ప్రముఖ నటి కీర్తి సురేష్ 2024లో గోవాలో తన చిరకాల ప్రియుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట ఏషియన్ పెయింట్స్ సహకారంతో తమ ఇంటిని అభిమానులకు చూపిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. తమ ఇంటిని వారు సరదాగా ‘హౌస్ ఆఫ్ ఫన్’ అని పిలుచుకుంటారు. ఈ వీడియోలో కీర్తి తన పెళ్లి రోజున జరిగిన ఒక ఎమోషనల్ సంఘటనను గుర్తుచేసుకుంది.
లేచిపోదాం అనుకున్నా..

15 ఏళ్ల ప్రేమ తర్వాత కుటుంబ సభ్యుల ఆశీస్సులతో ఒక్కటైన ఆ క్షణాన్ని కీర్తి సురేష్ గుర్తుచేసుకుంటూ.. "మేము ఇలాంటి పెళ్లి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నిజం చెప్పాలంటే మేము లేచిపోవాలని అనుకున్నాం. ఇంత ఘనంగా పెళ్లి జరుగుతుందని అస్సలు అనుకోలేదు. కానీ నిజంగా పెళ్లి జరుగుతున్నప్పుడు, ఒక దశలో మాకు మాటలు రాలేదు" అని చెప్పింది.
ఆంటోనీ కన్నీళ్లు..
పెళ్లిలో అత్యంత భావోద్వేగమైన క్షణం గురించి ఆమె వివరిస్తూ.. "15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ బంధం, ఆ 30 సెకన్ల ముహూర్తంలో ఒక్కటవుతున్నప్పుడు.. నాకు ఇంకేమీ కనిపించలేదు. నా మెదడు మొద్దుబారిపోయింది. తాళి తప్ప అక్కడ ఇంకేమీ లేదనిపించింది. అది చాలా ఉద్వేగభరితమైన క్షణం. ఆ సమయంలోనే నేను ఆంటోనీ కళ్లలో నీళ్లు చూడటం అదే మొదటిసారి. మా ప్రయాణం చాలా అందమైనది" అని కీర్తి ఎమోషనల్ అయింది.
కీర్తి, ఆంటోనీ లవ్ స్టోరీ
కీర్తి సురేష్ సినిమాల్లోకి రాకముందే ఆంటోనీతో ప్రేమలో ఉంది. ఆంటోనీ దుబాయ్లో వ్యాపారవేత్త కాగా.. అతని కుటుంబం కేరళలోని కొచ్చికి చెందినది. 15 ఏళ్ల పాటు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట.. 2024 డిసెంబర్ 12న గోవాలో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
కీర్తి సురేష్ సినిమా విశేషాలు
కీర్తి సురేష్ చివరిగా 2025లో వచ్చిన ‘రివాల్వర్ రీటా’ సినిమాలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆమె తదుపరి రిషి శివకుమార్ దర్శకత్వంలో ‘తోట్టమ్’ (Thottam) అనే సినిమాలో ఆంటోనీ వర్గీస్తో కలిసి నటిస్తోంది.
{{/usCountry}}కీర్తి సురేష్ చివరిగా 2025లో వచ్చిన ‘రివాల్వర్ రీటా’ సినిమాలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆమె తదుపరి రిషి శివకుమార్ దర్శకత్వంలో ‘తోట్టమ్’ (Thottam) అనే సినిమాలో ఆంటోనీ వర్గీస్తో కలిసి నటిస్తోంది.
{{/usCountry}}