బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, ఆమె రూమర్డ్ బాయ్ఫ్రెండ్ కబీర్ బహియా అబుదాబిలో జరిగిన UFC 321 ఈవెంట్కు హాజరయ్యారు. ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కృతి పంచుకుంది. అందులో నటుడు వరుణ్ ధావన్ కూడా ఉన్నాడు.
ఫొటోలు వైరల్

రూమర్డ్ బాయ్ఫ్రెండ్తో అబుదాబి ఈవెంట్లో కృతి సనన్ సందడి చేసింది.ఒక ఫోటోలో కృతి కబీర్తో కలిసి సెల్ఫీకి నవ్వుతూ పోజులిచ్చింది. మరో చిత్రంలో వరుణ్తో కలిసి సరదాగా ముఖం పెట్టింది. ముగ్గురూ కలిసి ఉన్న చిత్రాలను కూడా కృతి పంచుకుంది. ఈ ఈవెంట్ కోసం, కృతి జాకెట్ కింద బ్లాక్ టాప్, డెనిమ్ ధరించింది. వరుణ్ మెరూన్ లెదర్ జాకెట్ కింద బ్లాక్ టీ-షర్ట్, ట్రౌజర్లో కనిపించాడు. కబీర్ వైట్ టీ-షర్ట్, పింక్ జాకెట్, డెనిమ్స్ను ఎంచుకున్నాడు.
ఫైట్ నైట్
ఈ చిత్రాలను పంచుకుంటూ కృతి.."అబుదాబిలో ఫైట్ నైట్ ఎనర్జీ (ఫైర్ ఎమోజి). ఈ ఇద్దరితో కలిసి UFC 321లో ఈ ఉత్సాహాన్ని చూడటం థ్రిల్లింగ్గా ఉంది! (కొలిజన్, బాక్సింగ్ గ్లోవ్ ఎమోజీలు)" అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్పై స్పందిస్తూ, కబీర్ గ్లోవ్, రెడ్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఒక అభిమాని ఏమో "ఈ ఇద్దరూ కలిసి చాలా క్యూట్గా ఉన్నారు" అని అన్నారు. "అందమైన జంట" అని ఒక కామెంట్ వచ్చింది. "ఆమె వారి సంబంధాన్ని అధికారికం చేస్తోంది" అని మరో కామెంట్ ఉంది.
కబీర్, కృతి గురించి..
{{/usCountry}}ఈ చిత్రాలను పంచుకుంటూ కృతి.."అబుదాబిలో ఫైట్ నైట్ ఎనర్జీ (ఫైర్ ఎమోజి). ఈ ఇద్దరితో కలిసి UFC 321లో ఈ ఉత్సాహాన్ని చూడటం థ్రిల్లింగ్గా ఉంది! (కొలిజన్, బాక్సింగ్ గ్లోవ్ ఎమోజీలు)" అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్పై స్పందిస్తూ, కబీర్ గ్లోవ్, రెడ్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఒక అభిమాని ఏమో "ఈ ఇద్దరూ కలిసి చాలా క్యూట్గా ఉన్నారు" అని అన్నారు. "అందమైన జంట" అని ఒక కామెంట్ వచ్చింది. "ఆమె వారి సంబంధాన్ని అధికారికం చేస్తోంది" అని మరో కామెంట్ ఉంది.
కబీర్, కృతి గురించి..
{{/usCountry}}ఈ జంట కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. జూలైలో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో వీరిద్దరూ కనిపించారు. గతేడాది దుబాయ్లో జరిగిన ఓ కుటుంబ వివాహ వేడుకలో కలిసి కనిపించారు. ఆ తర్వాత క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ జంట ఉస్తాద్ రహత్ ఫతే అలీ ఖాన్ కచేరీకి కూడా కలిసి హాజరయ్యారు. నివేదికల ప్రకారం కబీర్ను తన సోదరికి పరిచయం చేసింది నూపుర్ సనన్.
లండన్ రిచ్ ఫ్యామిలీ
కబీర్ నవంబర్ 1999లో జన్మించాడు. 2018లో ఇంగ్లాండ్లోని సోమర్సెట్లో ఉన్న మిల్ఫీల్డ్ అనే బోర్డింగ్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అతను తన పాఠశాల రోజుల నాటి అనేక ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు, అందులో 2015లో మిల్ఫీల్డ్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న ఫోటో కూడా ఉంది. కబీర్ లండన్లో నివసించే ఒక సంపన్న కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి, కుల్జిందర్ బహియా ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ వ్యవస్థాపకుడు.
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన 'తేరే ఇష్క్ మే'లో కృతి ధనుష్తో కలిసి అభిమానులను అలరించనుంది. ఈ చిత్రానికి హిమాన్షు శర్మ కథ అందించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం, ఇర్షాద్ కమిల్ సాహిత్యం అందించారు. ఈ చిత్రం నవంబర్ 28, 2025న థియేటర్లలో విడుదల కానుంది. హోమీ అదజానియా దర్శకత్వంలో 'కాక్టెయిల్' సీక్వెల్లో కూడా కృతి నటిస్తోంది.