...
...
Next Story

సడెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన ప్రియ‌ద‌ర్శి కామెడీ థ్రిల్ల‌ర్‌.. ల‌వ‌ర్ కిడ్నాప్‌.. పులిబిడ్డ ఎవరు?

ప్రియదర్శి, నిహారిక్ ఎన్ఎమ్ లీడ్ రోల్స్ ప్లే చేసిన లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సడెన్ గా ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ఈ కామెడీ థ్రిల్లర్. 20 రోజులకే ఓటీటీలో అడుగుపెట్టింది ఈ సినిమా.

Published on: Nov 6, 2025, 08:19:17 IST
Advertisement

సడెన్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియదర్శి లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ ‘మిత్ర మండలి’. 20 రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది ఈ ఫిల్మ్. ఓ అమ్మాయిని ప్రేమించే నలుగురు యువకులు చూట్టూ తిరిగే కథ ఇది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.

మిత్ర మండలి ఓటీటీ

ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్ (x/Priyadarshi Pulikonda)
ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్ (x/Priyadarshi Pulikonda)

ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మిత్ర మండలి. ఈ సినిమా ఇవాళ (నవంబర్ 6) సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ప్రియదర్శితో పాటు నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మమూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిశోర్, సత్య తదితరులు నటించారు.

20 రోజుల్లోనే

మిత్ర మండలి సినిమా థియేటర్లో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ మూవీ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే థియేటర్లో ఈ సినిమా అనుకున్నంత ఆడలేదు. మరోవైపు తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ లాంటి చిత్రాలతో పోటీని తట్టుకోలేకపోయింది. ఇప్పుడు 20 రోజుల్లోనే అంటే నవంబర్ 6న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీ రైట్స్

మిత్ర మండలి సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ రెండింటి వాల్యూ కలిపి రూ.9.50 కోట్లుగా టాక్. ఈ ప్రకారం మిత్ర మండలి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఓటీటీలో అడుగుపెట్టింది.

మిత్ర మండలి కథ

మరోవైపు చైైతన్యను స్వేచ్ఛ ప్రేమిస్తుంటుంది. ఈ క్రమంలోనే స్వేచ్ఛను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఈ కేసును సాల్వ్ చేసేందుకు పోలీస్ ఆఫీసర్ గా వెన్నెల కిశోర్ రంగంలోకి దిగుతాడు. మరి స్వేచ్ఛను కిడ్నాప్ చేసింది ఎవరు? చైతన్య, స్వేచ్ఛ లవ్ స్టోరీ ఏమైంది? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe