బాస్ ఈజ్ కమింగ్.. ఓటీలోకి మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన మన శంకరవరప్రసాద్ గారు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ వెల్లడించకపోయినా.. కమింగ్ సూన్ అంటూ జీ5 ఓటీటీ ఓ అదిరిపోయే వీడియోను మంగళవారం (ఫిబ్రవరి 3) రిలీజ్ చేసింది. అయితే ఫిబ్రవరి 11 నుంచి సినిమా స్ట్రీమింగ్ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ డేట్

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వరకూ వసూలు చేసిన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. జీ5 ఓటీటీ రిలీజ్ చేసిన వీడియో ఆసక్తి రేపుతోంది.
“మన శంకరవరప్రసాద్ గారు. ది బాస్, ది మెగాస్టార్. జీ5లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చూస్తూనే ఉండండి” అనే క్యాప్షన్ తో వీడియోను ట్వీట్ చేసింది. ఇందులో చిరంజీవి, నయనతార, వెంకటేశ్ కీలకమైన మూమెంట్స్ ను చూడొచ్చు. చివర్లో బాస్ ఈజ్ కమింగ్ అని చెప్పారు.
ఏడు భాషల్లో స్ట్రీమింగ్
మన శంకరవరప్రసాద్ గారు మూవీ ఏకంగా ఏడు భాషల్లో ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది. ఇన్ని భాషల్లో వస్తుండటంతో సినిమాకు థియేటర్లలో కంటే ఓటీటీలో మరింత అదిరిపోయే రెస్పాన్స్ రానుందని మూవీ టీమ్ భావిస్తోంది.
మన శంకరవరప్రసాద్ గారు రికార్డు
ఈ ఏడాది రిలీజైన సంక్రాంతి సినిమాల్లో చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు అన్నింటి కంటే మెగా బ్లాక్బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు సాధించింది.
{{/usCountry}}ఈ ఏడాది రిలీజైన సంక్రాంతి సినిమాల్లో చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు అన్నింటి కంటే మెగా బ్లాక్బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు సాధించింది.
{{/usCountry}}ఇండియాలోనే రూ.200 కోట్లకుపైగా నెట్ వసూళ్లు రావడం విశేషం. చిరంజీవి, నయనతారతోపాటు ఈ మూవీలో వెంకటేశ్ కూడా ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈసారి అంతకంటే పెద్ద హిట్ అందించాడు. చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు మూవీగా నిలవడంతో అతడు.. అనిల్ కు ఓ లగ్జరీ కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. అలాంటి మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుండటంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.