Ninnu kori September 18 Episode: నిన్ను కోరి.. కాబోయే భర్త అంటూ చంద్రకు శ్రీజ వార్నింగ్-జనాలను చూసి చంద్ర షాక్-మిస్టరీ?
Ninnu kori September 18 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 18 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. విరాట్ ను తీసుకురావడానికి చంద్రకు జగదీశ్వరి 3 నెలల గడువు ఇస్తుంది. మరోవైపు సామ్రాట్ ను ఊరి జనాలు దేవుడిలా చూస్తారు. అక్కడ కేర్ టేకర్ గా చేరిన చంద్రకు ఇది షాకింగ్ గా అనిపిస్తుంది.
Ninnu kori September 18 Episode: నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఉత్కంఠ కొనసాగుతోంది. బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ అత్యంత నాటకీయ మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విరాట్ (సామ్రాట్) జ్ఞాపకశక్తి కోల్పోవడంతో ఇంటి సభ్యుల ప్రవర్తన, మరోవైపు ఊరి జనాల రాకతో కథలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మూడు నెలల గడువు
కనిపించకుండా పోయిన విరాట్ కోసం జగదీశ్వరి బాధపడుతుంది. అయితే తాను ఎలాగైనా విరాట్ ను తీసుకొస్తానని అత్త జగదీశ్వరికి చంద్ర చెప్తుంది. అయితే అందుకు జగదీశ్వరి మూడు నెలల గడువు ఇస్తుంది. మూడు నెలల తరువాత ఎట్టి పరిస్థిలోనూ ఇంటికి రావాలి అని చెబుతుంది.
సామ్రాట్ పై శ్రీజ ప్రేమ
మరోవైపు దాక్షాయణి నివాసంలో సామ్రాట్ ముఖంపై ఉన్న విరాట్పై శ్రీజ అతిగా ప్రేమ కురిపిస్తుంది. అతనికి కాఫీ ఇస్తుంది. దీంతో విరాట్ కు కొంత మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో నీలగిరి, గిరిజలు ఎంట్రీ ఇస్తారు.
"శ్రీజను పెళ్లి చేసుకునే సమయానికే నువ్వు కనపడకుండా పోయావు" అని చెప్పడంతో విరాట్ షాక్ అవుతాడు. అయితే విరాట్ ఆరోగ్య పరిస్థితిని గమనించిన డాక్టర్.. అతడికి చంద్ర, మదన్ కేర్టేకర్లుగా ఉండాలని సూచిస్తాడు.
శ్రీజ వార్నింగ్
చంద్ర తన భార్యే అనే సంగతి మర్చిపోయిన విరాట్.. చంద్రను చూసి కాస్త రిలీఫ్ ఫీల్ అవుతాడు. విరాట్ కూడా చంద్రపై ప్రత్యేక నమ్మకం చూపిస్తాడు."నువ్వు నా కోసం వచ్చావు, లేకపోతే నేను ఏమైపోయేవాడినో" అని ఆందోళన వ్యక్తం చేస్తాడు. చంద్ర, మదన్ వల్ల సామ్రాట్కు మేలు జరుగుతోందని భావించిన దాక్షాయణి.. వాళ్లను ఇంట్లోనే ఉండుమంటుంది.
కానీ మరోవైపు సామ్రాట్ రూపంలో ఉన్న విరాట్ పై శ్రీజకు ప్రేమ ఉంటుంది. అందుకే ఆమె చంద్రకు వార్నింగ్ ఇస్తుంది. "నా కాబోయే భర్తతో చనువుగా ఉండొద్దు" అంటూ శ్రీజ చంద్రను హెచ్చరించడం కొత్త వివాదానికి దారితీసేలా ఉంది.
దేవుడిలా సామ్రాట్
మరోవైపు సామ్రాట్ (విరాట్)ను చూడటానికి ఊరి రైతులు, ప్రజలు గుంపుగా తరలివస్తారు. వారిలో ఒక వృద్ధుడు.. "మా భూములను ఆక్రమించుకోకుండా అండగా నిలిచావు, నువ్వు దేవుడివి బాబూ" అంటూ సామ్రాట్ పై ప్రశంసలు కురిపిస్తాడు. అయితే గతం గుర్తులేని విరాట్ ఈ మాటలకు ఎమోషనల్ అవుతాడు.
ఇది చూసిన చంద్ర.. "ఇంత మంచి మనిషిని ఆరోజు దారుణంగా చంపాలనుకున్న ఆ అసలు శత్రువు ఎవరు?" అని ఆలోచనలో పడుతుంది.
తమ్ముడికి చెప్పుకోవాలని
తనకు గతం గుర్తులేనందున సమస్యలన్నీ తన తమ్ముడికి చెప్పుకోవాలని విరాట్ చెప్తుంది. దీంతో నీలగిరి, గిరిజలలో అసహనం వ్యక్తమవుతుంది. పరిస్థితిని గమనించిన దాక్షాయణి విరాట్కు ఎక్కువ స్ట్రెస్ మంచిది కాదని చెప్పి ఊరి జనాలను పంపించివేస్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో సామ్రాట్ గతం ఎప్పుడు బయటపడుతుంది, శ్రీజ కుట్రలను చంద్ర ఎలా తిప్పికొడుతుంది అనేది రాబోయే ఎపిసోడ్లలో ఆసక్తికరంగా మారనుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


