Ranveer Singh: ఇండస్ట్రీలో పాకిస్థాన్‌ను ఇష్టపడే వాళ్లు ఉన్నారు.. వాళ్ల కడుపు మండే రణ్‌వీర్‌ను టార్గెట్ చేశారు: కంగనా

Ranveer Singh: 'ధురంధర్' సినిమాతో వరల్డ్ వైడ్ గా భారీ విజయం అందుకున్న రణ్‌వీర్ సింగ్‌ను బాలీవుడ్‌లోని ఒక వర్గం కావాలనే టార్గెట్ చేస్తోందని నటి, ఎంపీ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. పరిశ్రమలోని కొందరికి ఉన్న 'పాకిస్థాన్ ప్రేమే' ఈ మొత్తం వివాదానికి అసలు కారణమని ఆమె ఘాటుగా స్పందించారు.

Published on: Jun 12, 2026, 14:50:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ చుట్టూ నడిచిన 'డాన్ 3' వివాదంపై ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి తనదైన శైలిలో గొంతు విప్పారు. రణ్‌వీర్‌ను పరిశ్రమలో ఒంటరిని చేసి, టార్గెట్ చేయడం వెనుక కొందరి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

Ranveer Singh: ఇండస్ట్రీలో పాకిస్థాన్‌ను ఇష్టపడే వాళ్లు ఉన్నారు.. వాళ్ల కడుపు మండే రణ్‌వీర్‌ను టార్గెట్ చేశారు: కంగనా
Ranveer Singh: ఇండస్ట్రీలో పాకిస్థాన్‌ను ఇష్టపడే వాళ్లు ఉన్నారు.. వాళ్ల కడుపు మండే రణ్‌వీర్‌ను టార్గెట్ చేశారు: కంగనా

గత నెలలో ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ హఠాత్తుగా తప్పుకోవడంతో, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అతనిపై నాన్-కోఆపరేషన్ నోటీసులు జారీ చేసింది. ఆ టైమ్ లోనే రణ్‌వీర్‌కు మద్దతు తెలిపిన కంగనా.. ఇప్పుడు లేటెస్ట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ అసలు రంగు బయటపెట్టారు.

Pakistan Love | బాలీవుడ్‌లో పాకిస్థాన్ ప్రేమే కారణం

"బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరికి పాకిస్థాన్ అంటే ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉంది. మన దేశంలో వచ్చే చాలా సినిమాలు పాకిస్థాన్‌ను వెనకేసుకొస్తుంటాయి" అని న్యూస్18 ఇంటర్వ్యూలో కంగనా పేర్కొన్నారు.

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన తర్వాతే ఈ వివాదం రావడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. "పాకిస్థాన్ అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చూపే సినిమా హిట్ అయితే, ఇన్నేళ్లుగా ఆ దేశాన్ని వెనకేసుకొచ్చిన కొందరికి కడుపు మండుతుంది. తాము ప్రమోట్ చేసిన దానికి విలువ లేకుండా పోయిందని ఫీలవుతూ రణ్‌వీర్‌ను టార్గెట్ చేశారు" అని ఆమె విశ్లేషించారు.

Dhurandhar Success | బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ధురంధర్'

ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన 'ధురంధర్' మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు పార్ట్స్ గా రిలీజై సుమారు రూ.3000 కోట్లకు పైగా వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇండియన్ స్పై పాకిస్థాన్ అండర్‌వరల్డ్‌లోకి వెళ్లి, ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఎలా అణచివేశాడనే దేశభక్తి కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది.

ఈ క్రేజ్ వల్లే రణ్‌వీర్ 'డాన్ 3' నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. షూటింగ్ టైమ్ దగ్గరపడుతుండగా రణ్‌వీర్ తప్పుకోవడం వల్ల ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రూ.45 కోట్ల నష్టం జరిగిందని ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు చేసినా, చివరకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ జోక్యంతో ఆ నోటీసులు వెనక్కి తీసుకున్నారు.

Kangana's Bharat Bhagya Vidhata | థియేటర్లలో కంగనా 'భారత్ భాగ్య విధాత'

ఈ వివాదాల మధ్యే కంగనా రనౌత్ లేటెస్ట్ మూవీ 'భారత్ భాగ్య విధాత' థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముంబై ఉగ్రదాడుల టైమ్ లో కామా హాస్పిటల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పేషెంట్లను ఎలా కాపాడారనే కథతో దర్శకుడు మనోజ్ తపడియా ఈ సినిమాను తెరకెక్కించారు. గిరిజా ఓక్, స్మితా తాంబే, అమృతా నామ్‌దేవ్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమాలో కంగనా నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

People Also Ask (FAQs)

రణ్‌వీర్ సింగ్‌ను టార్గెట్ చేయడానికి కారణం ఏంటని కంగనా అంటున్నారు?

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని చూపించిందని, ఆ సక్సెస్ చూడలేక బాలీవుడ్‌లోని పాకిస్థాన్ అనుకూల వర్గం రణ్‌వీర్‌ను టార్గెట్ చేసిందని కంగనా అభిప్రాయపడ్డారు.

'ధురంధర్' ఎంత కలెక్ట్ చేసింది?

ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.

'భారత్ భాగ్య విధాత' సినిమా ఏ కథతో తెరకెక్కింది?

ముంబై ఉగ్రదాడుల టైమ్ లో కామా హాస్పిటల్ సిబ్బంది వీరత్వాన్ని చాటిచెప్పే కథతో ఈ సినిమా రూపొందింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More