Vijayendra Prasad: లవ్ సస్పెన్స్ డ్రామాగా కళ్యాణం కమనీయం జీవితం ఫస్ట్ లుక్ రిలీజ్- ఇంప్రెస్ అయ్యానన్న విజయేంద్ర ప్రసాద్

Kalyanam Kamaneeyam Jeevitham Movie First Look Released: తెలుగులో వస్తోన్న లెటేస్ట్ లవ్ సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామా చిత్రం కళ్యాణం కమనీయం జీవితం. తాజాగా కళ్యాణం కమనీయం జీవితం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రైటర్ విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 28, 2026, 15:06:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kalyanam Kamaneeyam Jeevitham Movie First Look Released: వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా కళ్యాణం కమనీయం జీవితం. ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లవ్ సస్పెన్స్ డ్రామాగా కళ్యాణం కమనీయం జీవితం ఫస్ట్ లుక్ రిలీజ్- ఇంప్రెస్ అయ్యానన్న విజయేంద్ర ప్రసాద్
లవ్ సస్పెన్స్ డ్రామాగా కళ్యాణం కమనీయం జీవితం ఫస్ట్ లుక్ రిలీజ్- ఇంప్రెస్ అయ్యానన్న విజయేంద్ర ప్రసాద్

కళ్యాణం కమనీయం జీవితం ఫస్ట్ లుక్ రిలీజ్

తాజాగా కళ్యాణం కమనీయం జీవితం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కళ్యాణం కమనీయం జీవితం చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు.

చెప్పగానే ఇంప్రెస్ అయ్యాను

ఈ సందర్భంగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "టైటిల్ చాలా బాగుంది. రాజవంశీ ఈ టైటిల్ గురించి చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. ప్రొడ్యూసర్స్ మంచి ప్రయత్నం చేశారు. డైరెక్టర్ విజన్ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. హీరో హీరోయిన్ లకు, ఈ సినిమా టీమ్‌కు అల్ ది బెస్ట్" అని చెప్పారు.

కథ చెప్పగానే చేయాలనిపించింది

నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ.. "విజయేంద్ర ప్రసాద్ గారు అడగగానే మా పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఆయనకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు. డైరెక్టర్ కథ చెప్పగానే తప్పకుండా ఈ సినిమా చేయాలి అనిపించింది. దర్శకుడు చెప్పిన విధంగా సినిమా తీశాడు సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.

పాన్ వరల్డ్ స్టార్ రైటర్ ఆవిష్కరించడం

మరో నిర్మాత కిషోర్ గుండాల మాట్లాడుతూ.. "పాన్ వరల్డ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు పోస్టర్‌ను ఆవిష్కరించి టీమ్‌కు బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథ, కథనాలతో ఈ సినిమాని తెరకెక్కించాము. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము" అని పేర్కొన్నారు.

సినిమా సక్సెస్ అయినంత ఆనందం

దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ: "విజయేంద్ర ప్రసాద్ గారు మా పోస్టర్‌ని ఆవిష్కరించడంతో నే మా సినిమా సక్సెస్ అయినంత ఆనందంగా ఉంది. నిర్మాతలు నా కథను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు" అని చెప్పారు సినిమా దర్శకుడు రవి లోకిరెడ్డి.

లవ్, సస్పెన్స్‌తో ఉత్కంఠంగా

"ప్రేమ సస్పెన్స్ కలయికతో ఒక ఉత్కంఠ భరితంగా సినిమా ఉంటుంది. అలాగే మా టీమ్ అంతా కలిసి ఒక మంచి ప్రయత్నం చేసాము. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను" అని కళ్యాణం కమనీయం జీవితం డైరెక్టర్ రవి లోకిరెడ్డి తెలిపారు.

కళ్యాణం కమనీయం జీవితం నటీనటులు

ఇదిలా ఉంటే, కళ్యాణం కమనీయం జీవితం సినిమాలో ఖాన్ దురాని, సాహితీ అవంచ, ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, ధనలక్ష్మి బల్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందించగా.. వెంకటరాజు డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More