Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో విరాట్, చంద్రకళ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే క్రాంతి వస్తాడు. క్రాంతి, విరాట్ చంద్రకళకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుతారు. తర్వాత ల్యాండ్ ఇష్యూలో లింక్డ్ డాక్యుమెంట్ మిస్ అయిందని క్రాంతి చెబుతాడు.
అమ్మిన వారి సంతకం కావాలి

ఆ మాటలు విన్న శాలిని ఆ డాక్యుమెంట్ తానే దొంగలించినట్లు గుర్తు చేసుకుంటుంది. ఆ డాక్యుమెంట్ను మళ్లీ తీసుకోవచ్చటా. కానీ, దానికి అమ్మిన వారి సైన్ కావాలట అని క్రాంతి చెబుతాడు. అదేముంది ఆయన మాదాపూర్లో ఉంటాడు. వెళ్లి సైన్ చేయించుకోవచ్చు అని విరాట్ అంటాడు. దాంతో క్రాంతి వెళ్లిపోతాడు.
అంత కష్టపడి డాక్యుమెంట్ దొంగలిస్తే మల్లీ రీగేయిన్ చేయొచ్చాంటారేంటీ. అది పూర్తయ్యాకా చూద్దాం అని శాలిని వెళ్లిపోతుంది. జల్రాజు ట్రావెల్ బిజినెస్ పెడుతున్నాడు. రేపే ఓపెనింగ్. అందరిని రమ్మన్నాడు అని చంద్రకళ చెబుతుంది. మరుసటి రోజు ఉదయం ట్రావెల్ బిజినెస్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి.
జల్రాజ్కు ఎవరు డబ్బు ఇస్తున్నారో తెలిస్తే ఆపేదాన్ని అని శ్రుతి అనుకుంటుంది. రాజ్ గురించి గొప్పగా చెబుతుంది తల్లి సరోజా. శ్రుతి సెటైర్లు వేస్తుంది. ఎంత ట్రై చేసిన నీ అప్పులు తీర్చనివ్వను అని శ్రుతి అనుకుంటుంది. ఇంతలో రఘురాం ఫ్యామిలీ వస్తుంది. జగదీశ్వరి, రఘురాంతో రిబ్బన్ కట్ చేయిస్తాడు జల్రాజ్. లోపల జ్యోతి ప్రజ్వలన చేస్తారు.
దుబాయ్ వెళ్లారు
మరోవైపు తనకు ల్యాండ్ అమ్మిన వ్యక్తి పురుషోత్తం దగ్గరికి విరాట్ వెళ్తాడు. ఆయన దుబాయ్ వెళ్లారని చెబుతాడు మేనేజర్. తన విషయం గురించి విరాట్ చెబుతాడు. అయితే రెండు మూడు రోజులు పడుతుంది. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆయన కాల్ చేస్తే చెబుతాను అని అతను అని నెంబర్ తీసుకుంటాడు. దాంతో విరాట్ వెళ్లిపోతాడు. ఇంతలో విరాట్కు మేనేజర్ కాల్ చేసి కస్టమర్స్ అంతా మనీ రిటర్న్ అడుగుతున్నారని, విషయం అందరికి తెలిసిపోయిందని అంటాడు.
మన సేల్స్ కూడా పడిపోతున్నాయని అతను చెబుతాడు. మీరు ఒక పదిరోజులు గడువు అడిగి తీసుకోండి. ఈలోపు నేను సమస్య పరిష్కరిస్తాను అని విరాట్ చెబుతాడు. ఇంకెన్ని పరీక్షలు పెడతాడో దేవుడు అని విరాట్ అనుకుంటాడు. రోడ్డు నడి మధ్యలో ఓ అమ్మాయి నడుస్తూ వెళ్తుంది. అది విరాట్ చూసి అలా నడుస్తోంది ఏంటని అనుకుంటాడు.
{{/usCountry}}మన సేల్స్ కూడా పడిపోతున్నాయని అతను చెబుతాడు. మీరు ఒక పదిరోజులు గడువు అడిగి తీసుకోండి. ఈలోపు నేను సమస్య పరిష్కరిస్తాను అని విరాట్ చెబుతాడు. ఇంకెన్ని పరీక్షలు పెడతాడో దేవుడు అని విరాట్ అనుకుంటాడు. రోడ్డు నడి మధ్యలో ఓ అమ్మాయి నడుస్తూ వెళ్తుంది. అది విరాట్ చూసి అలా నడుస్తోంది ఏంటని అనుకుంటాడు.
{{/usCountry}}ఆ అమ్మాయి వెనుక వెహికిల్స్ వస్తుంటాయి. ఓ పెద్ద వ్యాన్ రావడంతో వెళ్లి విరాట్ ఆ అమ్మాయిని లాగుతాడు. నన్ను చావనివ్వు అని ఆమె అంటే లాగిపెట్టి కొడతాడు విరాట్. మాయ.. ఏంటీ నువ్వు ఇలా అని గుర్తుపడతాడు విరాట్. మరోవైపు విరాట్ కోసం ఎదురుచూస్తుంది చంద్రకళ. శ్యామల, కామాక్షి దాని గురించి గొడవ పడతారు. ఇంతలో విరాట్ ఇంటికి మాయను తీసుకొస్తాడు.
మాయను పరిచయం చేసిన విరాట్
అది చూసి అంతా షాక్ అవుతారు. తనపేరు మాయ అని, కొన్నిరోజులు మన ఇంట్లోనే ఉంటుందని చెబుతాడు విరాట్. మాయను కామాక్షి తీసుకెళ్లి గది చూపిస్తుంది. మాయ చనిపోడానికి ట్రై చేసిందని, చూసి కాపాడి తీసుకొచ్చానని విరాట్ చెబుతాడు. ఆ అమ్మాయి బాధ ఏంటో కనుక్కుని పరిష్కరించు అని జగదీశ్వరి చెబుతుంది. మాయ బాధ్యత నాది అని చంద్రకళ చెబుతుంది.
మరోవైపు ట్రావెల్ బిజినెస్ గురించి కస్టమర్స్తో మాట్లాడుతాడు. ఇదంతా వీడికి ఎప్పుడు తెలిసింది అని శ్రుతి అంటే.. తెలుసుకున్నాడే, వాడి పేరులోనే రాజు ఉంది అని సరోజ అంటుంది. మరోవైపు విరాట్, చంద్రకళ ముద్దు పెట్టుకోబోతుంటే మాయ మధ్యలో వస్తుంది. దాంతో ఆగిపోతారు. అలా విరాట్ జీవితంలోకి వచ్చిన మాయ అడ్డుపడుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.