Asha Bhosle: భారతీయ సంగీత శిఖరం, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే (92) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోస, గుండె సంబంధిత సమస్యల కారణంగా శనివారం (ఏప్రిల్ 11) సాయంత్రం ఆమెను ముంబైలోని ప్రముఖ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం.
ఐసీయూలో చికిత్స

శనివారం సాయంత్రం ఆశా భోంస్లేకు తీవ్రమైన శ్వాస ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన వైద్యులు ఆమెను ఐసీయూ (ICU) కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 92 ఏళ్ల ఆశా భోంస్లే ఆరోగ్యాన్ని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
మనవరాలు జానై భోంస్లే ప్రకటన
ఆశా భోంస్లే ఆసుపత్రిలో చేరిన వార్తను ఆమె మనవరాలు జానై భోంస్లే సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు.
"తీవ్రమైన అలసట, ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా నామ్మమ్మ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. అన్నీ సవ్యంగా జరుగుతాయని, ఆమె త్వరలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాం. ఈ సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరుతున్నాం. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తాం" అని జానై పేర్కొన్నారు.
ఎనిమిది దశాబ్దాల సంగీత ప్రస్థానం
భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఆశా భోంస్లే పేరు ఒక మారుమోగే అధ్యాయం. సుమారు ఎనిమిది దశాబ్దాలకు పైగా ఆమె తన గాత్రంతో కోట్లాది మందిని అలరించారు. 1943లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆశా.. వేల సంఖ్యలో పాటలు పాడారు. కేవలం హిందీలోనే కాకుండా దాదాపు అర డజనుకు పైగా భారతీయ భాషల్లో (తెలుగుతో సహా) ఆమె గొంతు వినిపించింది.
ప్రైవేట్ ఆల్బమ్స్ నుంచి సినిమాల వరకు, దేశీయ స్టేజ్ షోల నుంచి అంతర్జాతీయ ప్రదర్శనల వరకు ఆమె ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. ప్రపంచంలోనే అత్యధిక పాటలు రికార్డ్ చేసిన కళాకారిణిగా 2011లో ఆమె 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించుకున్నారు.
పురస్కారాల పంట
{{/usCountry}}ప్రైవేట్ ఆల్బమ్స్ నుంచి సినిమాల వరకు, దేశీయ స్టేజ్ షోల నుంచి అంతర్జాతీయ ప్రదర్శనల వరకు ఆమె ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. ప్రపంచంలోనే అత్యధిక పాటలు రికార్డ్ చేసిన కళాకారిణిగా 2011లో ఆమె 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించుకున్నారు.
పురస్కారాల పంట
{{/usCountry}}సంగీత ప్రపంచానికి ఆశా భోంస్లే చేసిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషణ్'తో గౌరవించింది. అలాగే భారత చలనచిత్ర రంగంలో అత్యున్నతమైన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డును కూడా ఆమె అందుకున్నారు. రెండుసార్లు జాతీయ అవార్డులు, ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డులు ఆశా భోంస్లేను వరించాయి.
ఆమె సోదరి, దివంగత గానకోకిల లతా మంగేష్కర్ తర్వాత భారతీయ సంగీత సామ్రాజ్యంలో ఆ స్థాయి గౌరవం పొందిన ఏకైక గాయని ఆశా భోంస్లే అనడంలో అతిశయోక్తి లేదు.
ఆశా భోంస్లే ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ సంగీత సరస్వతి త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది ప్రార్థనలు చేస్తున్నారు.