Balakrishna: సేవా దృక్పథంతో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ (BIACH&RI) 25 వసంతాలు (రజతోత్సవం) పూర్తి చేసుకుంది. ఈ రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని జూన్ 22 (సోమవారం) సాయంత్రం హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్లో చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈరోజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
చిన్నారుల మధ్య బర్త్డే వేడుకలు..

మీడియా సమావేశానికి ముందు హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకలలో బాలకృష్ణ పాల్గొన్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి, వాళ్లకు బొమ్మలు, ఇతర బహుమతులు పంచిపెట్టారు.
తనకు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పారు. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేసేలా దేవుడు తనకు శక్తినివ్వాలని ఆయన కోరుకున్నారు.
రజతోత్సవాలకు వీవీఐపీ గెస్ట్లు
2000 సంవత్సరంలో మొదలైన ఈ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వర్గీయ ఎన్టీఆర్, బసవతారకం ఆశయాల సాధన దిశగా సాగుతోందని బాలయ్య గుర్తుచేశారు. ఈ నెల 22న జరిగే రజతోత్సవ ముగింపు వేడుకలకు దేశం నలుమూలల నుంచి అతిరథ మహారథులు హాజరుకాబోతున్నారు.
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రానున్నారు.
భవిష్యత్ ప్రణాళికలు.. విరాళాల వెల్లువ
గడిచిన 25 ఏళ్ల కాలాన్ని గుర్తుచేసుకున్న బాలకృష్ణ.. భవిష్యత్తులో హైదరాబాద్ హాస్పిటల్ ఆవరణలో కొత్తగా నిర్మించనున్న 'నార్త్ బ్లాక్', అలాగే ఏపీ రాజధాని అమరావతిలోని తూళ్లూరులో కట్టబోయే హాస్పిటల్ పనులను అనుకున్న గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
{{/usCountry}}గడిచిన 25 ఏళ్ల కాలాన్ని గుర్తుచేసుకున్న బాలకృష్ణ.. భవిష్యత్తులో హైదరాబాద్ హాస్పిటల్ ఆవరణలో కొత్తగా నిర్మించనున్న 'నార్త్ బ్లాక్', అలాగే ఏపీ రాజధాని అమరావతిలోని తూళ్లూరులో కట్టబోయే హాస్పిటల్ పనులను అనుకున్న గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
{{/usCountry}}ఈ బర్త్డే సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి పలువురు దాతలు విరాళాలు అందజేశారు. హైదరాబాద్కు చెందిన సీతారామరాజు లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వగా.. త్రివేణి, కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు క్యాన్సర్ రోగుల సహాయార్థం తాము సేకరించిన రూ. 1,01,116 లను బాలకృష్ణకు అందజేశారు.
అమరావతిలో నిర్మించబోయే ఆసుపత్రి కోసం కాకర్ల రాఘవేంద్రరావు ఏకంగా పది లక్షల రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు. చిన్న వయసులోనే సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన విద్యార్థులను బాలయ్య ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
People Also Ask (FAQs)
బసవతారకం హాస్పిటల్ రజతోత్సవ సభ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
జూన్ 22న సాయంత్రం హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్ (Novotel) హోటల్లో ఈ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి.
ఈ వేడుకలకు హాజరవుతున్న ముఖ్య అతిథులు ఎవరు?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పీ. నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.
బాలకృష్ణ తన పుట్టినరోజును ఎలా జరుపుకున్నారు?
బసవతారకం హాస్పిటల్లో క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి, వాళ్లకు బొమ్మలు పంచిపెట్టి బాలకృష్ణ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు.
బసవతారకం ఆసుపత్రి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి?
హైదరాబాద్లోని ప్రెజెంట్ క్యాంపస్ లో కొత్తగా నార్త్ బ్లాక్ నిర్మించడంతో పాటు, ఏపీ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో కొత్త ఆసుపత్రిని నిర్మించబోతున్నారు.