కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నువ్వు నన్ను నమ్మిన నమ్మకపోయిన నేనే నీ మనవరాలిని అని తెలుస్తుంది. కానీ, ఆలోపు కథ ముగుసిపోతుంది. దాని నుంచి మనం బయటపడాలంటే దాసు బావను కలవకూడదు. కార్తీక్ బావ ఎక్కడ ఉన్నాలో తెలుసుకోవాలి అని జ్యోత్స్న అంటుంది.
కార్తీక్ దీప గుడికి వెళ్లారు

దాంతో కాంచనకు కాల్ చేసి దీప, కార్తీక్ ఇంకా రాలేదు. ఏమైనా ఆరోగ్య సమస్య అని ఆరాలు తీస్తుంది పారిజాతం. కార్తీక్ దీప గుడికి వెళ్లారని చెప్పి కాల్ కట్ చేస్తుంది కాంచన. అదే విషయం జ్యోకి చెప్పిన పారిజాతం దాసును కలవడానికి గుడికి వెళ్లారంటావా.. ఇంట్లో ఇంకో మనిషి కూడా కనిపించట్లేదు. అతను కూడా గుడికి వెళ్లాడా మీ నాన్న దశరథ అని పారు అంటుంది.
దాంతో జ్యో ఊయల కుప్పకూలి కూర్చొంటుంది. తెగ వణికిపోతుంటుంది జ్యోత్స్న. నువ్వు చెప్పిన ఆట ఇది కాదు కదా అని పారిజాతం అంటుంది. మరోవైపు దశరథ ఆవేశంగా వస్తుంటే కార్తీక్, దీప ఆపుతారు. తొందరపడి ఏ తప్పు చేయకూడదు. సుమిత్ర అత్తకు జ్యో అంటే ప్రాణం. ఇప్పుడు నీ కూతురు కాదంటే తట్టుకోగలదా. రిపోర్ట్స్ మ్యాచ్ కాకుంటే దీపతో చేయించి అవి జ్యోవి అని చెప్పించా. డాక్టర్ కూడా మన మనిషే అని కార్తీక్ అంటాడు.
నేను వినను. సుమిత్రకు నేను ఏదోలా చెప్పుకుంటా అని దశరథ అంటాడు. దాసు ఆపాలని చూస్తే నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. అంతా కలిసి నా కూతురుకు అన్యాయం చేశారు. ఏం జరిగితే అది జరగని. నేను విషయం చెబుతాను దశరథ్ అంటాడు. మనకు నిజం తెలిసిందని తెలిస్తే జ్యో ఎంతకైన తెగిస్తుంది. ఇప్పుడు శౌర్య నా కూతురు కాదంటే నాకు ఎలా ఉంటుందని సుమిత్ర గురించి చెబుతుంది దీప.
నేను చచ్చినంత ఒట్టే
నా మాట విను నాన్న. నువ్వు నిజం చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే. నేనే చెప్పేంతవరకు ఈ నిజం ఎవరికి చెప్పకూడదు అని దీప దశరథ్తో ఒట్టేయించుకుంటుంది. ఏంటమ్మా నీకు నువ్వే గీత గీసుకుంటావా. కష్టాలు ఇంకా తెచ్చుకుంటావా అని దశరథ్ అంటాడు. ఇప్పుడు ఆలోచించాల్సింది అమ్మ గురించి. నాకంటే నాకు అమ్మే ముఖ్యం. ఒట్టు గుర్తుపెట్టుకో నాన్న అని దీప అంటుంది.
{{/usCountry}}నా మాట విను నాన్న. నువ్వు నిజం చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే. నేనే చెప్పేంతవరకు ఈ నిజం ఎవరికి చెప్పకూడదు అని దీప దశరథ్తో ఒట్టేయించుకుంటుంది. ఏంటమ్మా నీకు నువ్వే గీత గీసుకుంటావా. కష్టాలు ఇంకా తెచ్చుకుంటావా అని దశరథ్ అంటాడు. ఇప్పుడు ఆలోచించాల్సింది అమ్మ గురించి. నాకంటే నాకు అమ్మే ముఖ్యం. ఒట్టు గుర్తుపెట్టుకో నాన్న అని దీప అంటుంది.
{{/usCountry}}దాంతో ఒట్టుపై కోప్పడుతాడు దశరథ్. నిన్ను ఒకసారి దూరం చేసుకుంది చాలు. మరోసారి దూరం చేసుకోలేను. నీ ఒట్టుకు కట్టుబడి ఉంటాను. కానీ, ప్రళయాన్ని ఏ ఒట్టు ఆపదు. నీకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అని దశరథ్ అంటాడు. దాసును దశరథ్ తిడితే.. కాళ్లు పట్టుకుంటాడు. అయినా అసహ్యించుకుంటాడు దశరథ్.
దాసు సైడ్ నుంచి జరిగినవన్నీ చెబుతాడు కార్తీక్. చావు అంచుల వరకు, జ్యో కిడ్నాప్ అన్ని చెబుతాడు కార్తీక్. నీకు సొంత తమ్ముడు ఉన్న ఇంతలా ఆలోచించడు. దాసు మావయ్యకు కూడా అన్యాయం జరిగింది. తన కూతురుని తనకు దూరం చేసింది పారు. దాసు మావ ఈ కథను మొదలైనప్పటి నుంచి మోస్తున్నాడు. పారిజాతం కన్నవాడికి కూడా అన్యాయం చేసిందని కార్తీక్ అంటాడు.
దాసును క్షమించిన దశరథ్
నన్ను క్షమించు అన్నయ్య. నేను లక్ష్మణుడినో కాదో నాకు తెలియదు. కానీ, నువ్వు మాత్రం నాకు రాముడివే. నన్ను దూరం చేయకు అన్నయ్య అని వేడుకుంటాడు దాసు. కోపంలో నాలుగు మాటలు అన్నాను. పట్టించుకోకురా అని దశరథ్ దాసును క్షమిస్తాడు. ఇక అంతా సంతోషమే అని కార్తీక్ అంటాడు.
మరోవైపు శ్రీధర్ అకౌంట్స్ చూపిస్తాడు శివ నారాయణ. అది చూసిన జ్యోత్స్న దశరథ్ గురించి ఆలోచిస్తుంది. శ్రీధర్ శివ నారాయణ ఇద్దరు కాశీ, స్వప్న గురించి మాట్లాడుకుంటారు. స్వప్నను సూటిపోటి మాటలతో బాధపెట్టలేను. పంతం కోసం ప్రాణం వదిలేయగలదు. ఈ జెనరేషన్ పిల్లలు తనకు నచ్చని పని జరిగితే సూసైడ్ చేసుకుంటున్నారు అని శ్రీధర్ అంటాడు.
నాకంటే మెచ్యూర్గా ఆలోచించావ్ అని శివ నారాయణ మెచ్చుకుంటాడు. ఇదంతా నా కొడుకును చూసే నేర్చుకున్నా అని శ్రీధర్ అంటాడు. జ్యో దగ్గరికి వచ్చి పారు నేనే ఒంటరిదాన్ని అయిపోయాను అంటుంది. నువ్వే నాకు పెద్ద శత్రువులా మారావని జ్యో అంటుంది. నిజం తెలిస్తే నాకే ఎఫెక్ట్ సరే పదా. దాసును కనిపెట్టి ఆపాలి అని పారిజాతం అంటుంది.
పారు, జ్యోకి షాక్
పారు, జ్యో వెళ్తుంటే శివ నారాయణ ఆపుతాడు. దశరథ్ వచ్చే వరకు జ్యోని ఎక్కడికి వెళ్లొద్దన్నాడు అని శివ నారాయణ చెబుతాడు. దాంతో జ్యోత్స్న షాక్ అయి వెనక్కి వెళ్తారు. శ్రీధర్ వెళ్లిపోతాడు. మరోవైపు కార్తీక్, దీప, దీప కడుపులో బిడ్డపై అర్చన చేయిస్తాడు దశరథ్. కార్తీక్ను లాగి కడుపులో బిడ్డ గురించి చెబుతుంది దీప. ఇది కూడా చెబుతాను అని కార్తీక్ అంటాడు.
వద్దు. నాన్న ఇప్పుడే సంతోషంగా ఉన్నారు. ఇప్పుడే చెప్పి బాధపెట్టకు అని కార్తీక్తో దీప అంటుంది. కార్తీక్ ఆగిపోతాడు. తన ఆనందాన్ని అంతా పంతులుకు చెబుతాడు దశరథ్. దాసు వెళ్తానంటాడు. మన ఇంటికి వెళ్దాం పద దీప అని దశరథ్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.