...
...
Next Story

JioHome TV Pack: నెలకు రూ. 400లకే 1,000కిపైగా ఛానెళ్లు, వైఫై, 12 ప్రీమియం ఓటీటీలు.. జియో సరికొత్త ధమాకా ప్లాన్!

JioHome TV Pack 400 Plan: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారతీయ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో సరికొత్త విప్లవానికి తెరలేపింది. నెలకు కేవలం రూ.400 ధరతోనే 1,000కి పైగా లైవ్ టీవీ ఛానళ్లు, హై-స్పీడ్ వై-ఫై, 12 ప్రీమియం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన జియోహోమ్ టీవీ ప్యాక్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

Published on: Jul 13, 2026, 19:38:00 IST
Advertisement

JioHome TV Pack 400 Plan: భారతీయ టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు ఇంటి వినోద విభాగంలోనూ తన మార్కును చూపిస్తోంది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతోనే డిజిటల్ వినోదాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా 'జియోహోమ్ టీవీ ప్యాక్' (JioHome TV Pack) పేరుతో ఒక సమగ్ర ప్లాన్‌ను ఆవిష్కరించింది.

రూ. 400కే

నెలకు రూ. 400లకే 1,000కిపైగా ఛానెళ్లు, వైఫై, 12 ప్రీమియం ఓటీటీలు.. జియో సరికొత్త ధమాకా ప్లాన్!
నెలకు రూ. 400లకే 1,000కిపైగా ఛానెళ్లు, వైఫై, 12 ప్రీమియం ఓటీటీలు.. జియో సరికొత్త ధమాకా ప్లాన్!

హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని కేబుల్, డీటీహెచ్ (DTH) మార్కెట్‌ను ఈ ఆఫర్ పూర్తిగా మార్చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. నెలకు కేవలం రూ. 400 (అన్ని పన్నులతో కలిపి) ప్రారంభ ధరతోనే లైవ్ టీవీ ఛానళ్లు, హై-స్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ సేవలను ఒకే ప్లాన్ కింద చేర్చారు.

ఒకే ప్లాన్.. వెయ్యికి పైగా ఛానళ్లు

ప్రస్తుతం వేర్వేరుగా కేబుల్ కనెక్షన్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ బిల్లులు చెల్లిస్తూ నెలకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్న వినియోగదారులకు ఈ కొత్త ప్యాక్ పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. ఈ సరికొత్త హోమ్ టీవీ ప్యాక్ ద్వారా కస్టమర్లు ఏకంగా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే వీలుంటుంది. వార్తలు, సినిమాలు, క్రీడలు, పిల్లల వినోదం ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరికీ నచ్చే అన్ని రకాల ఛానళ్లను ఇందులో పొందుపరిచారు.

ఉచిత వైఫై, ఓటీటీలతో వెల్‌కమ్ ఆఫర్

కొత్తగా కనెక్షన్ తీసుకునే కస్టమర్ల కోసం జియో ఒక ఆకర్షణీయమైన వెల్‌కమ్ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. ఈ ఆఫర్ కింద సబ్‌స్క్రైబ్ చేసుకునే వారికి మొదటి నెల రోజుల పాటు 30 Mbps వేగంతో అపరిమిత ఉచిత వై-ఫై సేవలు లభిస్తాయి. దీనితో పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండానే 12 ప్రీమియం ఓటీటీ (OTT) యాప్‌ల సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా ఇస్తున్నారు.

ఈ సరికొత్త సేవలను పొందడానికి జియో ఒక పారదర్శకమైన ధరల విధానాన్ని తీసుకొచ్చింది. వినియోగదారులు మొదటగా రూ. 2,400 (జీఎస్టీతో కలిపి) చెల్లించి ఫస్ట్ రీఛార్జ్ (FRC) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్ మొత్తం ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌కు వర్తిస్తుంది. అంటే ఈ లెక్కన నెలకు కచ్చితంగా రూ. 400 మాత్రమే ఖర్చవుతుంది. ఎలాంటి హిడెన్ చార్జీలు (Hidden Charges) లేకుండా ఈ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నారు.

సాధారణంగా కొత్తగా ఇంటర్నెట్ లేదా సెట్ టాప్ బాక్స్ కనెక్షన్లు తీసుకోవాలంటే ఇన్‌స్టాలేషన్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో భారీగా ముందస్తుగా చెల్లించాల్సి వస్తుంది. కస్టమర్లపై ఈ ముందస్తు ఆర్థిక భారాన్ని తప్పించడానికి జియో కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 0 ఇన్‌స్టాలేషన్ ఛార్జీలతో పాటు, రూ. 0 సెక్యూరిటీ డిపాజిట్‌తోనే ఈ కనెక్షన్‌ను అందిస్తోంది.

ఒకే ప్యాకేజీలో అన్నీ

దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ డిజిటల్ కనెక్టివిటీని చేర్చాలనే లక్ష్యంతో జియో అడుగులు వేస్తోంది. లైవ్ టీవీ, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, ప్రీమియం ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్‌లను ఒకే ప్యాకేజీలో అందిస్తూ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొత్త నిర్వచనాన్ని ఇస్తోంది. ఈ సంచలన ఆఫర్ రాకతో రానున్న రోజుల్లో హోమ్ బ్రాడ్‌బ్యాండ్, టెలివిజన్ రంగాల్లో పోటీ మరింత తీవ్రం కానుందని తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe