Lock Up OTT: 50 మిలియన్ వ్యూస్ తో దుమ్మురేపిన ఓటీటీ షో.. విన్నర్ గా కంటెంట్ క్రియేటర్ శ్రేయ.. ప్రైజ్ మనీ తెలిస్తే షాక్!

Lock Up OTT: రీసెంట్ గా ఓటీటీలో సంచలనంగా మారిన పాపులర్ రియాలిటీ షో ‘లాక్ అప్ సీజన్ 2’ గ్రాండ్ గా ముగిసింది. ఫినాలేలో కంటెంట్ క్రియేటర్ శ్రేయ కల్రా విన్నర్ గా నిలిచింది. 50 మిలియన్ వ్యూస్ తో ఓటీటీలో అదరగొట్టిన ఈ షోలో శ్రేయ అందుకున్న ప్రైజ్ మనీ ఎంతో ఇక్కడ చూసేయండి. 

Published on: Aug 6, 2026, 09:33:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Lock Up OTT: ఓటీటీలకు క్రేజ్ పెరుగుతున్నా కొద్దీ డిఫరెంట్ షోలు వస్తూనే ఉన్నాయి. అలా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లాక్ అప్’ రియాలిటీ షో ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఈ లాక్ అప్ సీజన్ లో ఫినాలే బుధవారం (ఆగస్టు 5) ముగిసింది. ఈ షోలో కంటెంట్ క్రియేటర్ శ్రేయ కల్రా విన్నర్ గా నిలిచింది.

50 మిలియన్ వ్యూస్ తో దుమ్మురేపిన ఓటీటీ షో.. విన్నర్ గా కంటెంట్ క్రియేటర్ శ్రేయ.. ప్రైజ్ మనీ తెలిస్తే షాక్!
50 మిలియన్ వ్యూస్ తో దుమ్మురేపిన ఓటీటీ షో.. విన్నర్ గా కంటెంట్ క్రియేటర్ శ్రేయ.. ప్రైజ్ మనీ తెలిస్తే షాక్!

విన్నర్ శ్రేయ కల్రా

ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరించిన ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో ‘లాక్ అప్: సచ్ యా సజా’ సీజన్ 2 (Lock Upp: Sach Ya Sazaa Season 2) గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ప్రారంభం నుంచి విపరీతమైన డ్రామా, గొడవలు, వివాదాలతో దాదాపు 50 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించిన ఈ షోలో కంటెంట్ క్రియేటర్, రియాలిటీ షో స్టార్ శ్రేయ కల్రా (Shreya Kalra) ట్రోఫీ దక్కించుకుంది.

ప్రైజ్ మనీ ఎంతంటే?

లాక్ అప్ సీజన్ 2లో విన్నర్ గా నిలిచిన శ్రేయ కల్రా భారీ ప్రైజ్ మనీ కూడా ఖాతాలో వేసుకుంది. ఆమె ఏకంగా రూ.1 కోటి.. అంటే అక్షరాల కోటి రూపాయాలు దక్కించుకుంది. బుల్లితెర ప్రముఖ నటి శివాంగి జోషి ఈ ఓటీటీ రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచింది.

ఫినాలే ఎలిమినేషన్లు

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో వచ్చిన లాక్ అప్ సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్ ఉత్కంఠభరితమైన 'అగ్నిపరీక్ష' సవాళ్లతో సాగింది.

  • రామ్ కపూర్ ఎలిమినేషన్: ఫినాలే మొదటి రౌండ్‌లో జరిగిన ఫిజికల్ టాస్క్‌లో ఓడిపోవడంతో సీనియర్ నటుడు రామ్ కపూర్ 5వ స్థానంలో నిలిచి పోటీ నుంచి తప్పుకున్నాడు.
  • శిల్పా షిండే అవుట్: రెండో రౌండ్ 'బ్లఫ్ మాస్టర్' టాస్క్‌లో యోగేష్ రావత్ చాకచక్యంగా శిల్పా షిండేను బోల్తా కొట్టించడంతో ఆమె ఎలిమినేట్ అయింది.
  • జ్యూరీ రౌండ్‌లో ప్రశ్నలు: టాప్ 3 లోకి అడుగుపెట్టిన శ్రేయ కల్రా, శివాంగి జోషి, యోగేష్ రావత్‌లకు సెలబ్రిటీలు, జర్నలిస్టులతో కూడిన జ్యూరీ నుంచి కఠినమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. హర్షద్ చోప్డాతో ఉన్న అనుబంధంపై శివాంగి జోషిని ప్రశ్నించారు. దీంతో యోగేష్ రావత్‌పై ఆయన అహంకారం పట్ల విమర్శలు వచ్చాయి.
  • నాగిన్ కామెంట్స్: అవేజ్ దర్బార్ శ్రేయ కల్రాను 'నాగిన్' అని వ్యాఖ్యానించడమే కాకుండా, ఫ్రెండ్స్‌కు నమ్మకద్రోహం చేసిందని ఆరోపించాడు. ఈ రౌండ్ ఓటింగ్ తర్వాత యోగేష్ రావత్ 3వ స్థానంలో నిలిచి ఎలిమినేట్ అయ్యాడు.

ఓటింగ్‌తో బిగ్ విక్టరీ

చివరి ఘట్టంలో టాప్ 2 గా నిలిచిన శ్రేయ కల్రా, శివాంగి జోషిల మధ్య విజేతను ఎన్నుకోవడానికి మాజీ కంటెస్టెంట్లు, జైలర్లు, 'జంటా కీ జ్యూరీ' (Janta Ki Jury) ఓటింగ్ నిర్వహించారు.

మెజారిటీ ఓట్లు శ్రేయకు రావడంతో ఆమెను విజేతగా ప్రకటించారు. విజేతగా తన పేరు వినగానే శ్రేయ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోగా, ఆమె సన్నిహితురాలు శిల్పా షిండే ఆనంద భాష్పాలు రాల్చింది.

శ్రేయ కల్రా ఎలా గెలిచింది?

పెద్ద టీవీ స్టార్ ఇమేజ్ ఉన్న శివాంగి జోషిని దాటుకుని కంటెంట్ క్రియేటర్ శ్రేయ కల్రా టైటిల్ గెలిచింది. లాక్ అప్ సీజన్ 2 మొదటి రోజు నుంచే ఆకాంక్ష చమోలా పర్సనల్ లైఫ్ విశ్లేషణలు, శిల్పా షిండే ఎంట్రీ, శ్రేయ కల్రా హౌస్‌మేట్స్‌తో పెట్టుకున్న గొడవలతో డిజిటల్ స్పేస్‌లో ట్రెండ్ క్రియేట్ అయింది.

శివాంగి జోషి లాంటి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న నటిని దాటుకుని శ్రేయ గెలవడానికి కారణం ఆమె చూపించిన అగ్రెసివ్ అండ్ రా గేమ్‌ప్లాన్. కేవలం పాపులారిటీ మాత్రమే కాకుండా, 'సచ్ యా సజా' కాన్సెప్ట్‌కు తగ్గట్లు భయం లేకుండా పాయింట్స్ మాట్లాడటం, షో వ్యాప్తంగా వివాదాలను డ్రైవ్ చేయడంలో శ్రేయ చూపించిన చొరవే ఆమెను రూ.1 కోటి విజేతగా నిలిపింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More