ఏనుగుల వేట నేపథ్యంలో సునీల్ మలయాళ మూవీ- కట్టాలన్ సెకండ్ లుక్ రిలీజ్- ఎన్నడు చూడని మాస్ అవతార్లో!
తెలుగు కమెడియన్, నటుడు సునీల్ కీలక పాత్రలో నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కట్టాలన్. ఏనుగుల వేట నుంచి ప్రేరణ పొందిన ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఫస్ట్ పోస్టర్లాగే కట్టాలన్ రెండో పోస్టర్ క్యూరియాసిటీ పెంచేలా ఉంది.
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ 'కట్టాలన్' సెకండ్ లుక్ పోస్టర్ను లాంచ్ చేశారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఫస్ట్ లుక్ తర్వాత, రెండవ లుక్ మరింతగా ఆశ్చర్యపరిచేలా రూపొందించారు. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషించడం విశేషం.

ఎన్నడు చూడని మాస్ అవతార్
ఏనుగుల వేట నుంచి ప్రేరణ పొందిన ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్ను సూచిస్తూ, ఈ పోస్టర్ మలయాళ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్లో ఆంటోనీ వర్గీస్ను పరిచయం చేసింది. కట్టలన్ సినిమా టైటిల్కు తగ్గట్టుగానే, ఆంటోనీ వర్గీస్ను ఫస్ట్ లుక్లోనూ, తాజాగా విడుదలైన సెకండ్ లుక్లోనూ పవర్ ఫుల్ లుక్లో చూపించారు.
మలయాళ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రిలీజ్గా 'కట్టాలన్' మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. షరీఫ్ మహమ్మద్ నిర్మించిన పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' తర్వాత క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మూవీ ఇది.
ఓవర్సీస్ డీల్
మాస్ అప్పీల్, యాక్షన్ పరంగా ఈ సినిమా 'మార్కో'ను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుందని పోస్టర్లు సూచిస్తున్నాయి. కట్టాలన్ మొదటి టీజర్ జనవరి 16న విడుదల కానుంది. 'కట్టాలన్' ఇప్పటికే మలయాళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓవర్సీస్ డీల్ దక్కించుకుందని, షూటింగ్ పూర్తి కాకముందే అనేక ప్రీ-రిలీజ్ రికార్డులను బద్దలు కొడుతుందని మేకర్స్ చెబుతున్నారు .
ఫార్స్ ఫిల్మ్స్తో కలిసి, 'కట్టాలన్' ఒక మలయాళ చిత్రానికి ఇప్పటివరకు ఎన్నడూ లేని అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. యాక్షన్ సన్నివేశాలను థాయ్లాండ్లో చిత్రీకరించారు. వీటికి ఓంగ్-బాక్ సిరీస్తో సహా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ నేతృత్వం వహించారు.
ఓంగ్-బాక్ సిరీస్తో
ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "పాంగ్" అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని కాంతార, మహారాజ వంటి బ్లాక్బస్టర్లతో దక్షిణ భారతదేశం అంతటా సంచలనం సృష్టించిన బి. అజనీష్ లోక్నాథ్ అందించారు. పాన్-ఇండియన్ ప్రాజెక్ట్గా రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.
కాగా, కట్టాలన్ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు నటుడు, కమెడియన్ సునీల్ (పుష్ప, జైలర్ 2 ఫేమ్), కబీర్ దుహాన్ సింగ్ (మార్కో), రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి (కిల్ ఫేమ్), అలాగే మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
టెక్నిషియన్స్
ఇక కట్టాలన్ సినిమాకు కథ, స్క్రీన్ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. డైలాగ్స్ను ఉన్నీ ఆర్. రాశారు. కట్టాలన్ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


