...
...
Next Story

Naga Chaitanya Dhootha 2: నాగ చైతన్య నిర్మాత.. దూత 2 కోసం 8 ఏళ్ల తర్వాత మళ్లీ వాళ్ల కాంబో రిపీట్

Naga Chaitanya Dhootha 2: టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'దూత' సీక్వెల్‌తో సరికొత్త అవతారమెత్తారు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న 'దూత 2' ద్వారా ఆయన ప్రొడ్యూసర్‌గా మారుతున్నారు. అంతేకాదు సీనియర్ నటి భూమిక చావ్లా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రాజెక్టులో భాగమయ్యారు.

Published on: Jun 9, 2026, 14:36:35 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Naga Chaitanya Dhootha 2: టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలతో నటుడిగా మెప్పిస్తున్న అక్కినేని నాగచైతన్య తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేశారు. ఓ పక్క హీరోగా బిజీగా ఉంటూనే, మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు.

Naga Chaitanya Dhootha 2: నాగ చైతన్య నిర్మాత.. దూత 2 కోసం 8 ఏళ్ల తర్వాత మళ్లీ వాళ్ల కాంబో రిపీట్
Naga Chaitanya Dhootha 2: నాగ చైతన్య నిర్మాత.. దూత 2 కోసం 8 ఏళ్ల తర్వాత మళ్లీ వాళ్ల కాంబో రిపీట్

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'దూత' (Dhootha) అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'దూత 2'తో చైతూ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Vikram K Kumar Dhootha 2 | విక్రమ్ కుమార్ మార్క్ మైండ్ గేమ్ థ్రిల్లర్

విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 'దూత' ఫస్ట్ సీజన్ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అందులో జర్నలిస్ట్‌గా నాగచైతన్య యాక్టింగ్ కు క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు దక్కాయి.

ఆ సూపర్ సక్సెస్ ఇచ్చిన కిక్ తో మేకర్స్ 'దూత 2'ను మరింత భారీగా ప్లాన్ చేశారు. ఫస్ట్ సీజన్‌లో మిగిలిపోయిన మిస్టరీలను, వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త ట్విస్టులను ఈ సీక్వెల్‌లో చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సీక్వెల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ స్వింగ్ లో సాగుతోంది.

Bhumika in Dhootha 2 | ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అదే క్రేజీ కాంబో

ఈ సీక్వెల్ సరికొత్త కాస్టింగ్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'ఖుషి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటి భూమిక చావ్లా.. ఈ వెబ్ సిరీస్‌లో ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. నాగచైతన్య, భూమిక కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'సవ్యసాచి' (2018) సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.

మళ్లీ దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఈ ప్రాజెక్టుపై ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. భూమిక ఇప్పటికే సెట్స్ లో జాయిన్ అయ్యి షూటింగ్‌లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

Dhootha 2 Cast and Crew | భారీ బడ్జెట్.. క్రేజీ కాస్టింగ్

దూత 2 సిరీస్ లో నాగ చైతన్యతోపాటు భూమికా చావ్లా, ప్రియా భవానీ శంకర్, పార్వతీ తిరువోతులాంటి వాళ్లు నటిస్తుండగా.. విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకే ఈ వెబ్ సిరీస్ అడుగుపెట్టనుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్‌డేట్స్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా రిలీజ్ చేయనున్నారు.

People Also Ask (FAQs)

నాగచైతన్య నిర్మాతగా మారుతున్న తొలి ప్రాజెక్ట్ ఏది?

అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ 'దూత 2' ద్వారా చైతూ తొలిసారి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

'దూత 2' వెబ్ సిరీస్ డైరెక్టర్ ఎవరు?

'మనం', '24', 'గ్యాంగ్ లీడర్' లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.

ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత నాగచైతన్యతో కలిసి నటిస్తున్న సీనియర్ నటి ఎవరు?

'ఖుషి' ఫేమ్ భూమిక చావ్లా దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత నాగచైతన్యతో కలిసి 'దూత 2'లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'సవ్యసాచి' (2018) సినిమాలో నటించారు.

'దూత 2' సిరీస్‌లో నటిస్తున్న ఇతర మెయిన్ లీడ్స్ ఎవరు?

ఈ క్రేజీ వెబ్ సిరీస్‌లో టాలెంటెడ్ నటీమణులు ప్రియా భవానీ శంకర్, పార్వతీ తిరువోతు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks