మలయాళ డైరెక్టర్ క్రిశంద్ లేటెస్ట్గా తీసిన 'మస్తిష్క మరణం' సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. సైన్స్ ఫిక్షన్, డార్క్ హ్యూమర్, మంచి ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్.. ఇలా అన్నీ కలగలిపి తీసిన ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రజిషా విజయన్ మెయిన్ లీడ్గా చేసిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఫిబ్రవరి 27న థియేటర్లలోకి వచ్చి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. థియేటర్లలో ఈ మ్యాజిక్ మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రేపు అంటే శుక్రవారం, మార్చి 27వ తేదీన ఈ సినిమాను నెట్ఫ్లిక్స్లో అఫీషియల్గా ప్రీమియర్ చేయబోతున్నారు. ఈ వీకెండ్ ఇంట్లో కూర్చుని ఒక మంచి డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
మస్తిష్క మరణం కథ ఏంటంటే..
మస్తిష్క మరణం సినిమా కథ 2040వ సంవత్సరంలో నియో కొచ్చి అనే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. మనుషుల జ్ఞాపకాలను బయటకు తీసి, వర్చువల్ ప్లాట్ఫామ్స్ ద్వారా వాటిని వేరే వాళ్లతో షేర్ చేసుకోవడం, లేదా అమ్ముకోవడం లాంటివి చేయగలిగే ఒక సైబర్ పంక్ వరల్డ్ను ఈ సినిమాలో చూపించారు.
బిమల్ రాజ్ అనే ఒక తండ్రి తన బిడ్డ చనిపోయిన బాధ నుంచి బయటపడటానికి ఇలాంటి వర్చువల్ రియాలిటీ మెమరీ సిమ్యులేషన్స్ వాడటం మొదలుపెడతాడు. అయితే కేవలం తన బాధను మర్చిపోవడానికి మొదలుపెట్టిన ఈ ప్రయత్నం.. అతన్ని అనుకోకుండా ఒక పెద్ద మిస్టీరియస్ డిజిటల్ మెమరీస్ నెట్వర్క్లోకి లాగుతుంది. ఆ తర్వాత ఒక ఫేమస్ సెలబ్రిటీ జీవితంతో అతను ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ.
రజిషా విజయన్ సూపర్ పర్ఫార్మెన్స్..
ఈ సినిమాలో రజిషా విజయన్ ఫ్రీడా సోమన్ అనే ఒక సూపర్ స్టార్ క్యారెక్టర్లో నటించింది. కథను ముందుకు తీసుకెళ్లే అసలు రహస్యాలన్నీ ఆమె జ్ఞాపకాల్లోనే దాగి ఉంటాయి. ఒక సెలబ్రిటీకి ఉండే గ్లామర్ను, అలాగే ఎమోషనల్ డెప్త్ను ఆమె చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేసిందని రివ్యూయర్స్ తెగ మెచ్చుకున్నారు.
{{/usCountry}}ఈ సినిమాలో రజిషా విజయన్ ఫ్రీడా సోమన్ అనే ఒక సూపర్ స్టార్ క్యారెక్టర్లో నటించింది. కథను ముందుకు తీసుకెళ్లే అసలు రహస్యాలన్నీ ఆమె జ్ఞాపకాల్లోనే దాగి ఉంటాయి. ఒక సెలబ్రిటీకి ఉండే గ్లామర్ను, అలాగే ఎమోషనల్ డెప్త్ను ఆమె చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేసిందని రివ్యూయర్స్ తెగ మెచ్చుకున్నారు.
{{/usCountry}}రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఇందులో ఉన్న డార్క్ హ్యూమర్, డిస్టోపియన్ టోన్ ఈ సినిమాను చాలా స్పెషల్గా నిలబెట్టాయి. రజిషాతో పాటు నిరంజ్ మణియన్పిళ్ల రాజు, దివ్యా ప్రభ, జగదీష్, సురేష్ కృష్ణ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు తమ అద్భుతమైన నటనతో ఈ కథకు మరింత బలం చేకూర్చారు.
టెక్నికల్ హైలైట్స్ ఇవే..
అజిత్ వినాయక ఫిల్మ్స్, క్రిశంద్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రయాగ్ ముకుందన్ తన కెమెరా వర్క్తో ఆ ఫ్యూచరిస్టిక్ సెటప్ను చాలా స్టైలిష్ విజువల్స్లో చూపించగా.. వర్కీ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథలోని టెన్షన్, ఎమోషనల్ మూమెంట్స్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. టెక్నాలజీ భవిష్యత్తులో మనుషుల సంబంధాలను ఎలా మారుస్తుంది, అలాగే గతాన్ని పట్టుకుని వేలాడటానికి జనాలు ఎంత దూరం వెళ్తారు లాంటి విషయాలను ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు.