...
...
Next Story

Kamal Haasan: కమల్ హాసన్ సర్‌ప్రైజ్ పోస్ట్.. క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’పై కామెంట్స్ వైరల్

Kamal Haasan: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ మూవీపై కమల్ హాసన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ది ఒడిస్సీ కమల్ హాసన్ అనుభవం పేరుతో ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ త్వరలోనే దీనికి సంబంధించిన కంటెంట్ రాబోతోందని వెల్లడించారు.

Published on: Jul 30, 2026, 19:29:13 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Kamal Haasan: తమిళ నటుడు కమల్ హాసన్ హాలీవుడ్ జీనియస్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 6,000 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్న ఈ హాలీవుడ్ ఎపిక్ డ్రామాను చూసిన కమల్.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. భారతీయ సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ఈ ప్రత్యేక కానుకకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆయన ప్రకటించడం ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

"నోలన్ ధైర్యానికి జోహార్లు".. కమల్ హాసన్ మైండ్ బ్లాకింగ్ పోస్ట్

Kamal Haasan: కమల్ హాసన్ సర్‌ప్రైజ్ పోస్ట్.. క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’పై కామెంట్స్ వైరల్ (AFP)
Kamal Haasan: కమల్ హాసన్ సర్‌ప్రైజ్ పోస్ట్.. క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’పై కామెంట్స్ వైరల్ (AFP)

ప్రపంచ ప్రసిద్ధ గ్రీకు కవి హోమర్ రాసిన చారిత్రక కావ్యం ఆధారంగా తెరకెక్కిన 'ది ఒడిస్సీ' చిత్రంలో మ్యాట్ డామన్, యాన్ హాత్వే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను చూసిన కమల్ హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. "హోమర్ కలలు కన్నారు. నోలన్ దానిని సాకారం చేసే ధైర్యం చేశారు. నేను మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టాను. సినిమా ప్రేమికులు ఖచ్చితంగా చూడాల్సిన అద్భుత కావ్యమిది" అని కొనియాడారు.

అంతేకాకుండా.. "ప్రపంచవ్యాప్తంగా 'ది ఒడిస్సీ' దిగ్విజయంగా సాగుతున్న వేళ, భారతీయ థియేటర్లలో ప్రేక్షకులకు స్వాగతం పలకడానికి నా ప్రత్యేక ఆహ్వానం రాబోతోంది. సెన్సార్ బోర్డు ఇప్పటికే ఈ స్పెషల్ కంటెంట్‌ను చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది" అని కమల్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు లోకనాయకుడు ఇండియా కోసం ఏ తరహా కంటెంట్ లేదా కాంప్లిమెంటరీ వీడియో రెడీ చేశారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ది ఒడిస్సీ.. కమల్ హాసన్ అనుభవం అనే స్పెషల్ పోస్టర్ ను కూడా కమల్ షేర్ చేశారు.

బ్యాక్ టు బ్యాక్ బిగ్ ప్రాజెక్ట్స్.. కమల్ హాసన్ గ్రాండ్ లైనప్

వీటితో పాటు ప్రముఖ ఫైట్ మాస్టర్లు అన్బరివ్ దర్శకత్వంలో ఓ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో ఆయన నటిస్తున్నారు. ఇక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD' సీక్వెల్ షూటింగ్‌లోనూ కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో మెరవనున్నారు.

ఏఐ కోర్సు.. ప్రొడక్షన్ ఖర్చులపై ఓపెన్ లెటర్

కేవలం నటనకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో కమల్ హాసన్ ఎప్పుడూ ముందే ఉంటారు. హాలీవుడ్ సాంకేతికతపై పట్టు సాధించేందుకు అమెరికా వెళ్లిన ఆయన.. 90 రోజుల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లెర్నింగ్ కోర్సులో భాగమయ్యారు. ఏఐ అనేది సినిమా విజువల్స్‌లో ప్రారంభ దశలోనే ఉందని, సాంకేతికతను చూసి భయపడాల్సిన అవసరం లేదని ఆయన ఇటీవలే స్పష్టం చేశారు.

మరోవైపు ఇండస్ట్రీలో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో నిర్మాణ వ్యయాలను తగ్గించుకోవాలని కోరుతూ భారతీయ చిత్రసీమకు కమల్ ఒక బహిరంగ లేఖ రాశారు. అనవసరమైన విదేశీ ప్రయాణాలు, ప్రొడక్షన్ ఆలస్యం, భారీ హంగామా ఖర్చులను తగ్గించుకుని కష్టపడే కార్మికులకు నష్టం కలగకుండా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

నటుడిగా, దర్శకుడిగా, సాంకేతిక నిపుణుడిగా నిరంతరం సరికొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్న లోకనాయకుడు 'ది ఒడిస్సీ' కోసం ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారో చూడటానికి సినీ ప్రపంచం ఉత్కంఠగా వేచి చూస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe