మన శంకరవరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5 ఓటీటీ ఒక రోజు ముందే ఓ స్పెషల్ వీడియోతో బాస్ ఈజ్ కమింగ్ అంటూ టీజ్ చేసింది. ఇప్పుడు స్ట్రీమింగ్ ఫిబ్రవరి 11 నుంచే అంటూ కన్ఫమ్ చేసింది.
మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ డేట్

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ వచ్చే వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెల రోజులకు డిజిటల్ ప్రీమియర్ కానుంది. వచ్చే బుధవారం అంటే ఫిబ్రవరి 11 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
అది కూడా ఏడు భాషల్లో కావడం విశేషం. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో రానుంది. ఈ విషయాన్ని జీ5 తన ప్లాట్ఫామ్ లో కన్ఫమ్ చేసింది. ఈ మూవీ గురించి సెర్చ్ చేసినప్పుడు కింద స్ట్రీమింగ్ డేట్ ఫిబ్రవరి 11 అని ఉంది.
మన శంకరవరప్రసాద్ గారు రికార్డు
ఈ ఏడాది రిలీజైన సంక్రాంతి సినిమాల్లో చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు అన్నింటి కంటే మెగా బ్లాక్బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఇండియాలోనే రూ.200 కోట్లకుపైగా నెట్ వసూళ్లు రావడం విశేషం. చిరంజీవి, నయనతారతోపాటు ఈ మూవీలో వెంకటేశ్ కూడా ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈసారి అంతకంటే పెద్ద హిట్ అందించాడు. చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు మూవీగా నిలవడంతో అతడు.. అనిల్ కు ఓ లగ్జరీ కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. అలాంటి మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుండటంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.