...
...
Next Story

Asha Bhosle: మూగబోయిన గానకోకిల.. సంగీత సామ్రాజ్ఞి ఆశా భోంస్లే కన్నుమూత.. భారతీయ సినీ చరిత్రలో స్వర్ణ యుగానికి ముగింపు

Asha Bhosle: ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ముంబైలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఏడు దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆమె ప్రస్థానం అద్వితీయం.

Published on: Apr 12, 2026, 13:08:06 IST
Advertisement

Asha Bhosle: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక ధ్రువతార నేలకొరిగింది. తన మధుర గాత్రంతో తరాల అంతరాన్ని చెరిపేసిన లెజెండరీ సింగర్, గాన కోకిల ఆశా భోంస్లే (92) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం (ఏప్రిల్ 12) మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు.

ఆశా భోంస్లే మృతి

ఆశా భోంస్లే
ఆశా భోంస్లే

శనివారం రాత్రి శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు, గుండె సమస్యలు తలెత్తడంతో ఆశా భోంస్లేను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఆమె మరణవార్తను కుమారుడు ఆనంద్ భోంస్లే ధృవీకరించారు. రేపు (ఏప్రిల్ 13) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మంగేష్కర్ కుటుంబం నుంచి మరో కోకిల

1933లో సంగీత నేపథ్యం ఉన్న మంగేష్కర్ కుటుంబంలో ఆశా జన్మించారు. ఆమె అక్క, దివంగత లతా మంగేష్కర్ భారతీయ సంగీతంలో ఒక శిఖరమైతే, ఆశా భోంస్లే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని ఆ స్థాయికి చేరారు. కేవలం 9 ఏళ్ల ప్రాయంలోనే పాడటం ప్రారంభించిన ఆమె, 1943లో తొలిసారి సినీ గీతాన్ని ఆలపించారు.

1950వ దశకం నాటికి బాలీవుడ్‌లో తిరుగులేని గాయనిగా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు సంగీత దర్శకులందరికీ ఆమె మొదటి ఛాయిస్‌గా నిలిచారు.

క్యాబరే పాటల నుంచి గజల్స్ వరకు

కెరీర్ ప్రారంభంలో ఆశాను కేవలం క్యాబరే సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ పాడే గాయనిగా మాత్రమే చూసేవారు. కానీ, 'ఉమ్రావ్ జాన్' చిత్రంలోని గజల్స్‌తో తనలో మరో కోణాన్ని ప్రపంచానికి ఆమె పరిచయం చేశారు.

గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో నేటి సంగీత ధోరణులపై ఆశా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. "నిజం చెప్పాలంటే నేను ఇప్పటి పాటలు అసలు వినను. నాకు పాటలు వినాలనిపిస్తే భీమ్‌సేన్ జోషి శాస్త్రీయ సంగీతం లేదా గజల్స్ వింటాను.

వాటి ద్వారా నేను కొత్త విషయాలు నేర్చుకుంటాను, నా సాధన మెరుగుపడుతుంది. ఇప్పటి పాటల్లో అర్థవంతమైన సాహిత్యం కనిపించడం లేదు. అప్పుడప్పుడు రాహత్ ఫతే అలీ ఖాన్, సునిధి చౌహాన్ పాడిన కొన్ని పాటలు బాగుంటాయి" అని ఆమె వ్యాఖ్యానించారు.

ఒడుదొడుకుల జీవితం

ఆశా వ్యక్తిగత జీవితం అనేక మలుపులతో సాగింది. 16 ఏళ్ల వయసులో తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా 31 ఏళ్ల గణపత్‌రావు భోంస్లేను వివాహం చేసుకున్నారు. అయితే, అత్తమామల వేధింపుల కారణంగా 1960లో ముగ్గురు పిల్లలతో సహా ఆమె బయటకు వచ్చేశారు.

ఆ తర్వాత 1980లో తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన ప్రముఖ సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్‌ను పెళ్లాడారు. వీరిద్దరి ప్రేమాయణానికి బర్మన్ కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదురైంది. 1994లో ఆర్డీ బర్మన్ మరణించే వరకు వీరి బంధం కొనసాగింది. చివరి రోజుల్లో ఆమె మనవరాలు జనాయ్ భోంస్లే ఆమెకు తోడుగా ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe