...
...
Next Story

Keerthy Suresh: ఆఫర్లు లేకే ఐటెమ్ సాంగ్స్ అన్న నెటిజన్.. చిన్న కరెక్షన్ అంటూ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కీర్తి సురేష్

Keerthy Suresh: తనకు ఆఫర్లు లేకే నాని ది ప్యారడైజ్ మూవీలో స్పెషల్ సాంగ్ కు ఒప్పుకుందన్న ఓ నెటిజన్ కామెంట్ కు కీర్తి సురేష్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. చిన్న కరెక్షన్ అంటూనే ఆమె చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

Published on: Aug 7, 2026, 20:05:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Keerthy Suresh: నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'ది ప్యారడైజ్'లో ఆఫర్లు లేకే మహానటి కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ చేస్తోందంటూ నెటిజన్లు పెట్టిన ఒక వైరల్ వీడియోపై కీర్తి సురేష్ సరదాగా ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తన కెరీర్‌పై నిరాధారమైన విమర్శలు చేస్తూ, నానిని కన్నడ నటుడిగా పేర్కొన్న ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోకి కీర్తి సురేష్ తమిళంలో కామెంట్ చేస్తూ ఇచ్చిన 'చిన్న కరెక్షన్' ఫ్యాన్స్‌ని విపరీతంగా అలరిస్తోంది.

Keerthy Suresh: ఆఫర్లు లేకే ఐటెమ్ సాంగ్స్ అన్న నెటిజన్.. చిన్న కరెక్షన్ అంటూ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కీర్తి సురేష్
Keerthy Suresh: ఆఫర్లు లేకే ఐటెమ్ సాంగ్స్ అన్న నెటిజన్.. చిన్న కరెక్షన్ అంటూ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కీర్తి సురేష్

సోషల్ మీడియాలో సెలబ్రిటీల కెరీర్‌పై రకరకాల రూమర్లు ప్రచారం అవ్వడం సాధారణమే. అయితే ఎలాంటి సీరియస్‌నెస్ లేకుండా, సరదా కామెడీ టైమింగ్‌తో రూమర్‌మొంగర్స్‌కి చెక్ పెట్టడం కీర్తి సురేష్‌కే చెల్లింది.

ట్రోలర్‌కి కీర్తి సురేష్ ‘చిన్న కరెక్షన్’

ఇటీవల 'ఫ్రంట్‌వుడ్స్ టీవీ' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక మహిళ వీడియో చేస్తూ.. కీర్తి సురేష్‌కి ప్రస్తుతం మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు రావడం లేదని కామెంట్ చేసింది. అందుకే నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాలో ఆమె ఐటెమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందని ప్రచారం చేసింది. ఆ వీడియోలో సదరు నెటిజన్ నానిని తెలుగు నటుడికి బదులుగా 'కన్నడ నటుడు' అని తప్పుగా చెప్పింది.

ఈ వీడియో కీర్తి సురేష్ దృష్టికి రావడంతో ఆమె సైలెంట్‌గా ఉండకుండా కామెంట్ సెక్షన్‌లో నేరుగా ఎంటర్ అయ్యారు. "వేరే లెవల్ పోంగా! ఒక చిన్న కరెక్షన్.. నాని నటిస్తోంది తెలుగు సినిమాలో, కన్నడలో కాదు!" అంటూ తమిళంలో కామెంట్ పెట్టారు.

కీర్తి సురేష్ ఇచ్చిన ఈ క్యూట్ అండ్ సెటైరికల్ రిప్లై చూసి నెటిజన్లు, నాని అభిమానులు పడిపడి నవ్వుకుంటున్నారు. కీర్తి సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్ చెప్తూ ఫైర్, లాఫింగ్ ఎమోజీలతో కామెంట్ బాక్స్‌ని నింపేస్తున్నారు.

నాని - కీర్తి సురేష్ హిట్ కాంబో రిపీట్?

ఇప్పుడు మళ్లీ శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise). ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ నంబర్ కోసం కీర్తి సురేష్‌ను సంప్రదించినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సెప్టెంబర్ 24, 2026న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో రాఘవ్ జుయల్, మోహన్ బాబు, కయాదు లోహర్, సంతోష్ ప్రతాప్, సంపూర్ణేష్ బాబు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

చేతినిండా ఆఫర్లు.. కీర్తి సురేష్ లైనప్ మామూలుగా లేదుగా

తనకు సినిమాలు లేవని కామెంట్స్ చేస్తున్న ట్రోలర్లకు కీర్తి సురేష్ లైనప్ గట్టి సమాధానం ఇస్తోంది. ప్రస్తుతం ఈ మహానటి చేతిలో అరడజనుకు పైగా బిగ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'డోరతీ' (Dorothy) చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. విచిత్రంగా 'ది ప్యారడైజ్', 'డోరతీ' సినిమాలు ఒకే రోజు తేడాతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనుండటం విశేషం.

తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'రౌడీ జనార్దన' (Rowdy Janardhana) సినిమాలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ వేగంగా జరుగుతోంది.

దీంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్, కృతి శెట్టిలతో కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ 'వెంకీఅనిల్5' లోనూ కీర్తి కీలక పాత్ర పోషిస్తోంది. వీటితో పాటు 'సత్యవాన్ సావిత్తిరి', ' అక్క', 'రఫ్తార్' వంటి లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌లతో కీర్తి సురేష్ బిజీగా ఉంది. చేతినిండా పాన్ ఇండియా సినిమాలు పెట్టుకుని ఉన్న కీర్తిపై ఇలాంటి రూమర్లు రావడం హాస్యాస్పదమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe