...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: తల్లికి అన్యాయం-కుమిలిపోతున్న కార్తీక్-దీప కన్నకూతురా? దశరథను ప్రశ్నించిన సుమిత్ర

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 9 ఎపిసోడ్ లో దీప గురించి శౌర్యకు కార్తీక్ అబద్దం చెప్తాడు. దీపను కన్నకూతురిలా ప్రేమించలేనని దశరథతో సుమిత్ర అంటుంది. అత్త కోసం తల్లికి అన్యాయం చేస్తున్నానని కార్తీక్ కుమిలిపోతాడు. దశరథకు నిజం తెలిసిందని జ్యోత్స్నకు అర్థమవుతుంది.

Published on: Mar 9, 2026, 08:35:24 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 9 ఎపిసోడ్ లో అమ్మానాన్న ఎప్పుడు వస్తారని నానమ్మ కాంచనను శౌర్య అడుగుతుంది. నువ్వు మారిపోయావ్ నానమ్మ. చెల్లి పుడితే నన్ను హాస్టల్లో వేస్తారా? నన్ను ఇంట్లో నుంచి పంపిస్తావా? చెల్లి వస్తే నా మీద ప్రేమ పోతుందా? అని కాంచనను శౌర్య అడుగుతుంది. ఎంతమంది ఉన్నా నువ్వే నా ఫస్ట్ అని శౌర్యను కాంచన దగ్గరకు తీసుకుని ముద్దు పెడుతుంది.

కార్తీక్ అబద్దం

Karthika Deepam 2 Today Episode: తల్లికి అన్యాయం-కుమిలిపోతున్న కార్తీక్-దీప కన్నకూతురా? దశరథను ప్రశ్నించిన సుమిత్ర
Karthika Deepam 2 Today Episode: తల్లికి అన్యాయం-కుమిలిపోతున్న కార్తీక్-దీప కన్నకూతురా? దశరథను ప్రశ్నించిన సుమిత్ర

అప్పుడే కార్తీక్ వస్తాడు. అమ్మ ఎక్కడ అని శౌర్య అడుగుతుంది. ఏం చెప్పాలో అని కార్తీక్ ఆలోచిస్తాడు. అప్పుడు శౌర్యనే ఓ తాత ఇంటి దగ్గర ఉండిపోయిందా? అని అంటుంది. హా అవును.. తాత ఇంటి దగ్గరే ఉండిపోయింది. అమ్మమ్మకు ఆరోగ్యం బాలేదు కదా అందుకే అక్కడే ఉండిపోయిందని కార్తీక్ అబద్దం చెప్తాడు. ఈ రోజు నుంచి నేను చెప్పేంతవరకు నువ్వు నానమ్మతోనే ఉండాలని బిడ్డకు కార్తీక్ చెప్తాడు.

దీపను హాస్పిట్లలో అడ్మిట్ చేశానని తల్లి కాంచనకు కార్తీక్ చెప్తాడు. డాక్టర్ తో అన్నయ్య మాట్లాడాడా? బిడ్డ గురించి ఏమైనా చెప్పాడా? అని కార్తీక్ ను కాంచన ప్రశ్నిస్తుంది.

దీప గురించే

మరోవైపు సుమిత్ర ముందు దశరథ దీనంగా కూర్చుంటాడు. డాక్టర్ ఏమన్నారండీ అని సుమిత్ర అడుగుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన దీప గురించి ఆలోచిస్తున్నారా? అని దశరథను అడుగుతుంది. తన గురించి ఆలోచించడానికి కార్తీక్ ఉన్నాడు కదా అని దశరథ అంటాడు. ఈ టైమ్ లో కన్నతల్లి పక్కనే ఉండాలి. కూతురికి ఏం కావాలో అడగకుంటానే తల్లి అర్థం చేసుకుంటుందని సుమిత్ర చెప్తుంది.

ఒకరి మీద ప్రేమ మరొకరి మీద ద్వేషంగా మారకూడదు సుమిత్ర. దీప నీ కన్నకూతురు అయితే జ్యోత్స్న ఇలాగే మాట్లాడుతుందా? అని భార్యను దశరథ అడుగుతాడు. దీప నా కన్నకూతురు ఏంటండీ అని సుమిత్ర ప్రశ్నిస్తుంది. ఒకవేళ దీప మన కూతురు అయి ఉంటే తన గురించి జ్యోత్స్న ఇలా మాట్లాడదని దశరథ అంటాడు. దీపను, జ్యోత్స్నను కలిపి మాట్లాడకండీ. దీపను నా కన్నకూతురిలా ప్రేమించలేను. ఏ తల్లికి అయినా కన్నబిడ్డే ఎక్కువ అండీ అని సుమిత్ర చెప్తుంది. నీ కూతురు నీకు ఏం కానివ్వదని దశరథ ఎమోషనల్ అవుతాడు.

కార్తీక్ ఎమోషనల్

డాక్టర్ ఏమన్నాడని కార్తీక్ ను తల్లి కాంచన మళ్లీ అడుగుతుంది. నేను మొండిదాన్ని. ఎంత బాధపడినా గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తూనే ఉంటా. నీకు కూతురు పుట్టినా శౌర్య నా పెద్ద మనవరాలే. నా ప్రేమ ఇలాగే ఉంటుందని కాంచన ఏడుస్తుంది. గ్రహణం పట్టినప్పుడు చంద్రుడిని ఎలా చూపిస్తానమ్మా? గ్రహణం వీడే దాకా ఏం చెప్పలేనని దీప కడుపులో బిడ్డను ఉద్దేశించి కార్తీక్ అంటాడు. నేను చచ్చిపోయేలోపు నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను నేను చూడాల్రా. నువ్వు చూస్తావ్ అమ్మా అని చెప్పగలవా? అని కాంచన అడగ్గానే కన్నీళ్లతో మోకాళ్లపై కూలిపోతాడు కార్తీక్. అత్త కోసం నీకు అన్యాయం చేస్తున్నానమ్మా అని అనుకుంటూ కార్తీక్ ఏడ్చేస్తాడు.

అప్పుడే శ్రీధర్ వస్తాడు. మన సంకల్పం బలంగా ఉంటే అనుకున్నది నిజమవుతుంది. కార్తీక్ నువ్వు హాస్పిటల్ కు బయల్దేరు అని శ్రీధర్ చెప్తాడు. మీరు ఎందుకు వచ్చారో చెప్పండని కాంచన అడుగుతుంది. నా బాధ్యత నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చిందని శ్రీధర్ అంటాడు.

జ్యోత్స్నకు నిజం

ఇక నాకు వేరే దారి లేదు నాన్న. నన్ను చాలా తెలివిగా లాక్ చేశారు. నేను ఓడిపోయా. నాకు తెలియకుండా నా వెనుక ఏం చేస్తున్నావో నువ్వు ఒప్పుకో నాన్న. దీపను మా నాన్న హాస్పిటల్లో జాయిన్ చేశాడు. మమ్మీని జాయిన్ చేయాల్సిన హాస్పిటల్లోనే దీపను అడ్మిట్ చేయాల్సిన అవసరం ఏంటీ? నన్ను ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నారు. ఈ టైమ్ లోనే బోన్ మ్యారో సర్జరీకి కావాల్సిన దీప స్టెమ్ సెల్స్ తీసే అవకాశం ఉంది కదా అని దాసుతో జ్యోత్స్న అంటుంది. అయితే తాతగారి దగ్గరకు పదా. నీ అనుమానాలు అన్ని పోగొడతా. నేరుగా ఇంటికి వచ్చి మీ మనవరాలికి తను ఈ ఇంటి బిడ్డ కాదనే అనుమానం ఉందంటా, డీఎన్ఏ టెస్టు చేయించమని శివనారాయణను అడుగుతా. అసలు నిజాలు ఎప్పుడో బయటపడ్డాయని దాసు బాంబ్ పేలుస్తాడు.

నేను అంత ఈజీగా వదిలిపెట్టను. మీరు దీపను యువరాణిని చేయాలని అనుకుంటున్నారు. కానీ అది జరగదు. శివనారాయణ ఆస్తికి ఏకైక వారసురాలిని ఎప్పటికైనా నేనే. నేను కోరుకున్నది నాకు దక్కితీరాలని జ్యోత్స్న చిటికెలు వేస్తుంది. నీకు రాసి పెట్టి ఉన్నది మాత్రమే నీకు దక్కుతుందని దాసు వెళ్లిపోతాడు.

కాంచన ఇంట్లో శ్రీధర్

ఈ రోజు నుంచి నేను ఈ ఇంట్లోనే నీతో పాటు ఉంటాను. ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నా. ఇది నా ఇల్లేనని కాంచనతో శ్రీధర్ అంటాడు. ఈ ఇంట్లో ఉన్నవాళ్ల లిస్ట్ లో మీరు లేరు. నాకు నా కొడుకు ఉన్నాడని కాంచన అంటుంది. దీపకు పూర్తిగా నయమై ఇంటికి వచ్చేంతవరకు కార్తీక్ హాస్పిటల్లోనే ఉంటాడు. అక్కడ దీపకు ఎలా ఒక తోడు అవసరమైందో, ఇక్కడ కూడా ఒక తోడు అవసరం కావాలి. కార్తీక్ వచ్చేంతవరకు నేను ఈ ఇంటికి ప్రతి రాత్రి వస్తాను. తోడుగా ఉంటానని శ్రీధర్ చెప్తాడు.

గతంలో ఎవరో ఒకరు ఇంట్లో దూరి దీపను చంపబోయాడు కదా. మరో దొంగ వస్తే ఏంటీ పరిస్థితి? బయట కార్లో పడుకుంటానని శ్రీధర్ అంటాడు. మరి కావేరి గురించి ఆలోచించరా? అక్కడ కూడా ఇద్దరు ఆడవాళ్లే ఉన్నారు కదా అని కాంచన అడుగుతుంది. అక్కడ అల్లుడు కాశీని ఉంచానని శ్రీధర్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe