Mamitha Baiju Hospitalised: 'ప్రేమలు' సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా యూత్ క్రష్గా మారిన మలయాళీ భామ మమిత బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం, ఎలర్జీ, ఆస్తమా సమస్యలు ఎక్కువ కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు ఆమెను ప్రయాణాలు చేయకుండా పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
ఆస్ట్రేలియా టూర్ హఠాత్తుగా రద్దు

ఆస్ట్రేలియాలోని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఓనమ్ వేడుకలకు మమితా బైజు చీఫ్ గెస్ట్గా హాజరుకావాల్సి ఉంది. ఆస్ట్రేలియాలోని ప్రవాస మలయాళీలను కలవడానికి ఆమె ఎంతో ఉత్సాహంగా ప్లాన్ చేసుకున్నారు.
కానీ ప్రయాణం చేసే పరిస్థితి లేకపోవడంతో ఆస్ట్రేలియా ఈవెంట్ నిర్వాహకులకు మమితా బైజు క్షమాపణలు చెబుతూ ఒక ప్రత్యేక సందేశం పంపారు. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందుల వల్ల విమాన ప్రయాణం చేయడం అస్సలు సాధ్యం కావడం లేదని స్పష్టం చేశారు. అభిమానులను నిరాశపరిచినందుకు తీవ్రంగా విచారిస్తున్నట్లు వెల్లడించారు.
బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ రికార్డుల హోరు
ప్రస్తుతం మమితా బైజు కెరీర్ పీక్ స్టేజ్లో ఉంది. రీసెంట్గా నివిన్ పౌలీ సరసన ఆమె నటించిన 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit) మూవీ ఓనమ్ రేసులో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది.
గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 215.20 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 2026లోనే ఆమెకు ఇది వరుసగా మూడో రూ. 200 కోట్ల బాక్సాఫీస్ బ్లాక్బస్టర్ కావడం విశేషం.
ఈ ఏడాది తమిళంలో దళపతి విజయ్ సరసన చేసిన 'జన నాయగన్', సూర్యతో కలిసి నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలు కూడా రూ. 200 కోట్ల క్లబ్లో చేరాయి. సూర్య కాంబినేషన్ మూవీ అయితే కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్లు దాటేసి, ఆ తర్వాత రూ. 150 కోట్లు దాటి రికార్డు క్రియేట్ చేసింది.
'ప్రేమలు' నుంచి సౌత్ లేడీ సెన్సేషన్ వరకు..
{{/usCountry}}ఈ ఏడాది తమిళంలో దళపతి విజయ్ సరసన చేసిన 'జన నాయగన్', సూర్యతో కలిసి నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలు కూడా రూ. 200 కోట్ల క్లబ్లో చేరాయి. సూర్య కాంబినేషన్ మూవీ అయితే కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్లు దాటేసి, ఆ తర్వాత రూ. 150 కోట్లు దాటి రికార్డు క్రియేట్ చేసింది.
'ప్రేమలు' నుంచి సౌత్ లేడీ సెన్సేషన్ వరకు..
{{/usCountry}}2024లో వచ్చిన రొమాంటిక్ హిట్ 'ప్రేమలు' (Premalu)లో 'రీను' పాత్రతో మమిత సాధించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆ సినిమా దాదాపు రూ. 136 కోట్ల గ్రాస్ వసూలు చేసి సౌత్ మొత్తాన్ని ఊపేసింది.
ఆ తర్వాత తమిళంలో 'డ్యూడ్' (Dude) సినిమాతో రూ. 100 కోట్ల మార్కును అందుకుని కోలీవుడ్లో విజయం సాధించారు. కేవలం 50 రోజుల వ్యవధిలోనే మూడు సినిమాలు రూ. 200 కోట్ల గ్రాస్ సాధించడం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయి.
ఇంతటి వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న మమిత హఠాత్తుగా ఆస్పత్రి పాలవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లలో పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు.