ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఓ ఫీల్ గుడ్ సినిమాగా గతేడాది క్రిస్మస్ కు రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి సుమారు 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మలయాళ మూవీ పేరు 'మిండియుమ్ పరంజుమ్' (Mindiyum Paranjum). ఉన్ని ముకుందన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీ విడుదల వివరాలు అధికారికంగా బయటికి వచ్చాయి.
మిండియుమ్ పరంజుమ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?

థియేటర్లలో విడుదలైన సుమారు 40 రోజుల తర్వాత ఈ మిండియుమ్ పరంజుమ్ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'సన్ నెక్ట్స్' (Sun NXT) వేదికగా ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి మొదటి వారంలో మలయాళం నుంచి పెద్దగా ఇతర ఓటీటీ రిలీజ్లు లేకపోవడంతో.. ఈ వీకెండ్లో ఇంటిల్లిపాదీ చూడదగ్గ సినిమాగా ఇది నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఎండీబీలో దీనికి ఏకంగా 8 రేటింగ్ ఉంది.
మరోవైపు క్రిస్మస్ కానుకగా వచ్చిన నివిన్ పాలీ హారర్ కామెడీ మూవీ 'సర్వం మాయ' కూడా జియోహాట్స్టార్ వేదికగా గతవారం స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి థియేటర్లలో కంటే ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
మిండియుమ్ పరంజుమ్ కథేంటి?
కేరళలోని ఇడుక్కి అందాల నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన సనల్ (ఉన్ని ముకుందన్), తన ప్రేయసి లీనా (అపర్ణ బాలమురళి) కోసం ఇడుక్కి చేరుకుంటాడు. వారిద్దరి జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించి వారు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనేదే ఈ సినిమా మూల కథ. ఇందులో భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
మిండియుమ్ పరంజుమ్ విశేషాలు
'యశోద', 'భాగమతి' వంటి సినిమాలతో తెలుగు వారికి సుపరిచితుడైన ఉన్ని ముకుందన్ ఇందులో సనల్ పాత్రలో నటించగా, 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ బాలమురళి లీనా పాత్రలో ఒదిగిపోయింది. జూడ్ ఆంథోనీ, మాల పార్వతి, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూకా' సినిమా దర్శకుడు అరుణ్ బోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మధు అంబట్ సినిమాటోగ్రఫీ, సూరజ్ ఎస్ కురుప్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
{{/usCountry}}'యశోద', 'భాగమతి' వంటి సినిమాలతో తెలుగు వారికి సుపరిచితుడైన ఉన్ని ముకుందన్ ఇందులో సనల్ పాత్రలో నటించగా, 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ బాలమురళి లీనా పాత్రలో ఒదిగిపోయింది. జూడ్ ఆంథోనీ, మాల పార్వతి, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూకా' సినిమా దర్శకుడు అరుణ్ బోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మధు అంబట్ సినిమాటోగ్రఫీ, సూరజ్ ఎస్ కురుప్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
{{/usCountry}}నిజానికి ఈ సినిమా షూటింగ్ రెండో లాక్డౌన్ సమయంలోనే జరిగింది. పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రతి మలయాళీ కుటుంబంలోనూ ఎవరో ఒకరు విదేశాల్లో ఉంటారని, వారి జీవితాలకు ఈ కథ దగ్గరగా ఉంటుందని దర్శకుడు అరుణ్ బోస్ పేర్కొన్నాడు. ఆలస్యంగా వచ్చినా థియేటర్లలో ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయి ఆదరణ దక్కుతుందని చిత్రబృందం భావిస్తోంది.