పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ మరికొన్ని గంటల్లోనే అంటే గురువారం (అక్టోబర్ 23) నుంచి నెట్ఫ్లిక్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో కన్నడ సినిమా కబ్జా డైరెక్టర్ చంద్రు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ఓజీ ట్రైలర్ చూస్తేనే సీన్ టు సీన్ కబ్జా నుంచి కాపీ కొట్టినట్లుగా ఉందని అనడం విశేషం.
కాపీ కాదు కానీ ఇన్స్పైర్ అయ్యారు

ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రతోపాటు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ నటించిన మూవీ కబ్జా. 2023లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. చాలా మంది ఈ సినిమాను కేజీఎఫ్ తో పోల్చారు. ఒరిజినాలిటీ లేదంటూ పెదవి విరిచారు. అయితే ఇప్పుడా సినిమా డైరెక్టర్ అయిన ఆర్.చంద్రు తన కబ్జా మూవీ నుంచి ప్రేరణ పొందే ఓజీ సినిమా తీశారని అనడం విశేషం.
ముఖ్యంగా కెమెరా యాంగిల్స్ అన్నీ అలాగే ఉన్నట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోందని అతడు స్పష్టం చేశాడు. ఇప్పుడు ఓజీ మూవీ చూసి ఇలా ఉంది.. అలా ఉంది అని తెగ పొగుడుతున్నారు.. కొన్నేళ్ల కిందటే నేను అలా తీశాను.. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు అని ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చంద్రు అన్నాడు. ఓజీ మూవీలో ప్రతి గన్ షాటూ, మేకింగ్ అంతా కబ్జాలో ఉన్నట్లుగానే ఉందని, దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని చెప్పాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
నేనూ పవన్ అభిమానినే..
అయితే ఇదే సందర్భంలో చంద్రు మాట్లాడుతూ.. ఓజీ సినిమాను కాపీ కొట్టారని అనను కానీ తన కబ్జా సినిమా నుంచి ప్రేరణ పొంది తీశారని, సినిమా ఇండస్ట్రీలో ఇది సహజమే అని అన్నాడు. అంతేకాదు తాను కూడా పవన్ కల్యాణ్ కు అభిమానినే అని, ఒకసారి అతన్ని కలిశానని కూడా చెప్పాడు. అయితే తన బాధల్లా తన కబ్జా సినిమాను ఇలాగే తీసినా మాట్లాడిన ప్రేక్షకులు ఇప్పుడు మాత్రం ఓజీని తెగ పొగిడేస్తున్నారని చంద్రు అన్నాడు.
ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్
పవన్ కల్యాణ్ ఓజస్ గంభీరా అనే పాత్రలో నటించిన ఈ ఓజీ మూవీ మరికొన్ని గంటల్లోనే నెట్ఫ్లిక్స్ లోకి రాబోతోంది. గురువారం (అక్టోబర్ 23) నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సినిమాలో ప్రియాంకా మోహన్, ఇమ్రాన్ హష్మి కూడా నటించారు. ఈ మూవీ పవన్ కల్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ ఓజీ మూవీకి ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
{{/usCountry}}పవన్ కల్యాణ్ ఓజస్ గంభీరా అనే పాత్రలో నటించిన ఈ ఓజీ మూవీ మరికొన్ని గంటల్లోనే నెట్ఫ్లిక్స్ లోకి రాబోతోంది. గురువారం (అక్టోబర్ 23) నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సినిమాలో ప్రియాంకా మోహన్, ఇమ్రాన్ హష్మి కూడా నటించారు. ఈ మూవీ పవన్ కల్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ ఓజీ మూవీకి ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
{{/usCountry}}