వేరే మతం కావడంతో అతనితో పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని అనుకున్నా.. 15 ఏళ్లు అలా గడిపేశాం: కీర్తి సురేష్ కామెంట్స్

కీర్తి సురేష్ తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. జగపతి బాబు షో జయమ్ము నిశ్చయమ్మురా షోకి వచ్చిన ఆమె తన పెళ్లి విషయంలో మతం ఏదైనా అడ్డంకి సృష్టించిందా లేదా అన్నదానిపై ఆమె మాట్లాడింది.

Published on: Oct 13, 2025, 19:55:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ నటి కీర్తి సురేష్ తన భర్త ఆంటోని థాట్టిల్ మతం గురించి, తమ ప్రేమకథ గురించి మాట్లాడింది. తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ5 టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా' లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తన పెళ్లి విషయంలో ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పింది.

వేరే మతం కావడంతో అతనితో పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని అనుకున్నా.. 15 ఏళ్లు అలా గడిపేశాం: కీర్తి సురేష్ కామెంట్స్
వేరే మతం కావడంతో అతనితో పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని అనుకున్నా.. 15 ఏళ్లు అలా గడిపేశాం: కీర్తి సురేష్ కామెంట్స్

కీర్తి సురేష్ పెళ్లిపై..

కీర్తి సురేష్ హిందువు కాగా, ఆమె భర్త ఆంటోని థాట్టిల్ క్రిస్టియన్. వీరి పెళ్లి హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగింది. గతేడాది డిసెంబర్ లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే జగపతి బాబు జీ5 షో జయమ్ము నిశ్చయమ్మురా షోలో పాల్గొన్న ఆమె.. తన పెళ్లి గురించి మాట్లాడింది. ఆంటోనీది వేరే మతం కావడంతో తన ఇంట్లో పెళ్లికి అంగీకరిచరేమో అని మొదట్లో తాను భయపడినట్లు చెప్పింది.

"ఇంట్లో మతపరమైన తేడాల కారణంగా సమస్యలు ఉండవచ్చు అని మేము అనుకున్నాము. నేను నాలుగేళ్ల కిందట ఒక రోజు నాన్నతో మాట్లాడాను. కానీ ఆయన చాలా సులభంగా అంగీకరించారు. నేను ఊహించినట్లుగా ఏమీ జరగలేదు" అని కీర్తి చెప్పింది. ఆమె తండ్రి (నిర్మాత సురేష్ కుమార్) ఈ నిర్ణయాన్ని ఆమోదించడమే కాకుండా సంతోషంతో ఆంటోనికి డ్రింక్ పోసి సెలబ్రేట్ చేసుకున్నారని కూడా తెలిపింది.

15 ఏళ్ల ప్రేమ ప్రయాణం

కీర్తి సురేష్, ఆంటోనీలది హైస్కూల్ లవ్ స్టోరీ. 2010 నుంచి డేటింగ్ లో ఉన్నారు. తమ పెళ్లికి 15 ఏళ్లు ఎందుకు పట్టిందో కూడా ఆమె వివరించింది. "మాకు టైమ్ అవసరమైంది. నేను అప్పటికి కాలేజీ పూర్తి చేయాలి. కెరీర్‌ను ఏర్పరచుకోవాలి. గత 15 సంవత్సరాలలో దాదాపు 5-6 సంవత్సరాలు మేము లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. ఎందుకంటే అతను ఖతార్‌లో, నేను చెన్నైలో ఉన్నాము. అతను ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత అతనికి సమయం అవసరమైంది. నాది కూడా అదే పరిస్థితి" అని చెప్పింది.

కుక్క పేరు వెనుక సీక్రెట్ ఇదీ..

'మహానటి' విజయం తర్వాత, తమ సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడలేని సమయంలో ఆంటోని ఆమెకు ఒక కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడని చెప్పింది. "2018లో 'మహానటి' తర్వాత అతను నాకు దానిని బహుమతిగా ఇచ్చాడు. నేను అప్పుడు మా సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడలేకపోయాను. కానీ మా ప్రేమను గౌరవించుకోవాలనుకున్నాను. అందుకే నేను ఆ కుక్కకు నైక్ అని పేరు పెట్టాను. అది ఆంటోని (Anto-NY) లోని 'Ny', కీర్తి (KE-erthy) లోని 'Ke' నుండి వచ్చింది" అని చిరునవ్వుతో చెప్పింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More