...
...
Next Story

Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి సిద్ధార్థ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కార్గిల్ వార్ గురించి తెలియని రియల్ స్టోరీ

Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ లో మరో ఇంట్రెస్టింగ్ వార్ డ్రామా వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్ రాబోతోంది. సిద్ధార్థ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సిరీస్ కార్గిల్ యుద్ధంలోని మనకు తెలియని రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కడం విశేషం.

Published on: Jul 10, 2026, 18:42:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Web Series: ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ మరో మైండ్ బ్లోయింగ్ రియల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 1999 కార్గిల్ యుద్ధం నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసాలను కళ్లకు కట్టేలా చూపించే 'ఆపరేషన్ సఫేద్ సాగర్' ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మునుపెన్నడూ చూడని హై ఓల్టేజ్ వార్ ఎపిసోడ్స్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్నట్లు సమాచారం.

రేపే టీజర్ రిలీజ్

Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి సిద్ధార్థ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కార్గిల్ వార్ గురించి తెలియని రియల్ స్టోరీ
Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి సిద్ధార్థ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కార్గిల్ వార్ గురించి తెలియని రియల్ స్టోరీ

ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రేపు అంటే శనివారం (జులై 11) రిలీజ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ ఇది.

ఈ టీజర్ రిలీజ్ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 'ది గోల్డెన్ యారోస్' కార్గిల్ వార్ అన్‌టోల్డ్ స్టోరీ త్వరలోనే టేకాఫ్ కాబోతోందని ఓ పవర్ ఫుల్ మోషన్ వీడియోతో క్యాప్షన్ ఇచ్చింది.

'ది గోల్డెన్ యారోస్' అసలు కథ ఇదే

అసలు 'ఆపరేషన్ సఫేద్ సాగర్' ఏంటంటే.. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లాన్ చేసిన అతిపెద్ద ఆపరేషన్ ఇది. ఈ మిషన్ లో నెంబర్ 17 స్క్వాడ్రన్ అయిన 'ది గోల్డెన్ యారోస్' కీ రోల్ ప్లే చేసింది. మంచు కొండల్లో దాక్కున్న శత్రువుల మీద మన ఫైటర్ జెట్స్ చేసిన భీకర దాడులను ఇప్పుడు వెబ్ సిరీస్ గా నెట్‌ఫ్లిక్స్ మన ముందుకు తీసుకురాబోతోంది.

ఇందులో చాలా భారీ తారాగణమే నటిస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న మన 'బొమ్మరిల్లు' హీరో సిద్దార్థ్ ఈ ప్రాజెక్ట్ తో నెట్‌ఫ్లిక్స్ హిందీ స్పేస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 'చిత్తా' (తెలుగులో చిన్న) సినిమాతో తన యాక్టింగ్ స్కిల్స్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్న సిద్దార్థ్.. ఇప్పుడు ఈ వార్ డ్రామాలో ఒక ఇంటెన్స్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

అలాగే పవర్ ఫుల్ పోలీస్, మిలిటరీ క్యారెక్టర్లకు పెట్టింది పేరైన బాలీవుడ్ సీనియర్ యాక్టర్ జిమ్మీ షెర్గిల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. వీళ్లతో పాటు అందాల తార దియా మీర్జా, వెర్సటైల్ యాక్టర్ ఆదిల్ హుస్సేన్, వినయ్ పాఠక్ లాంటి సీనియర్స్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా 'ముంజ్యా' సినిమాతో 100 కోట్ల హిట్ కొట్టిన యంగ్ సెన్సేషన్ అభయ్ వర్మ, యూట్యూబర్ ప్రజక్తా కోలి కూడా ఈ సిరీస్ లో భాగం కానున్నారు.

గతంలో 'స్కూప్', 'మోనికా ఓ మై డార్లింగ్' లాంటి బ్లాక్ బస్టర్ కంటెంట్ ను ప్రొడ్యూస్ చేసిన మ్యాచ్ బాక్స్ షాట్స్ సంస్థ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ తో కలిసి ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. కుశాల్ శ్రీవాస్తవ, అనిరుద్ధ సేన్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ లో టెక్నికల్ వాల్యూస్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. కార్గిల్ వార్ విజువల్స్ ను చాలా రియలిస్టిక్ గా ఆవిష్కరించేందుకు స్పెషల్ వీఎఫ్ఎక్స్ టీమ్ వర్క్ చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe