Sudha Kongara: కోలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని వివాదం ఇండస్ట్రీ వర్గాలను షాక్కు గురిచేస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర తన రెమ్యూనరేషన్ బకాయిల కోసం మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కారు. సంక్రాంతి 2026 సీజన్లో రిలీజైన ‘పరాశక్తి’ సినిమా రైటింగ్, డైరెక్షన్ బాధ్యతలకు గానూ తనకు రావాల్సిన రూ. 8.39 కోట్ల పేమెంట్స్ నిలిచిపోయాయంటూ ఆమె న్యాయ పోరాటానికి దిగారు.
రంగంలోకి దిగిన మద్రాస్ హైకోర్టు.. శాటిలైట్ రైట్స్పై స్టే

సుధా కొంగర దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సంచలన మధ్యంతర ఉత్తర్వులు పాస్ చేసింది. ఈ సినిమాలో లీడ్ ప్రొడ్యూసర్ అయిన ఆకాష్ భాస్కరన్తో పాటు అతని బ్యానర్ 'డాన్ పిక్చర్స్' పార్ట్నర్లపై కోర్టు సీరియస్ అయింది.
జులై 8 వరకు 'పరాశక్తి' సినిమా శాటిలైట్ టెలివిజన్ రిలీజ్, దానికి సంబంధించిన ఎలాంటి కమర్షియల్ డీల్స్ చేయకూడదంటూ ప్రొడ్యూసర్లను కోర్టు ఆదేశించింది. తన ఐపీ రైట్స్ (Intellectual Property) పూర్తిగా బదిలీ చేసినా, అగ్రిమెంట్ ప్రకారం ఫుల్ పేమెంట్ ఇవ్వకుండా మోసం చేశారని సుధా కొంగర కోర్టుకు వివరించారు.
‘ఇదయం మురళి’ సినిమాకు పెద్ద బ్రేక్?
ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. డాన్ పిక్చర్స్ బ్యానర్ నుంచి జులై 10న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్న 'ఇదయం మురళి' సినిమా థియేట్రికల్ రిలీజ్ను కూడా అడ్డుకోవాలని సుధా కొంగర కోర్టును కోరారు.
అథర్వ మురళి, కయదు లోహర్, ప్రీతి ముకుంధన్, ఫహాద్ ఫాజిల్, తమన్ నటించిన ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ జులై 7న జరగబోయే తదుపరి విచారణలో కోర్టు గనుక ఈ సినిమా రిలీజ్పై స్టే విధిస్తే, ప్రొడ్యూసర్లపై మరింత ఒత్తిడి పెరగనుంది.
సినీ ఇండస్ట్రీలో మహిళా డైరెక్టర్లపై వివక్షపై ఫైట్
సుధా కొంగర ఈ కేస్ను కేవలం తన వ్యక్తిగత రెమ్యునరేషన్ కోసమే కాకుండా, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకులు ఎదుర్కొంటున్న కాంట్రాక్చువల్ అన్యాయాలు, రెమ్యూనరేషన్లో వివక్షపై ఒక పెద్ద పోరాటంగా అభివర్ణించారు.
{{/usCountry}}సుధా కొంగర ఈ కేస్ను కేవలం తన వ్యక్తిగత రెమ్యునరేషన్ కోసమే కాకుండా, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకులు ఎదుర్కొంటున్న కాంట్రాక్చువల్ అన్యాయాలు, రెమ్యూనరేషన్లో వివక్షపై ఒక పెద్ద పోరాటంగా అభివర్ణించారు.
{{/usCountry}}'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా) లాంటి నేషనల్ అవార్డ్ బ్లాక్బస్టర్ ఇచ్చిన డైరెక్టర్కే ఇలాంటి పరిస్థితి వస్తే, మిగతా మహిళా టెక్నీషియన్ల పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది.
పరాశక్తి కలెక్షన్స్ బాగున్నా.. రెమ్యూనరేషన్ ఎగ్గొట్టారా?
శివకార్తికేయన్, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన 'పరాశక్తి' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించిందని ప్రొడక్షన్ హౌస్ గతంలో ప్రకటించింది. సుధా కొంగర టోటల్ రెమ్యూనరేషన్ రూ. 15 కోట్లు కాగా, కేవలం రూ. 9.31 కోట్లు మాత్రమే చెల్లించి మిగతా మొత్తం ఎగ్గొట్టారని లాయర్లు కోర్టులో వాదించారు. సక్సెస్ ఫుల్ సినిమాతో లాభాలు సంపాదించి, అదే డబ్బుతో కొత్త సినిమా 'ఇదయం మురళి'ని రిలీజ్ చేస్తూ, పాత బకాయిలు తీర్చలేమనడం అన్యాయమని సుధా కొంగర తరపు లాయర్లు గట్టిగా వాయిస్ వినిపించారు.
ప్రస్తుతం కోర్టు ఈ కేసు కౌంటర్ దాఖలు చేయాలని ప్రొడ్యూసర్లను ఆదేశించింది. జులై మొదటి వారంలో రాబోయే ఫైనల్ జడ్జిమెంట్పైనే ఇప్పుడు కోలీవుడ్ ట్రేడ్ వర్గాల ఫోకస్ అంతా ఉంది.