...
...
Next Story

తెలుగు సినిమాతో డెబ్యూ-మ‌ల‌యాళంలో పాపుల‌ర్‌-43 ఏళ్ల‌కు మూడోసారి విడాకులు-ప్ర‌శాంతంగా ఉన్నాన‌ని న‌టి సంచ‌ల‌న పోస్ట్‌

మీరా వాసుదేవన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన విడాకులను కన్ఫామ్ చేసింది. ఆగష్టు 2025 నుండి తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది. విడాకుల తర్వాత జీవితం ప్రశాంతంగా ఉందని కూడా వెల్లడించింది. ఇది ఆమెకు మూడో విడాకులు.

Published on: Nov 18, 2025, 06:03:18 IST
Advertisement

నటి మీరా వాసుదేవన్ తన మూడవ భర్త, సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియాంకమ్ నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వచ్చింది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది ఆగష్టు నుండి ఒంటరిగా ఉంది. నటి దీనికి ఎటువంటి కారణాలు వెల్లడించనప్పటికీ, విడాకుల తర్వాత జీవితం అత్యంత ప్రశాంతంగా ఉందని మాత్రం మీరా భావిస్తున్నారు.

మీరా వాసుదేవన్ విడాకులు

మీరా వాసుదేవన్ (Instagram/officialmeeravasudevan)
మీరా వాసుదేవన్ (Instagram/officialmeeravasudevan)

తెలుగు సినిమాతో డెబ్యూ చేసి మలయాళంలో పాపులర్ అయిన నటి మీరా వాసుదేవన్ మూడోసారి విడాకులు తీసుకుంది. “నేను, నటి మీరా వాసుదేవన్. ఆగష్టు 2025 నుండి ఒంటరిగా ఉన్నానని అధికారికంగా ప్రకటిస్తున్నా. నా జీవితంలో అత్యంత అద్భుతమైన, ప్రశాంతమైన దశలో ఉన్నాను” అని ఆమె హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తూ రాశారు. ఆమె 'ఫోకస్డ్', 'బ్లెస్డ్', 'గ్రాటిట్యూడ్' వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగించారు.

మూడు సార్లు పెళ్లి

43 ఏళ్ల మీరా వాసుదేవన్ జేడీ చక్రవర్తి, రమేష్ ఆనంద్ నటించిన గోల్ మాల్ సినిమాతో 2003 డెబ్యూ చేశారు. 2004లో తెలుగులో అంజలి ఐ లవ్యూ మూవీలో నటించారు. ఆ తర్వాత హిందీ, అనంతరం మలయాళంలో ఫుల్ బిజీ అయిపోయారు. ఆమె మలయాళం, తమిళం, తెలుగు, హిందీ చిత్రాలు, టీవీ షోలలో పనిచేస్తున్నారు.

అవార్డులు

మీరా వాసుదేవన్ మలయాళ చిత్రం 'తన్మత్ర'తో 'ఉజాలా-ఆసియానెట్ బెస్ట్ న్యూ ఫేస్ అవార్డు'ను అందుకున్నారు. ఆమె ‘కుటుంబవిళక్కు’, 'చిత్తి 2' వంటి టీవీ సీరియల్స్‌లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందారు. మీరా తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక అవార్డు, కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకున్నారు. మీరా వాసుదేవన్ మలయాళ చాట్ షో 'జేబీ జంక్షన్'లో జాన్ బ్రిటాస్ హోస్ట్ చేసిన షోలో కనిపించిన తర్వాత వివాదాన్ని ఎదుర్కొన్నారు. ఆమె తమ మాటలను వక్రీకరించారని ఆరోపించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks