టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరిద్దరి పెళ్లి అత్యంత వైభవంగా జరగనుంది. అయితే ఇప్పటివరకు తమ వ్యక్తిగత జీవితాన్ని, ప్రేమ వ్యవహారాన్ని చాలా సీక్రెట్ గా ఉంచిన ఈ జంట.. తమ పెళ్లి వేడుకను కూడా అత్యంత ప్రైవసీతో జరుపుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అంతర్జాతీయ సెక్యూరిటీని రంగంలోకి దించినట్లు వార్తలు వస్తున్నాయి.
వెడ్డింగ్ కార్డు లీక్తో..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి శుభలేఖ ఆన్లైన్లో లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ కార్డులో పెళ్లి తేదీ, సమయం, వేదిక, ముఖ్యమైన కాంటాక్ట్ నంబర్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో తమ ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఈ జంట సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పెళ్ళికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో, భద్రతాపరమైన సమస్యలను ఎదుర్కోవడానికి విజయ్, రష్మిక ఒక అంతర్జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీని ఆశ్రయించారు. ఇంటర్నెట్లో ప్రతిరోజూ తమ పెళ్లికి సంబంధించిన ఏదో ఒక కొత్త విషయం లీక్ అవుతుండటంతో, తమ పెళ్లి రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరూ అనధికారికంగా లోపలికి రాకుండా చూసుకునే బాధ్యతను ఈ గ్లోబల్ టీమ్కు అప్పగించారు.
ఇండియా టుడే (India Today) రిపోర్టు ప్రకారం.. ఈ విదేశీ భద్రతా సిబ్బంది స్థానిక రాజస్థాన్ పోలీసులతో, అధికారులతో కలిసి పనిచేయనున్నారు. పెళ్లి వేడుకలు సజావుగా సాగేలా వీరు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని సృష్టించనున్నారు.
నో-ఫోన్ రూల్, అగ్రిమెంట్లు..
ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా ఈ జంట చాలా పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకలో పాల్గొనే అతిథులు, ఈవెంట్ మేనేజర్లు, వెండర్స్, ఇతర సిబ్బంది అందరితో ‘నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్స్’ పై సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం.
{{/usCountry}}ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా ఈ జంట చాలా పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకలో పాల్గొనే అతిథులు, ఈవెంట్ మేనేజర్లు, వెండర్స్, ఇతర సిబ్బంది అందరితో ‘నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్స్’ పై సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం.
{{/usCountry}}అంటే పెళ్లికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని వారు బయట వ్యక్తులతో పంచుకోకూడదు. అలాగే పెళ్లికి హాజరయ్యే అతిథులందరికీ 'నో-ఫోన్ రూల్' అమలు చేస్తున్నారు. పెళ్లి మండపంలోకి మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషేధించారు. తమ పెళ్లి వేడుక పూర్తి ప్రైవేట్గా, కేవలం అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరగాలని విజయ్, రష్మిక కోరుకుంటున్నారు.
ఉదయ్పూర్లో పెళ్లి.. హైదరాబాద్లో రిసెప్షన్..
విజయ్, రష్మిక వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ లో ఉన్న ఒక విలాసవంతమైన ప్యాలెస్లో జరగనుంది. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరుకానున్నారు. ఆ తర్వాత తమ సినీ పరిశ్రమలోని స్నేహితులు, సహచరులు, ఇతర ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా సమాచారం.
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. అప్పటి నుంచే ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే వారు తమ బంధాన్ని ఎప్పుడూ బహిరంగంగా అంగీకరించలేదు, చాలా రహస్యంగా ఉంచారు. గతేడాది ఎంగేజ్మెంట్ జరిగినా కూడా దానినీ ఇప్పటి వరకూ అధికారికంగా ఈ జంట వెల్లడించలేదు. ఇప్పుడు ఫైనల్గా వీరు పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.