Jr NTR Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' (Dragon) కాస్టింగ్ గురించి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ బిగ్ ప్రాజెక్ట్లోకి బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ అధికారికంగా జాయిన్ అయ్యారు.
ఆలియా, షాహిద్ కపూర్ కంబ్యాక్.. డ్రాగన్లో హైలైట్

ప్రముఖ ఫిలిం పోర్టల్ గుల్టే (Gulte) రిపోర్టు ప్రకారం.. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎపిక్లో షాహిద్ కపూర్, ఆలియా భట్ అత్యంత కీలకమైన పాత్రల్లో నటించనున్నారు. గతంలో 'ఉడ్తా పంజాబ్', 'షాందార్' వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్, ఇప్పుడు ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమా ద్వారా మళ్లీ ఒకే స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.
పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలున్న ఈ సినిమాలో ఆలియా భట్ క్యారెక్టర్ డ్రామాకు ప్రాణం పోస్తుందని, షాహిద్ కపూర్ పాత్ర మాస్ ఆడియన్స్కు మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
అనిల్ కపూర్ నుంచి రుక్మిణి వసంత్ దాకా..
ఈ డ్రాగన్ సినిమాలో కేవలం షాహిద్, ఆలియా మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాలోని దిగ్గజ నటులు భాగమవుతున్నారు. బాలీవుడ్ ఎవర్గ్రీన్ స్టార్ అనిల్ కపూర్, 'సప్త సాగరదాచే ఎల్లో' ఫేమ్ రుక్మిణి వసంత్, మలయాళ వర్సటైల్ యాక్టర్ బిజు మీనన్, సీనియర్ నటుడు అశుతోష్ రాణా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇంతమంది సీనియర్ స్టార్లతో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్న డ్రామా, వరల్డ్ బిల్డింగ్ ఇండియన్ స్క్రీన్స్ పైన ఎప్పుడూ చూడని రీతిలో ఉండబోతోందని సమాచారం.
హైదరాబాద్లోనే షూటింగ్.. జూన్ 2027 రిలీజ్ టార్గెట్
{{/usCountry}}ఇంతమంది సీనియర్ స్టార్లతో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్న డ్రామా, వరల్డ్ బిల్డింగ్ ఇండియన్ స్క్రీన్స్ పైన ఎప్పుడూ చూడని రీతిలో ఉండబోతోందని సమాచారం.
హైదరాబాద్లోనే షూటింగ్.. జూన్ 2027 రిలీజ్ టార్గెట్
{{/usCountry}}జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల చిన్నపాటి సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన రికవరీ అవుతుండగానే, మేకర్స్ హైదరాబాద్లోని స్పెషల్ సెట్స్లో షూటింగ్ను ఏమాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూ చేస్తున్నారు.
ప్రస్తుతం వేగంగా జరుగుతున్న ఈ చిత్రీకరణను పక్కా ప్లానింగ్తో పూర్తి చేసి.. 2027 జూన్ నెలలో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రశాంత్ నీల్.. 'ఆర్ఆర్ఆర్', 'దేవర' చిత్రాలతో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్తో కలిసి చేస్తున్న ఈ 'డ్రాగన్' థియేటర్లలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.