కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్కు సుమిత్ర నోటి నుంచి రక్తం పడిన విషయం గురించి చెబుతుంది దీప. అమ్మకు ఏదైనా వ్యాధి ఉందా అని భయపడుతుంది. దాంతో గురూజీ చెప్పిన గండం అత్తకేనా అని కార్తీక్ అనుమానిస్తాడు. కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ భయాలు, టెన్షన్ పడకూడదని కార్తీక్ నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్.
నా వల్లే చనిపోయిందనేది

ఒక తల్లిని తెలియకుండానే పోగొట్టుకున్నాను. మరో తల్లిని పోగోట్టుకోలేను. మా అమ్మ అనారోగ్యంతో పోయింది. కానీ మా అత్త మాత్రం నావల్ల చనిపోయిందనేది. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా నా భయం అని దీప అంటుంది. అర్థమవుతోంది. ఒకసారి మావయ్యతో మాట్లాడుదాం అని కార్తీక్ అంటాడు. దశరథ్తో మాట్లాడుతారు.
దీప ప్రెగ్నెంట్ కాకముందునుంచే మీ అత్తకు ఆరోగ్యం బాలేదురా. కానీ పట్టించుకోలేదని దశరథ్ అంటాడు. ఇంతలో సుమిత్ర వస్తుంది. హాస్పిటల్కు ఎందుకు అని అడుగుతుంది. నీకు టెస్ట్లు చేయించాలని కార్తీక్ అంటాడు. వయసు వచ్చాక ఆరు నెలలకు ఓసారి టెస్ట్లు చేయించుకోవాలని దశరథ్ అంటాడు. నీ విషయంలో ఏ చిన్నది జరిగిన ఆయన తట్టుకోలేరు అని కార్తీక్ అంటాడు.
టెస్టులు నాకు సుమిత్ర
టెస్టులు నాకు సుమిత్ర. కొద్దిరోజులుగా అన్ఈజీగా ఉంటుంది అని దశరథ్ అంటాడు. వెంటనే హాస్పిటల్కు వెళ్దామని సుమిత్ర అంటుంది. ఇద్దరు టెస్టులు చేయించుకోండని కార్తీక్ అంటే సరే అంటుంది. శివ నారాయణకు మాత్రం తనకు బాగా లేదని అబద్ధం చెప్పమని సుమిత్ర అంటుంది. దాంతో కార్తీక్, దీప, దశరథ్ ఎమోషనల్ అవుతారు.
ఇద్దరు వెళ్తారు. దీప ఏడుస్తూ భయపడుతుంది. కార్తీక్ ఓదారుస్తాడు. ముత్యాలమ్మ తల్లి మా అమ్మకు ఏం కాకూడదు అని మొక్కుకుంటుంది. మరోవైపు సుమిత్రకు టెస్ట్లు చేయిస్తారు. సుమిత్రకు ఏం చెప్పనని డాక్టర్ అంటాడు. మరోవైపు శివ నారాయణ సీరియస్ అవుతాడు. ల్యాప్ట్యాప్లో అందరికి శ్రీధర్ అరెస్ట్ చూపిస్తుంది జ్యోత్స్న.
అందుకే నీ తల్లి వదిలేసింది
{{/usCountry}}ఇద్దరు వెళ్తారు. దీప ఏడుస్తూ భయపడుతుంది. కార్తీక్ ఓదారుస్తాడు. ముత్యాలమ్మ తల్లి మా అమ్మకు ఏం కాకూడదు అని మొక్కుకుంటుంది. మరోవైపు సుమిత్రకు టెస్ట్లు చేయిస్తారు. సుమిత్రకు ఏం చెప్పనని డాక్టర్ అంటాడు. మరోవైపు శివ నారాయణ సీరియస్ అవుతాడు. ల్యాప్ట్యాప్లో అందరికి శ్రీధర్ అరెస్ట్ చూపిస్తుంది జ్యోత్స్న.
అందుకే నీ తల్లి వదిలేసింది
{{/usCountry}}జ్యోత్స్న రచ్చ చేస్తుంది. నా తండ్రి ఎలాంటి వాడో నాకు తెలుసు అని కార్తీక్ అంటే.. అందుకే నీ తల్లి వదిలేసిందని జ్యోత్స్న అంటుంది. వన్ ఇయర్లో నేను తీసుకురాని పబ్లిసిటీని ఒక్కరోజులో తీసుకొచ్చాడని జ్యోత్స్న అంటుంది. కల్తీ ఆహారం సప్లై చేసి నిండా ముంచారు అని జ్యోత్స్న అంటుంది. శివ నారాయణ మీద పగ తీర్చుకునేందుకే ఇలా కావాలని చేశాడని పారిజాతం అంటుంది.
అంతా వాదించుకుంటారు. తాత ముందు పోలీస్ స్టేషన్కు వెళ్దామని కార్తీక్ అంటే.. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి. మనకు దానికి సంబంధం లేదని చెప్పాలంటుంది జ్యోత్స్న. కార్తీక్ పోలీస్ స్టేషన్కు వెళ్దామంటే సరే అని శివ నారాయణ వెళ్తాడు. తండ్రి తప్పులో బావకు కూడా భాగమున్నట్లుంది అని జ్యోత్స అంటుంది.
అన్నీ గుర్తు పెట్టుకుంటాను
ఈ మాటలన్నీ నేను గుర్తు పెట్టుకుంటాను అని దీప వెళ్లిపోతుంది. మనకు అవకాశం దొరికిందే బాగా వాడుకోవాలి అని పారిజాతం అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.