OTT Telugu Thriller: డబుల్ డెత్ మిస్టరీ.. ఓటీటీలోకి నెల రోజుల్లోపే వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. అదిరే ట్విస్ట్
OTT Telugu Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుందనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీలో ట్విస్ట్ లు అదిరిపోతాయి. అసలు ఈ సినిమా ఏంటీ? ఏ ఓటీటీలోకి వస్తుంది? అనే విషయాలను ఇక్కడ చూసేయండి.
OTT Telugu Crime Thriller: థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డార్క్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton's 3rd Law) డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. రాజేష్ కర్ణ దర్శకత్వంలో సుమంత్, జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.

న్యూటన్స్ థర్డ్ లా ఓటీటీ
సుమంత్ లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. ఈ చిత్రం ఆగస్టు 27 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’ (ETV Win) స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
“ప్రతి చర్యకూ దానికి సమానమైన, వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది” అనే భౌతిక శాస్త్ర నియమాన్ని (Newton's Third Law) మానవ ప్రవర్తనకు, నేర ప్రపంచానికి ముడిపెడుతూ దర్శకుడు రాజేష్ కర్ణ ఈ కథనాన్ని మలిచారు.
డబుల్ డెత్ మిస్టరీ
న్యూటన్స్ థర్డ్ లా స్టోరీ 1999 నాటి రెండు వేర్వేరు డెత్ మిస్టరీల చుట్టూ తిరుగుతుంది. ఒక కాలేజ్ విద్యార్థి భవనం పైనుంచి పడి అనుమానాస్పదంగా మృతి చెందడం, అదే రోజు అర్ధరాత్రి ఒక ఒంటరి తల్లి హిట్ అండ్ రన్ కేసులో ప్రాణాలు కోల్పోవడం ఇందలోని ప్రధాన పాయింట్లు.
25 ఏళ్ల తర్వాత డేవిడ్ (శ్రీనివాస్ అవసరాల) గుమ్మం ముందుకు ఒక నవల రావడం, ఆ పుస్తకంలోని పేజీలు గతంలో జరిగిన నేరాలను విప్పడం కథలోని అసలు మైండ్ గేమ్కు తెరతీస్తుంది.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్
డబుల్ డెత్ మిస్టరీ కేసును ఛేదించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాసుదేవ్గా సుమంత్ ఎంతో సంయమనంతో కూడిన నటనను కనబరిచారు. రొటీన్ మాస్ పోలీస్ పాత్రలా కాకుండా, ఆధారాలను బట్టి అడుగులు వేసే పక్కా ఇన్వెస్టిగేటర్గా ఆయన పాత్ర నిలుస్తుంది.
ఇక నేర ప్రపంచంలో కనుసైగలతో శాసించే 'మెర్క్యురీ' అనే దయలేని గ్యాంగ్స్టర్ పాత్రలో జగపతి బాబు చూపించిన విలనిజం సినిమాకి ప్రధాన ఆకర్షణ.
విచ్ఛిన్నమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యువకుడిగా త్రినాథ్ వర్మ ఈ క్రైమ్ డ్రామాకు ఎమోషనల్ బలాన్ని అందించారు.
ఈటీవీ విన్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రాటజీ
తెలుగు ఓటీటీ స్పేస్లో 'ఈటీవీ విన్' లోకల్ రా అండ్ రస్టిక్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలకు ప్రధాన అడ్డాగా మారింది. 'నిజమే రుజువైంది' వంటి ప్రాజెక్టుల సరసన ‘న్యూటన్స్ థర్డ్ లా’ చేరడం ద్వారా ఈటీవీ విన్ తన క్రైమ్ అండ్ సస్పెన్స్ లైబ్రరీని మరింత బలోపేతం చేసుకుంది.
థియేటర్లలో పరిమిత స్క్రీన్లతో వచ్చిన ఈ చిత్రాన్ని డిజిటల్ మాధ్యమంలో చూడటానికి మైండ్ బెండింగ్ థ్రిల్లర్ అభిమానులు ఆసక్తి చూపిస్తారు.
పర్పెక్ట్ వాచ్
రొటీన్ క్రైమ్ కథలకు భిన్నంగా 'కర్మ' (Karma) కాన్సెప్ట్ను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్కు జోడించి తీసిన చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. సుమంత్ ఇంటెన్స్ యాక్టింగ్, జగపతి బాబు నెగెటివ్ షేడ్స్, సీట్-ఎడ్జ్ ట్విస్టులు ఇష్టపడేవారికి ఆగస్టు 27 నుంచి ఈటీవీ విన్లో ఇది పర్ఫెక్ట్ వాచ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


