ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు కామెడీ మూవీ- బిర్యాని కోసం ముగ్గురు ఓల్డ్ ఫ్రెండ్స్ కష్టాలు- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ నేరుగా లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ బిర్యాని పాయింట్ స్ట్రీమింగ్ వచ్చేసింది. ముగ్గురు ఓల్డ్ ఫ్రెండ్స్ బిర్యాని కోసం పడే కష్టాలతో ఈ సినిమా సాగుతుంది. ఆద్యంతం నవ్వించేలా సాగే కరిముల్లా బిర్యాని పాయింట్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఎన్నో రకాల జోనర్స్, డిఫరెంట్ కథలతో ఓటీటీ సినిమాలు అలరిస్తుంటాయి. వాటిలో చాలా వరకు తెలుగు స్ట్రయిట్ సినిమాలతోపాటు తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా ఉంటున్నాయి.

అచ్చమైన తెలుగు మూవీ
అయితే, అచ్చ తెలుగు కథలతో మాత్రం అరకొర సినిమాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ప్రతి ఆదివారం ఓ అచ్చమైన తెలుగు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ (నవంబర్ 30) కూడా ఓటీటీ తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ అయింది.
బిర్యాని కోసం
ఆ సినిమానే కరిముల్లా బిర్యాని పాయింట్. నూతక్కి అనేది మూవీ క్యాప్షన్. ఓల్డ్ ఏజ్లో ముగ్గురు ఫ్రెండ్స్ బిర్యాని కొనేందుకు పడే కష్టాల కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. కరిముల్లా బిర్యాని పాయింట్ సినిమాకు ప్రభు చంద్ కథ, దర్శకత్వం వహించారు.
ముగ్గురు పాత్రల చుట్టూ
ఈ సినిమాలో చైతన్య సగిరాజు, కంచెరపాలెం రాజు, శివ నారాయణ నరిపెద్ది (అమృతం ఫేమ్ అప్పాజి) ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్గా ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు కేదార్, సుజన జొన్నాల హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ ఇద్దరితో లవ్ రొమాంటిక్ ట్రాక్ నడిస్తే.. ముగ్గురు ఓల్డ్ ఫ్రెండ్స్తో కామెడీ చూపించారు.
కూతురు కోసం
ఉదయ్ సద్దాల నిర్మించిన కరిముల్లా బిర్యాని పాయింట్ సినిమాకు పి కల్యాణ్ కుమార్ సినిమాటోగ్రఫీ, ప్రతీక్ నూతి ఎడిటింగ్ వర్క్స్ చేశారు. ఆదిత్య బీఎన్ సంగీతం అందించారు. ముగ్గురు ఫ్రెండ్స్లో ఒకరి కూతురికి బిర్యాని అంటే చాలా ఇష్టం. అది కూడా కరిముల్లా బిర్యాని పాయింట్లోని బిర్యానినే అతి ఇష్టంగా తింటుంది.
డబ్బు కోసం పడే పాట్లు
ఆ కరిముల్లా బిర్యాని పాయింట్లో బిర్యానిని కూతురికి ఎలాగైనా కొనివ్వాలని తండ్రి ఆరాటపడుతుంటాడు. అది కొనేందుకు డబ్బుల కోసం తన ఇద్దరు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాడు. అలా ముగ్గురు కలిసి డబ్బు కోసం పడే పాట్లు ఏంటీ? డబ్బు కోసం ఏమేం పనులు చేశారు? చివరికి బిర్యాని కొన్నారా? అనేదే ఈ సినిమా స్టోరీ.
కరిముల్లా బిర్యాని పాయింట్ ఓటీటీ రిలీజ్
చాలా సింపుల్ లైన్ అయినప్పటికీ తండ్రి ఎమోషన్ను కామెడీ, భావోద్వేగాలతో చూపించిన కరిముల్లా బిర్యాని పాయింట్ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ఈటీవీ విన్లో నేటి నుంచి కరిముల్లా బిర్యాని పాయింట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి ఆదివారం ఈటీవీ విన్ కథా సుధా వీక్లీ సిరీస్ వస్తుందన్న విషయం తెలిసిందే.
ఈటీవీ విన్ ఓటీటీలో
అందులో భాగంగానే నేడు కరిముల్లా బిర్యాని పాయింట్ ఓటీటీ రిలీజ్ అయింది. అంతేకాకుండా కేవలం 37.19 నిమిషాల రన్టైమ్తో కరిముల్లా బిర్యాని పాయింట్ సినిమా తెరకెక్కింది. మరి ముగ్గురు ఓల్డేజ్ ఫ్రెండ్స్ ఫన్ చూడాలనుకుంటే ఈటీవీ విన్ ఓటీటీలో కరిముల్లా బిర్యాని పాయింట్ మూవీని వీక్షించొచ్చు.













