బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన నటనతో ఆకట్టుకుంటున్న మృణాల్ ఠాకూర్.. ఇటీవల తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం నటుడు ధనుష్తో, తాజాగా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్తో ఆమె డేటింగ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఈ ఊహాగానాలకు మృణాల్ తనదైన శైలిలో, చాలా కూల్గా సమాధానం ఇచ్చింది.
మృణాల్ ఠాకూర్ రియాక్షన్ ఇదే

మృణాల్ ఠాకూర్ ఆదివారం (నవంబర్ 30) తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకుంది. ఇందులో ఆమె తల్లి ఆమె తలకు మసాజ్ చేస్తుండగా, మృణాల్ వీడియో రికార్డ్ చేయడం చూడొచ్చు. ఇద్దరూ కెమెరా వైపు చూస్తూ పగలబడి నవ్వుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోకి ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
"వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు.. మేము నవ్వుకుంటాం. పుకార్లు అనేవి ఫ్రీ పీఆర్ లాంటివి. నాకు ఫ్రీగా వచ్చేవి అంటే చాలా ఇష్టం" అని మృణాల్ అనడం విశేషం. ఆమె ఏ పుకారు గురించి మాట్లాడుతోందో స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, ఇటీవల తన డేటింగ్ గురించి వస్తున్న వార్తలకు ఇదే ఆమె సమాధానం అని నెటిజన్లు భావిస్తున్నారు.
శ్రేయస్ అయ్యర్తో డేటింగ్?
ఈ మధ్య 'రెడిట్' వేదికగా ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. మృణాల్ ఠాకూర్, టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గత కొన్ని నెలలుగా సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారని, వారి బంధం ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నది ఆ పోస్ట్ సారాంశం. వీరిద్దరూ తమ బంధాన్ని ప్రైవేట్ గా ఉంచుతున్నారని ఆ పోస్ట్లో రాసుకొచ్చారు.
దీనికి ముందు ఆగస్టులో జరిగిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్ ఈవెంట్లో మృణాల్.. నటుడు ధనుష్ కలిసి కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు వచ్చాయి. ధనుష్ సోదరీమణులను మృణాల్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం, ధనుష్ 'తేరే ఇష్క్ మే' సినిమా ప్రమోషన్ కోసం వారణాసి వెళ్ళినప్పుడు పెట్టిన ఫోటోలకు మృణాల్ కామెంట్ చేయడం ఈ ఊహాగానాలకు ఆజ్యం పోశాయి.
సినిమాల విషయానికొస్తే..
{{/usCountry}}దీనికి ముందు ఆగస్టులో జరిగిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్ ఈవెంట్లో మృణాల్.. నటుడు ధనుష్ కలిసి కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు వచ్చాయి. ధనుష్ సోదరీమణులను మృణాల్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం, ధనుష్ 'తేరే ఇష్క్ మే' సినిమా ప్రమోషన్ కోసం వారణాసి వెళ్ళినప్పుడు పెట్టిన ఫోటోలకు మృణాల్ కామెంట్ చేయడం ఈ ఊహాగానాలకు ఆజ్యం పోశాయి.
సినిమాల విషయానికొస్తే..
{{/usCountry}}మృణాల్ చివరగా అజయ్ దేవగన్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’లో కనిపించింది. రవి కిషన్, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.65.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
ప్రస్తుతం ఆమె ‘దో దీవానే షెహర్ మే’ అనే సినిమాలో నటిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ మూవీకి రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్నాడు. ఈ రొమాంటిక్ సినిమా ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో విడుదల కానుంది.