా మట్టుబెట్టాడు అనేది చూపించారు. కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ అటాక్, 26/11 ముంబై దాడుల నేపథ్యంలో ఈ స్టోరీ నడిచింది. ఇక ఇప్పుడు వచ్చిన సీక్వెల్లో అతను అసలు హమ్జా అలీ మజారీగా ఎలా మారాడు, అతనికి ట్రైనింగ్ ఎలా జరిగింది అనేది చూపించారు.
అలాగే లియారీ ఏరియాను తన కంట్రోల్లోకి తీసుకుని టెర్రర్ నెట్వర్క్ను ఎలా నాశనం చేశాడనేది ఇందులో మెయిన్ పాయింట్. రణ్వీర్, అర్జున్ రాంపాల్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే గూస్బంప్స్ తెప్పిస్తాయి. మాధవన్, రాకేష్ బేడీ, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి వాళ్లు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
స్టార్స్ ప్రశంసలు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ
{{/usCountry}}అలాగే లియారీ ఏరియాను తన కంట్రోల్లోకి తీసుకుని టెర్రర్ నెట్వర్క్ను ఎలా నాశనం చేశాడనేది ఇందులో మెయిన్ పాయింట్. రణ్వీర్, అర్జున్ రాంపాల్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే గూస్బంప్స్ తెప్పిస్తాయి. మాధవన్, రాకేష్ బేడీ, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి వాళ్లు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
స్టార్స్ ప్రశంసలు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ
{{/usCountry}}ఈ సినిమా చూసిన మన స్టార్స్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఆలియా భట్, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్లంతా తమ సోషల్ మీడియాలో సినిమాను తెగ మెచ్చుకుంటున్నారు. గత బుధవారం (మార్చి 18) రికార్డ్ బ్రేకింగ్ ప్రీమియర్స్ వేసిన తర్వాత, గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఇండియాలో రూ.145 కోట్లు, వరల్డ్వైడ్గా రూ.240 కోట్లు రాబట్టిన ఈ యాక్షన్ మూవీ, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్ల కలెక్షన్లు సాధించి దూసుకుపోతోంది.