టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరోలియో.. మాస్ జాతర ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఈరోజు బతికి ఉండటానికి కారణంగా రవితేజ సర్ అని అతడు అనడం గమనార్హం. తనను ఆదుకున్న దేవుడు, తన కోసం నిలబడిన వ్యక్తి, శక్తి, వ్యవస్థ రవితేజ అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.
భీమ్స్ సీసిరోలియో ఏమన్నాడంటే?

రవితేజ, శ్రీలీల నటించిన మాస్ జాతర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం (అక్టోబర్ 28) రాత్రి జరిగిన విషయం తెలుసు కదా. ఈ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరోలియో చాలా ఎమోషనల్ అయ్యాడు. తాను, తన కుటుంబం ఇవాళ బతికి ఉండటానికి కారణం రవితేజ సర్ అని అతడు చెప్పాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట రవితేజ చేసిన సాయం గురించి పాట రూపంలో పాడాడు. ఆ తర్వాత మాట్లాడాడు.
“నేను ఇవాళ ఓ వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. నేను ధమాకా చేసినప్పటి నుంచి చిరంజీవి సర్ సినిమా చేసే వరకు ప్రతి పాట వెనుక, ప్రతి ప్రోత్సాహం వెనుక ఓ వ్యక్తి ఉన్నారు. నేను ఓ పాట పాడుతూ సెల్ ఫోన్ లో వీడియో తీసుకుంటున్న సమయంలో నా భార్యా పిల్లలకు అది ఎందుకు తీస్తున్నానో తెలియదు. అప్పటికి ఇంటికి కిరాయి ఎలా కట్టాలి.. పిల్లలను ఎలా చదివించాలి అని బాధపడుతున్నాను. అప్పుడే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది.
నాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి.. ఇక నేను, నా భార్యాపిల్లలతో కట్టగట్టుకొని పైకి వెళ్లిపోదామనుకున్నాను. అలాంటి సమయంలో ఓ దేవుడిలాగా, ఓ జీసస్ లాగా, ఓ అల్లాలాగా, రాముడిగా, తిరుపతి వెంకన్న నా జీవితంలో ఓ వ్యక్తి వచ్చారు. నన్ను ఆదుకున్న దేవుడు.. నా కోసం నిలబడిన వ్యక్తి, శక్తి, వ్యవస్థ రవితేజ సర్. ఇవాళ నేను సజీవంగా ఉండటానికి కారణం.. అమ్మా, నాన్నా తెలుసుకోండి.. ఆ వ్యక్తి రవితేజ సర్ ” అని భీమ్స్ సీసిరోలియో అనడంతో ఆడిటోరియం అంతా మార్మోగిపోయింది.
భీమ్స్ సీసిరోలియో గురించి..
భీమ్స్ సీసిరోలియో తెలంగాణలోని మహబూబాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి. 2012లోనే నువ్వా నేనా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చినా చాలా ఏళ్ల పాటు పెద్దగా బ్రేక్ లభించలేదు. అయితే ధమాకా మూవీతో అతని జీవితం మారిపోయింది. 2022లో ఈ మూవీ వచ్చింది.
{{/usCountry}}భీమ్స్ సీసిరోలియో తెలంగాణలోని మహబూబాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి. 2012లోనే నువ్వా నేనా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చినా చాలా ఏళ్ల పాటు పెద్దగా బ్రేక్ లభించలేదు. అయితే ధమాకా మూవీతో అతని జీవితం మారిపోయింది. 2022లో ఈ మూవీ వచ్చింది.
{{/usCountry}}ఆ తర్వాత బలగం, రావణాసుర, టిల్లూ స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, ఇప్పుడు మాస్ జాతర, తర్వాత చిరంజీవి మూవీ మన శంకర్ వరప్రసాద్ గారులాంటి మూవీస్ తో తిరుగులేకుండా దూసుకెళ్తున్నాడు. అయితే అంతా అయిపోయిందనుకున్న సమయంలో తనకు అవకాశం ఇచ్చిన రవితేజను మాత్రం భీమ్స్ మరచిపోలేదు. తాజాగా అతడు ఇచ్చిన స్పీచ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.