కేజీఎఫ్ నటుడు కన్నుమూత.. థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ.. చికిత్స కోసం యశ్ సాయం చేసినా..

కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ కన్నుమూశాడు. కొన్నేళ్లుగా థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న అతడు.. గురువారం (నవంబర్ 6) బెంగళూరులో తుది శ్వాస విడిచాడు. అతనికి కొన్నాళ్లుగా యశ్ కూడా చికిత్స కోసం సాయం చేశాడు.

Published on: Nov 6, 2025, 17:54:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేజీఎఫ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన నటుడు హరీష్ రాయ్. 35 ఏళ్లుగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతడు.. గురువారం (నవంబర్ 6) బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కొన్నేళ్లుగా అతడు థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.

కేజీఎఫ్ నటుడు కన్నుమూత.. థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ.. చికిత్స కోసం యశ్ సాయం చేసినా..
కేజీఎఫ్ నటుడు కన్నుమూత.. థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ.. చికిత్స కోసం యశ్ సాయం చేసినా..

హరీష్ రాయ్ కన్నుమూత

కేజీఎఫ్, ఓం సినిమాలతో బాగా పేరు సంపాదించిన నటుడు హరీష్ రాయ్ గురువారం తుది శ్వాస విడిచాడు. బెంగళూరులోని కిడ్వాయ్ ఆంకాలజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. హాస్పిటల్లో అతడు చివరి చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్నేళ్లుగా హరీష్.. థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.

చాలా రోజుల కిందటే అతడు తన ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి దిగజారడంపై మాట్లాడాడు. అతనికి కేజీఎఫ్ స్టార్ యశ్ సహా అనేక మంది చికిత్స కోసం సాయం కూడా చేశారు. థైరాయిడ్ క్యాన్సర్ కాస్తా అతని పొట్ట భాగానికి కూడా పాకడంతో అతడు కోలుకోలేకపోయాడు.

అభిమానుల సాయం కూడా కోరుతూ..

హరీష్ రాయ్ తన క్యాన్సర్ చికిత్స కారణంగా ఆర్థికంగా చితికిపోయాడు. అంతేకాకుండా ఈ చికిత్స మరీ ఖరీదైనదిగా మారడంతో అతడు అభిమానుల సాయం కూడా కోరాడు. ఒక్కో ఇంజెక్షన్ రూ.3 లక్షలు విలువైనదని, ఇలా 63 రోజుల వ్యవధిలో 3 ఇంజెక్షన్లు తీసుకోవాలని, దీనికే రూ.10 లక్షలు అవుతుందని అతడు గతంలో వెల్లడించాడు. మొత్తంగా అతని క్యాన్సర్ చికిత్సకు రూ.70 లక్షల వరకు ఖర్చయినట్లు కూడా సమాచారం.

అతడు ఆర్థిక సాయం కోరడంతో ఎంతో మంది సెలబ్రిటీలతోపాటు సామాన్యులు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయినా అతడు క్యాన్సర్ మహమ్మారిని జయించలేకపోయాడు. హరీష్ 1990లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఓం, నల్లా, రాజ్ బహదూర్, సంజు వెడ్స్ గీతా, కేజీఎఫ్ సినిమాలతో అతడు బాగా పాపులర్ అయ్యాడు. హరీష్ మృతికి కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More