మెగా కోడలు లావణ్య త్రిపాఠి షాకింగ్ ఎక్స్పీరియన్స్ను బయటపెట్టింది. తన లైఫ్ లో జరిగిన అనూహ్య సంఘటన గురించి ఆమె తాజాగా వెల్లడించింది. లావణ్య ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తన సినీ కెరీర్ లోని చేదు అనుభవాన్ని పంచుకుంది. ఓ ఘటన కారణంగా రూమ్ లో కూర్చుని ఏడవాల్సి వచ్చిందని పేర్కొంది.
లావణ్య త్రిపాఠి కామెంట్లు

లావణ్య త్రిపాఠి తాజాగా ఓ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయింది. అక్కడ మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ప్రశ్నకు ఆన్సర్ చెప్తూ తన సినీ కెరీర్ లో చోటు చేసుకున్న ఓ షాకింగ్ ఘటనను బయటపెట్టింది. తన జీవితంలోనూ కఠిన పరిస్థితులు ఉన్నాయని, వాటిని దాటుకుని ముందుకు వెళ్తున్నానని ఆమె పేర్కొంది.
ఆ డైరెక్టర్ నచ్చక
‘‘ఒక సింగిల్ వుమెన్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. గతంలో నాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదు. సపోర్ట్ చేసేందుకు ఎవరూ ఉండరు. ఓ సారి తమిళ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ డైరెక్టర్ తీరు నాకు నచ్చలేదు. నేను రాంగ్ కావొచ్చు కానీ నాకు సౌకర్యంగా అనిపించలేదు’’ అని లావణ్య త్రిపాఠి తనకు జరిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.
ఇంటికి వచ్చే ఏడ్చేశా
‘‘నాకు కంఫర్టబుల్ లేకపోవడంతో ఆ సినిమాకు నో చెప్పేశా. దీంతో వాళ్లు నాపై కేసు పెట్టారు. నా గురించి మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయి. ఆ టైమ్ లో నేను ఎవరికీ చెప్పలేదు. ఎవరిని హెల్ప్ అడగలేదు. ఇంటికి వచ్చి ఏడ్చేశా. కానీ మళ్లీ ఆలోచించా. ఓ టీ తాగి చిల్ అయ్యా. ఇలాంటి సంఘటనలు మనల్ని బలంగా మారుస్తాయి. ఇది కొవిడ్ కు ముందు జరిగింది’’ అని లావణ్య త్రిపాఠి పేర్కొంది.
సతీ లీలావతి
2023లో మెగా హీరో వరుణ్ తేజ్ ను లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఒక బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత లావణ్య చేస్తున్న ఫస్ట్ మూవీ ‘సతీ లీలావతి’. ఈ సినిమాలో లావణ్య, దేవ్ మోహన్ జంటగా నటించారు. దీనికి తాతినేతి సత్య డైరెక్టర్. నిజానికి ఈ మూవీ మార్చి 6నే రిలీజ్ కావాల్సింది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశముంది.
{{/usCountry}}2023లో మెగా హీరో వరుణ్ తేజ్ ను లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఒక బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత లావణ్య చేస్తున్న ఫస్ట్ మూవీ ‘సతీ లీలావతి’. ఈ సినిమాలో లావణ్య, దేవ్ మోహన్ జంటగా నటించారు. దీనికి తాతినేతి సత్య డైరెక్టర్. నిజానికి ఈ మూవీ మార్చి 6నే రిలీజ్ కావాల్సింది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశముంది.
{{/usCountry}}లావణ్య త్రిపాఠి తాజాగా తనపై సోషల్ మీడియా వేధింపులపై పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది.