బ్లాక్ బస్టర్ టాక్.. కలెక్షన్ల దుమ్మురేపుతున్న ధనుష్ మూవీ.. తేరే ఇష్క్ మే ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఎన్ని కోట్లో తెలుసా?
'తేరే ఇష్క్ మే' చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను సాధించింది. ధనుష్, కృతి సనన్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మంచి టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా 2025లో సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు.
ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'తేరే ఇష్క్ మే' భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి వారాంతంలో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ లవ్ స్టోరీకి ఆడియన్స్ నుంచి అపూర్వమైన స్పందన దక్కుతోంది. శుక్రవారం (నవంబర్ 28) ప్రపంచవ్యాప్తంగా తేరే ఇష్క్ మే మూవీ రిలీజైంది. తెలుగులోనూ ‘అమర కావ్యం’ పేరుతో డబ్ చేశారు. మరి ఈ సినిమా మూడు రోజుల్లో ఎన్ని రూ.కోట్లు కొల్లగొట్టిందో చూద్దాం.

తేరే ఇష్క్ మే కలెక్షన్లు
తేరే ఇష్క్ మే తన ఫస్ట్ వీకెండ్ ను ఘనంగా ముగించింది. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం సండే ముగిసే సరికి మంచి వసూళ్లను ఖాతాలో వేసుకుంది. మూడు రోజుల్లో కలిపి సుమారు రూ.48.35 కోట్ల కలెక్షన్లు దక్కించుకుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ట్రేడ్-సైట్ సక్నిల్క్ డేటా ప్రకారం.. ఈ చిత్రం శుక్రవారం రూ.16 కోట్లతో బలమైన ఓపెనింగ్ అందుకుంది. ఆ తర్వాత శనివారం రూ.17 కోట్లు, ఆదివారం అంచనా ప్రకారం రూ.15.35 కోట్లు వసూలు చేసింది. దీంతో ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఆదాయం అన్ని భాషల్లో కలిపి ఇండియాలో రూ.48.35 కోట్లకు చేరుకుంది.
ఆ సినిమాలను దాటి
తేరే ఇష్క్ మే మూవీ 2025లో విడుదలైన పలు ఇతర పెద్ద సినిమాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. విడుదలైన తొలి రోజే 'తేరే ఇష్క్ మే' సినిమా 'జాలీ ఎల్ఎల్బీ 3' (రూ.12 కోట్లు), 'సీతారే జమీన్ పర్' (రూ.10.70 కోట్లు) వంటి చిత్రాల ఓపెనింగ్ డే కలెక్షన్లను అధిగమించింది.
బిగ్గెస్ట్ ఓపెనింగ్
తేరే ఇష్క్ మే మూవీ ధనుష్ బాలీవుడ్ కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్ కావడం విశేషం. పరిశ్రమ విశ్లేషకులు అందించిన వివరాల ప్రకారం తొలి రోజు దేశవ్యాప్తంగా సినిమాకు సుమారు 25-26 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి షోలు ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
'తేరే ఇష్క్ మే' కథేంటి?
ప్రఖ్యాత దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన 'తేరే ఇష్క్ మే', రాయ్-ధనుష్ కాంబినేషన్ లో మరోసారి తెరకెక్కింది. కృతి సనన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో ధనుష్ ఒక తీవ్రమైన, కోపిష్టి ఎయిర్ ఫోర్స్ అధికారిగా, సనన్ రక్షణ శాఖలో థెరపిస్ట్ గా నటించారు. వారి కథ కాలేజ్ ప్రేమకథతో ప్రారంభమవుతుంది. కానీ విధి వక్రించి హృదయ విదారక సంఘటనలు, ద్రోహం ధనుష్ ను మరింత చీకటి, ఆవేశపూరిత మార్గంలో నడిపిస్తాయి.
సినిమాకు ప్రధాన ఆకర్షణ అయిన సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ అందించారు. సాహిత్యాన్ని ఇర్షాద్ కమిల్ అందించారు. ఈ చిత్రాన్ని కలర్ యెల్లో ప్రొడక్షన్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మించారు. 2025 నవంబర్ 28న హిందీ, తమిళంతో పాటు డబ్బింగ్ వెర్షన్లలో విడుదలైన 'తేరే ఇష్క్ మే' విడుదలకి ముందే విపరీతమైన ప్రచారం, ప్రజాదరణ పొందిన తారాగణం, సంగీతంపై అంచనాల కారణంగా గణనీయమైన బజ్ ను సృష్టించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


