...
...
Next Story

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరికొన్ని గంటల్లో మలయాళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ మస్తిష్క మరణం.. 2040లో వర్చువల్ రియాలిటీ ఇలా..

నెట్‌ఫ్లిక్స్ లోకి మరికొన్ని గంటల్లో మలయాళం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ మస్తిష్క మరణం (Mastishka Maranam) స్ట్రీమింగ్ కు వస్తోంది. 2040లో వర్చువల్ రియాలిటీ చుట్టు తిరిగే ఈ మూవీకి ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉంది.

Published on: Mar 26, 2026, 15:06:50 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మలయాళ డైరెక్టర్ క్రిశంద్ లేటెస్ట్‌గా తీసిన 'మస్తిష్క మరణం' సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. సైన్స్ ఫిక్షన్, డార్క్ హ్యూమర్, మంచి ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్.. ఇలా అన్నీ కలగలిపి తీసిన ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రజిషా విజయన్ మెయిన్ లీడ్‌గా చేసిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఫిబ్రవరి 27న థియేటర్లలోకి వచ్చి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. థియేటర్లలో ఈ మ్యాజిక్ మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరికొన్ని గంటల్లో మలయాళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ మస్తిష్క మరణం.. 2040లో వర్చువల్ రియాలిటీ ఇలా..
నెట్‌ఫ్లిక్స్‌లోకి మరికొన్ని గంటల్లో మలయాళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ మస్తిష్క మరణం.. 2040లో వర్చువల్ రియాలిటీ ఇలా..

ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రేపు అంటే శుక్రవారం, మార్చి 27వ తేదీన ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో అఫీషియల్‌గా ప్రీమియర్ చేయబోతున్నారు. ఈ వీకెండ్ ఇంట్లో కూర్చుని ఒక మంచి డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

మస్తిష్క మరణం కథ ఏంటంటే..

మస్తిష్క మరణం సినిమా కథ 2040వ సంవత్సరంలో నియో కొచ్చి అనే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. మనుషుల జ్ఞాపకాలను బయటకు తీసి, వర్చువల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వాటిని వేరే వాళ్లతో షేర్ చేసుకోవడం, లేదా అమ్ముకోవడం లాంటివి చేయగలిగే ఒక సైబర్ పంక్ వరల్డ్‌ను ఈ సినిమాలో చూపించారు.

బిమల్ రాజ్ అనే ఒక తండ్రి తన బిడ్డ చనిపోయిన బాధ నుంచి బయటపడటానికి ఇలాంటి వర్చువల్ రియాలిటీ మెమరీ సిమ్యులేషన్స్ వాడటం మొదలుపెడతాడు. అయితే కేవలం తన బాధను మర్చిపోవడానికి మొదలుపెట్టిన ఈ ప్రయత్నం.. అతన్ని అనుకోకుండా ఒక పెద్ద మిస్టీరియస్ డిజిటల్ మెమరీస్ నెట్‌వర్క్‌లోకి లాగుతుంది. ఆ తర్వాత ఒక ఫేమస్ సెలబ్రిటీ జీవితంతో అతను ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ.

రజిషా విజయన్ సూపర్ పర్ఫార్మెన్స్..

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఇందులో ఉన్న డార్క్ హ్యూమర్, డిస్టోపియన్ టోన్ ఈ సినిమాను చాలా స్పెషల్‌గా నిలబెట్టాయి. రజిషాతో పాటు నిరంజ్ మణియన్‌పిళ్ల రాజు, దివ్యా ప్రభ, జగదీష్, సురేష్ కృష్ణ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు తమ అద్భుతమైన నటనతో ఈ కథకు మరింత బలం చేకూర్చారు.

టెక్నికల్ హైలైట్స్ ఇవే..

అజిత్ వినాయక ఫిల్మ్స్, క్రిశంద్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రయాగ్ ముకుందన్ తన కెమెరా వర్క్‌తో ఆ ఫ్యూచరిస్టిక్ సెటప్‌ను చాలా స్టైలిష్ విజువల్స్‌లో చూపించగా.. వర్కీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథలోని టెన్షన్, ఎమోషనల్ మూమెంట్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. టెక్నాలజీ భవిష్యత్తులో మనుషుల సంబంధాలను ఎలా మారుస్తుంది, అలాగే గతాన్ని పట్టుకుని వేలాడటానికి జనాలు ఎంత దూరం వెళ్తారు లాంటి విషయాలను ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe